4, ఆగస్టు 2020, మంగళవారం

సన్న్యాస సూక్తం - మహానారాయణోపనిషత్తు


న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః
పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజదేతద్యతయో విశంతి

వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాస యోగాద్యతయశ్శుద్ధసత్త్వాః
తే బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృతాత్పరిముచ్యంతి సర్వే

దహ్రం విపాపం పరమేశ్మభూతం యత్పుండరీకం పురమధ్యసగ్గ్ స్థం
తత్రాపి దహ్రం గగనం విశోకస్తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం

యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః
తస్య ప్రకృతి లీనస్య యః పరస్స మహేశ్వరః

కర్మలు చేయటం, సంతానం, ధన సముపార్జన వల్ల ముక్తి కలుగదు, త్యజించుట వల్లనే అమృతత్వము లభిస్తుంది. స్వర్గమును మించినదైన ఈ స్థితి ఎంతో నిగూఢమై సన్యాసుల హృదయాలలో ప్రకాశిస్తుంది. వేదాంత విజ్ఞానము సునిశ్చితముగా కలిగి, సన్యాసయోగమును శుద్ధ అంతఃకరణముతో పాటించినవారికి, సచ్చిదానందస్థితిలోనున్న వారికి దేహాంత సమయములో విముక్తిని పొందెదరు. దేహమనే నగరం మధ్యలో సూక్ష్మమైన హృదయ కమలముంటుంది. నిర్మలమైనది, పవిత్రమైనది అయిన ఈ హృదయ కమలం పరమాత్మకు నివాసం. సూక్ష్మరూపమై, శోకాతీతమై యున్న ఆ పరమాత్మను ఉపాసన చేయుము. సనాతనమైన శబ్దంగా వేదాలలో వివరించబడిన ఓంకార నాదం వేదాంతములలో (ఉపనిషత్తులలో) పరమ సత్యముగా నిరూపించబడినది. ఇది భౌతికానికి అతీతమని గ్రహించినవాడే పరమేశ్వరుడు.

-సన్న్యాస సూక్తం (మహానారాయణోపనిషత్తు నుండి)

1 కామెంట్‌: