30, ఆగస్టు 2020, ఆదివారం

రామచంద్రం భావయామి - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి

 రామచంద్రం భావయామి రఘుకుల తిలకం ఉపేంద్రం

భూమిజా నాయకం భుక్తి ముక్తి దాయకం
నామ కీర్తన తారకం నరవరం గత మాయికం

సాకేత నగరే నివసంతం సామ్రాజ్య ప్రద హనుమంతం
రాకేందు వదనం భగవంతం రమణీయ కళ్యాణ గుణవంతం
కాకుథ్సం ధీమంతం కమలాక్షం శ్రీమంతం
నాకేశ నుతమనంతం నర గురు గుహ విహరంతం

రఘుకుల తిలకుడు, శ్రీహరి అయిన శ్రీరామచంద్రుని ధ్యానిస్తున్నాను. భూమిజయైన సీతాదేవి నాయకుడు, భుక్తిని ముక్తిని ప్రసాదించేవాడు, నామకీర్తనతో తరింపజేసేవాడు, నరవరుడు, మాయాతీతుడు అయిన శ్రీరామచంద్రుని ధ్యానించుచున్నాను. సాకేత నగరంలో నివసించేవాడు, హనుమంతునికి భక్తి సామ్రాజ్యాన్ని ఒసగిన వాడు, పూర్ణచంద్రుని వంటి ముఖము కలవాడు, భగవంతుడు, మనోజ్ఞమైన రూపము కలవాడు, శుభకరమైన గుణములు కలవాడు, కాకుథ్స కులమునందు జన్మించిన వాడు, కలువలవంటి కన్నులు కలవాడు, శ్రీమంతుడు, ఇంద్రునిచే నుంతించబడిన అనంతుడు, నరరూపములో గురుగుహుని మనసులో విహరించే వాడు అయిన శ్రీరామచంద్రుని ధ్యానించుచున్నాను.

వసంత రాగంలో కూర్చబడిన ఈ కృతిని గాయత్రి వెంకటరాఘవన్ గారు ఆలపించారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రోజులు మారాయి – 1955: చిత్ర విశేషాలు

1955లో విడుదలైన రోజులు మారాయి సారథి ఫిలిమ్స్ నిర్మించిన సామాజిక చిత్రం. 1939లో రైతుబిడ్డ ద్వారా రైతుల సమస్యలను తెరపైకి తీసుకొచ్చిన సారథి సంస...