30, ఆగస్టు 2020, ఆదివారం

బాగాయనయ్యా నీ మాయలెంతో - సద్గురువులు త్యాగరాజస్వామి


 

బాగాయనయ్యా నీ మాయలెంతో బ్రహ్మకైన కొనియాడ తరమా?

ఈ గారడములనొనరించుచును నే గాదనుచు బల్కేదియును

అలనాడు కౌరవులనణచమన అలరి దోసమనే నరుని జూచి పాప
ఫలము నీకు తనకు లేదని చక్కగ పాలనము సేయలేదా త్యాగరాజనుత!

ఓ శ్రీకృష్ణా! బ్రహ్మకు కూడా పొగడుటకు తరము కాని నీ మాయలెంతో బాగున్నవయ్యా! ఈ మాయలన్నీ నీవే చేస్తూ నేను కాదని పలికేవు. ఆ నాడు కురుక్షేత్రములో కౌరవులను నాశనం చేయమని చెప్పగా ఆ అర్జునుడు అది దోషమని దుఃఖించగా, తనకు పాపము కలుగదు కర్మఫలము నాది అని చక్కగా కర్తవ్యబోధ చేయలేదా! ఇటువంటి నీ మాయలు బ్రహ్మకు కూడా కొనియాడ శక్యము కానివి.

చంద్రజ్యోతి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి