9, ఆగస్టు 2020, ఆదివారం

పార్వతీపతిం ప్రణౌమి సతతం - ముత్తుస్వామి దీక్షితుల వారు

పార్వతీపతిం ప్రణౌమి సతతం ఆశ్రితజన మందారం శశిధరం

పర్వత రాజ నుత పదాంబుజం భద్రప్రద కైలాస విరాజం
గర్విత త్రిపురాది హర చతురం గురుగుహ వందిత శివ శంకరం

శరణుకోరిన జనులకు పాలిట కల్పవృక్షమైన, చంద్రుని ధరించిన, పార్వతీదేవి పతి అయిన పరమశివునికి ఎల్లప్పుడూ నమస్కరించెదను. పర్వతరాజైన హిమవంతునిచే పూజించబడిన పదకమలములు గలవాడు, కైలాసపర్వతముపై స్థిరుడై ప్రకాశిస్తూ రక్షణము కలిగించేవాడు, గర్వాంధులైన త్రిపురాసురులు మొదలైన వారిని హరించిన చతురుడు, కుమారస్వామికి వంద్యుడు, శుభములను కలిగించే పరమశివునికి ఎల్లప్పుడూ నమస్కరించెదను.

- ముత్తుస్వామి దీక్షితుల వారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి