30, ఆగస్టు 2020, ఆదివారం

శ్రీరాజరాజేశ్వరి త్రిపురసుందరి - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి


 

శ్రీరాజరాజేశ్వరి త్రిపురసుందరి శివే పాహి మాం వరదే

నీరజాసనాది పూజితపరే నిఖిల సంశయ హరణ నిపుణతరే

శౌరి విరించ్యాది వినుత సకలే శంకర ప్రాణ వల్లభే కమలే
నిరతిశయ సుఖ ప్రదే నిష్కళే పూర్ణ చంద్రికా శీతలే విమలే
పరమాద్వైత బోధితే లలితే ప్రపంచాతీత గురుగుహ మహితే
సురుచిర నవరత్న పీఠస్థే సుఖతర ప్రవృత్తే సుమనస్థే

ఓ రాజరాజేశ్వరీ! త్రిపురసుందరీ! పరమశివుని అర్థాంగీ! వరములనొసగే తల్లీ! నన్ను కాపాడుము. బ్రహ్మాది దేవతలచే పూజించబడే పరదేవతవు, సమస్త సంశయములను నాశనము చేసే నైపుణ్యము కలదానవు నీవు. విష్ణువు, బ్రహ్మ మొదలైన వారిచే నుతించబడి అంతటా ఉన్నావు, కలువ వలె మనోహరముగా ఉన్న శంకరునికి ప్రియసతివి నీవు. నిరుపమానమైన సుఖమునొసగే నిష్కళంకవు, పూర్ణచంద్రుని వలె చల్లదనమునిచ్చే విమలవు నీవు. పరమోన్నతమైన అద్వైతాన్ని బోధించే లలితవు, ప్రపంచాతీతమైన మహిమ కలదానవని సుబ్రహ్మణ్యునిచే నుతించబడినావు నీవు. రమణీయమైన నవరత్న పీఠముపై స్థితమై సచ్చిదానందము కలిగిస్తున్నావు, నిర్మలమైన మనసులలో నివసిస్తున్నావు నీవు. నన్ను కాపాడుము.

పూర్ణచంద్రిక రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని అభిషేక్ రఘురాం గారు ఆలపించారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి