30, ఆగస్టు 2020, ఆదివారం

సరసిజనాభ సోదరి - ముత్తుస్వామి దీక్షితుల వారు

సరసిజనాభ సోదరి! శంకరి! పాహిమాం!

వరదాభయ కరకమలే! శరణాగత వత్సలే!

పరంధామ ప్రకీర్తితే! పశుపాశ విమోచితే!
పన్నగాభరణయుతే! నాగగాంధారీ పూజితాబ్జపదే!
సదానందితే! సంపదే! వర గురుగుహ జనని! మదశమని!
మహిషాసురమర్దిని! మందగమని! మంగళవరప్రదాయిని!

కమలము నాభియందు గల విష్ణు సోదరియైన శంకరి! నీవే నాకు శరణు. వరద, అభయ ముద్రలతో కలువల వంటి కరములు కలిగి శరణు కోరిన వారి పాలిట వాత్సల్యము కలిగిన శంకరి! నీవే నాకు శరణు. శ్రీహరిచే నుతించబడి, జీవులకు బంధనాల నుండి విముక్తి కలిగించే, నాగాభరణుడైన శివునితో యుండే, నాగగాంధారి రాగంలో నుతించబడిన చరణకమలములు కలిగిన, ఎల్లప్పుడూ ఆనందములో నుండి సంపదలకు రూపమైన, గురుగుహుడైన సుబ్రహ్మణ్యునికి జననియైన, దుష్టుల మదమును అణచివేసే, మహిషాసురుని సంహరించిన, నిదానముగా నడచే, శుభకరమైన వరములను ప్రసాదించే శంకరి! నీవే నాకు శరణు.

నాగగాంధారి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని నిషా రాజగోపాలన్ గారి ఆలపించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి