30, ఆగస్టు 2020, ఆదివారం

నీరజాక్షి కామాక్షి - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి


నీరజాక్షి కామాక్షి నీరద చికురే త్రిపురే

శారద రమా నయనే సారస చంద్రాననే
వారిజ పాదే వరదే తారయ మాం తత్వ పదే

గౌరీ హిందోళ ద్యుతి హీర మణిమయాభరణే
శౌరి విరించి వినుత శివశక్తిమయ నవావరణే
నారీమణ్యాద్యర్చిత నవనాథాంతఃకరణే
సూరి జన సంసేవిత సుందర గురుగుహ కరణే

ఓ కామాక్షీ! నీవు కలువల వంటి కన్నులు గల దానవు, నల్లని మేఘములు కురులు కల త్రిపురసుందరివి! లక్ష్మీ సరస్వతులను కన్నులుగ గలదానవు, శరదృతువులో చంద్రుని వంటి ముఖము కలదానవు, కమలముల వంటి పదములు కలిగి వరములనొసంగే తల్లివి, జ్ఞానమునొసగి నన్ను తరింపజేసెదవు! హిందోళ రాగములో నుతించబడే గౌరివి! వజ్రములు, మణులుతో పొదగబడిన ఆభరణములు ధరించినదానవు, విష్ణువు, బ్రహ్మలఏ నుతించబడినావు, శివశక్తిమయమై నవావరణములు కలిగిన శ్రీచక్రములో భాసిల్లుచున్నావు, నారీమణులచే అర్చించబడే తల్లివి, నవనాథుల అంతఃకరణములో నివసించేదానవు, పండితులచే పూజించబడేదానవు, సుందరుడైన సుబ్రహ్మణ్యునికి జననివి!

హిందోళ రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని రంజని గాయత్రి సోదరీమణులు ఆలపించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి