30, ఆగస్టు 2020, ఆదివారం

బాలమురళీకృష్ణ గారు - త్యాగరాజ శిష్యపరంపర


ఏవండీ బాలమురళి గారు త్యాగరాజ శిష్యపరంపర వారెలా అయ్యారు? ఆ రహస్యం ఆయనే చెప్పారు.

త్యాగరాజస్వామి (1767-1847) వారి బంధువు, వారి శిష్యుడు ఆకుమడుగుల (మానాంబుచావడి) వేంకట సుబ్బయ్య గారు (1803-1862) త్యాగయ్యతో ఎన్నో ఏళ్లు కలిసి తిరువాయూరులో జీవించారు. వీరు త్యాగరాజస్వామి ఆలపించిన కృతులను స్వరాలతో అప్పటికప్పుడు వ్రాశారు. వీరి సంగతి తెలుసుకున్న సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి గారు (1860-1917, సినిమా సుసర్ల దక్షిణామూర్తి గారు కాదు). ఆంధ్ర నుండి తిరువాయూరు వెళ్లి వారి ఆశీర్వాదం కోరారు. వారి శ్రీమతికి తన కోరికను విన్నవించారు. దాదాపు ఎనిమిది నెలల తరువాత వేంకటసుబ్బయ్య గారు దక్షిణామూర్తి గారిని అనుగ్రహించి ఆశీర్వదించారు. "నేను ఇంకొన్నాళ్లలో మరణిస్తాను, తరువాత వచ్చి నా భార్యను అడిగి కృతుల సాహిత్యం తీసుకు వెళ్లు" అని తెలిపారు. అలా త్యాగరాజస్వామి వారి సాహిత్యం ఆంధ్ర దేశానికి వచ్చింది. ఆ దక్షిణామూర్తి గారి శిష్యులు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు (1883-1951). వారి శిష్యులు బాలమురళీకృష్ణ గారు (1930-2016). ఆ విధంగా 750 త్యాగయ్య కృతులు మనకు వారి ద్వారా అందాయి.

కాబట్టి, బాలమురళి గారు ఆలపించే రీతి, ఆయన గానం చేసిన త్యాగయ్య కృతుల సాహిత్యం సద్గురువుల వారి మూలాలను ప్రతిబింబిస్తాయి అన్నది మనం గ్రహించాలి. వీలైనంత దానిని అనుసరిస్తే త్యాగయ్య సాహిత్యాన్ని, స్వరాలను కాపడినట్లే. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి