30, ఆగస్టు 2020, ఆదివారం

శ్రీ సరస్వతి నమోస్తుతే - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి


శ్రీ సరస్వతి నమోస్తుతే వరదే పరదేవతే

శ్రీపతి గౌరీపతి గురుగుహ వినుతే విధి యువతే

వాసనాత్రయ వివర్జిత వర ముని భావిత మూర్తే
వాసవాద్యఖిల నిర్జర వర వితరణ బహు కీర్తే దర
హాసయుత ముఖాంబురుహే అద్భుత చరణాంబురుహే
సంసార భీత్యాపహే సకల మంత్రాక్షర గుహే

ఓ సరస్వతీ దేవీ! వరములనొసగే పరదేవతవు, విష్ణువు, శివుడు, సుబ్రహ్మణ్యునిచే నుతించబడేవు, బ్రహ్మకు పత్నివి, నీకు నమస్సులు. లోకవాసన, దేహవాసన, శాస్త్ర వాసనలను వర్జించిన మునిశ్రేష్ఠులచే భావించబడిన రూపానివి, ఇంద్రాది దేవతలచే ఉదారముగా వరములొసగే దేవతగా అనేక విధాల కీర్తించబడినావు, చిరునవ్వుతో కూడిన ముఖకమలము, అద్భుతమైన చరణకమలములు కలిగినదానవు, సంసార భీతులను తొలగించే తల్లివి, సకల మంత్రాక్షరముల రహస్యము నీవు, నీకు నమస్సులు.

ఆరభి రాగంలో కూర్చబడిన ఈ కృతిని సుధా రఘునాథన్ గారు ఆలపించారు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి