21, ఆగస్టు 2020, శుక్రవారం

వందేऽనిశమహం - మైసూరు వాసుదేవాచార్యుల వారు

వందేऽనిశమహం వారణ వదనం 
నందీశ వాహన వర నందనం

వందారు మండల విఘ్న వారణం 
బృందారకాద్యపి వందిత చరణం

భాసమాన పాశాంకుశధరం 
భూసురాది పరిపాలనపరం
భాసుర మణి భూషిత కంధరం 
వాసుదేవ చరణార్చనతత్పరం

నమస్కరించే భక్త సమూహముల విఘ్నాలను తొలగించేవాడు, పాశము మరియు అంకుశము ధరించి ప్రకాశించేవాడు, బ్రాహ్మణాదులను రక్షించుటలో నిమగ్నమై యుండేవాడు, ప్రకాశించే మణులు అలంకరించబడిన కంఠము కలిగిన వాడు, శ్రీమహావిష్ణువు చరణముల సేవా తత్పరుడు, నందీశ్వరుడు వాహనంగా కలిగిన పరమశివుని వరపుత్రుడు, గజముఖుడైన గణపతికి నేను ఎల్లప్పుడు నమస్కరించెదను. 

- మైసూరు వాసుదేవాచార్యుల వారు

https://www.youtube.com/watch?v=hRO1jASSbbA

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రోజులు మారాయి – 1955: చిత్ర విశేషాలు

1955లో విడుదలైన రోజులు మారాయి సారథి ఫిలిమ్స్ నిర్మించిన సామాజిక చిత్రం. 1939లో రైతుబిడ్డ ద్వారా రైతుల సమస్యలను తెరపైకి తీసుకొచ్చిన సారథి సంస...