18, జనవరి 2011, మంగళవారం

శ్రీమచ్ఛంకరభగవత విరచిత మనీషాపంచకం - తాత్పర్యము

శంకర భగవత్పాదులు కాశీలో నివసిస్తున్నప్పటి సంఘటన ఇది. ఒక రోజు శంకరులు గంగానదిలో స్నానం ముగించుకుని శిష్యులతో కలిసి విశ్వనాథుని మందిరానికి వెళుతున్నప్పుడు ఒక నిమ్న జాతికి చెందిన వాడు ఎదురు పడతాడు. అప్పటి ఆచారాల ప్రకారం శంకరులు  వాడిని తప్పుకో, దారి విడువుము అని అంటాడు. అప్పుడా చండాలుడు నీవు తప్పుకోమంటున్నది ఈ దేహమునా? నా ఆత్మనా? అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శంకరులు తన అహంకారానికి పశ్చాత్తాపపడి ఆ చండాలుని పరమశివునిగా గ్రహించి ప్రణమిల్లుతాడు. ఆ సందర్భంలో చండాలుని రూపములో ఉన్న శివుడు శంకరుని ఉద్దేశించి వేసిన ప్రశ్నలు మొదటి రెండు శ్లోకములు, అటు తర్వాత శంకరుల నోట వెలువడిన మనీషా పంచకం.

అద్వైతామృత సారమైన ఈ మనీషా పంచకం పరబ్రహ్మమొక్కటే అన్న సందేశాన్ని శంకర భగవత్పాదుల నోట మనకు అందించబడినది. తనలో ఉన్న ఆఖరి దుర్గుణమును ఈ సందర్భముగా శంకరులు దగ్ధము చేసుకునే అవకాశమును ఆ పరమ శివుడు చండాలుని రూపములో కలిగించాడు.  ఈ పంచకము, తాత్పర్యము.



అన్నమయాదన్నమయమథవా చైతన్యమేవ చైతన్యాథ్
యతివర దూరీకర్తుం వాంఛసి కిం బ్రూహి గచ్ఛ గచ్ఛేతి

ఓ యతివరా! దూరము వెళ్ళుము దూరము వెళ్ళుము అని అంటున్నావు నన్ను. అది ఒక ఆహారము తిన్న శరీరము ఇంకొక ఆహారము తిన్న శరీరమును అంటున్న మాటయా? లేక  ఒక చైతన్యము ఇంకొక చైతన్యమునా? దేనిని పొమ్మని అంటున్నావు?  చెప్పుము.

ప్రత్యగ్వస్తుని నిస్తరంగసహజానందావభోధాంబుధౌ
విప్రోఽయం శ్వపచోఽయమిత్యపి మహాంకోఽయం  విభేధభ్రమః
కిం గంగాంబుని బింబితేఽంబరమణౌ చాండాలవీథీపయః
పూరే వాఽంతరమస్తి కాంచనఘటీమృత్కుంభయోర్వాఽంబరే

ఎలాగైతే సూర్యుని ప్రతిబింబము నిశ్చలమైన నీటిపై స్పష్టంగా కనిపిస్తుందో అలాగే పరబ్రహ్మము ఈ చరాచర సృష్టిలోని ప్రతి వస్తువులోను స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఎందుకు ఈ అయోమయము? సందిగ్ధము? పవిత్ర గంగానదిలో కనిపించే సూర్యుని ప్రతిబింబానికి, ఒక చండాలుడు ఉండే వీధిలోని నీటిలో కనిపించే సూర్యుని ప్రతిబింబానికి తేడా ఏమైనా ఉందా? అలాగే నీటిని కలిగిన ఉన్న బంగారు మరియు మట్టి పాత్రల వలన ఈ రెండిటిలో ఉన్న నీటికి ఏమైనా భేదము కలదా?

          మనీషాపంచకం

జాగ్రత్స్వప్నసుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజ్జృంభతే
యా బ్రహ్మాదిపిపీలికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణీ
సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢప్రజ్ఞాపి యస్యాస్తి చే-
చ్చాండాలోఽస్తు స తు ద్విజోఽస్తు గురురిత్యేషా మనీషా మమ  ౧

ఎవరైతే - తనలో ఉన్న ఆత్మ పరబ్రహ్మ రూపమై జాగ్రత్, స్వప్న, సుషుప్తావస్థలలో అవగతమవుతుందో, అదే ఆత్మ చీమలో కూడా ఉందని, అది చేతనమై, అగోచరమై, సాక్షియై ఉన్నదని - తెలుసుకున్నాడో వాడే అత్యుత్తమమైన గురువు/తత్త్వవేత్త - వాడు చండాలుడైన నేమి బ్రాహ్మణుడైన నేమి.

బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్రవిస్తారితం
సర్వం చైతదవిద్యయా త్రిగుణయాఽశేషం మయా కల్పితమ్
ఇత్థం యస్య దృఢా మతిః సుఖతరే నిత్యే పరే నిర్మలే
చాండాలోఽస్తు స తు ద్విజోఽస్తు గురురిత్యేషా మనీషా మమ  ౨

అజ్ఞానము, త్రిగుణముల (సత్త్వ, రజస్,  తమో గుణములు) వలన ఈ విశ్వము వేర్వేరు రకములైన జీవులతో ఉన్నట్లు అనిపించినప్పటికీ, ఏ పరబ్రహ్మ రూపమున ఈ విశ్వమున్నదో, నిరంతర ఆ పరబ్రహ్మ ధ్యాసతో, తానే పరబ్రహ్మమని గ్రహించిన వాడే ఉత్తమైన గురువు - వాడు చండాలుడైన నేమి బ్రాహ్మణుడైన నేమి.

శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురో-
ర్నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశతా నిర్వ్యాజశాంతాత్మనా
భూతం భాతి చ దుష్కృతం ప్రదహతా సంవిన్మయే పావకే
ప్రారబ్ధాయ సమర్పితం స్వవపురిత్యేషా మనీషా మమ  ౩

ఈ విశ్వము ఒక అశాశ్వతమైన మాయయని, ఈ శరీరము ఆ పరమాత్మను శాంతముతో, సంపూర్ణ విశ్వాసముతో ధ్యానించుటకు, తద్వారా పాపములను ఆ పవిత్రమైన అగ్ని యందు దాహించుటకు ఇవ్వబడినదియని సెప్పిన గురువుల మాటను నేను పూర్తిగా నమ్ముతున్నాను.
 
యా తిర్యఙ్నరదేవతాభిరహమిత్యంతః స్ఫుటా గృహ్యతే
యద్భాసా హృదయాక్షదేహవిషయా భాంతి స్వతోఽచేతనాః
తాం భాస్యైః పిహితార్కమండలనిభాం స్ఫూర్తిం సదా భావయ-
న్యోగీ నిర్వృతమానసో హి గురురిత్యేషా మనీషా మమ  ౪

మేఘములచే కప్పబడిన సూర్యుని వలె అజ్ఞానము జీవిని పరమాత్ముని కానకుండా చేయుచున్నది. ఆ పరబ్రహ్మము వలన ఈ చరాచర సృష్టి యందు కార్యములు జరుగుతున్నవని, ఆ సత్యమును తనయందే గ్రహించిన యోగి  ఉత్తమమైనవాడు అని నా అభిప్రాయము.

యత్సౌఖ్యాంబుధిలేశలేశత ఇమే శక్రాదయో నిర్వృతా
యచ్చిత్తే నితరాం ప్రశాంతకలనే లబ్ధ్వా మునిర్నిర్వృతః
యస్మిన్నిత్యసుఖాంబుధౌ గలితధీర్బ్రహ్మైవ న బ్రహ్మవిద్
యః కశ్చిత్స సురేంద్రవందితపదో నూనం మనీషా మమ  ౫

ఇంద్రాది దేవతలచే పూజించబడే పరబ్రహ్మముపై నిరంతర ధ్యానము కలిగిన వాడు, పరిపూర్ణ శాంతుడై యుండును. అట్టివాడు ఆ పరబ్రహ్మమును తెలిసికొని యున్నాడు అని, అతడే ఆ పరబ్రహ్మ అని నా పూర్తి నమ్మకము.

దాసస్తేఽహం దేహదృష్ట్యాఽస్మి శంభో
జాతస్తేంఽశో జీవదృష్ట్యా త్రిదృష్టే
సర్వస్యాఽఽత్మన్నాత్మదృష్ట్యా త్వమేవే-
త్యేవం మే ధీర్నిశ్చితా సర్వశాస్త్రైః

ఓ శంభో! నేను ఈ శరీర రూపముతో  నీ సేవకుడను. ఓ త్రినేత్రా! జీవ రూపములో నేను నీలో ఒక భాగమును. ఆత్మ రూపములో నీవు నా యందు, మరి సమస్త జీవకోటి యందు యున్నావు. నేను నా బుద్ధి ద్వారా, శాస్త్రముల ద్వారా ఈ విషయమును గ్రహించి యున్నాను.

 ఇతి శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ మనీషాపంచకం సంపూర్ణమ్

15, జనవరి 2011, శనివారం

శ్రీమన్నారాయణీయం - సప్తమ స్కంధము, తాత్పర్యము

శ్రీమన్నారాయణీయం - సప్తమ స్కంధము


ఇరువది నాలుగవ దశకము - ప్రహ్లాద చరితము

హిరణ్యాక్షే పోత్రీప్రవరవపుషా దేవ భవతా
హతే శోకక్రోధగ్లపితఘృతిరేతస్య సహజః |
హిరణ్యప్రారంభః కశిపురమరారాతిసదసి
ప్రతిజ్ఞామాతేనే తవ కిల వధార్థం మురరిపో || ౨౪-౧||

నారాయణా! యజ్ఞ వరాహరూపమును ధరించి నీవు హిరణ్యాక్షుని వధించితివి. అందువలన అతని సోదరుడైన హిరణ్యకశిపునకు విపరీతమైన దుఃఖము, కోపము కలుగగా పరమాత్మవగు నిన్ను వధింతునని రాక్షసులందరూ ఉన్న మహా సభలో అతడు ప్రతిజ్ఞ చేసెను.


విధాతారం ఘోరం స ఖలు తపసిత్వా నచిరతః
పురః సాక్షాత్కుర్వన్సురనరమృగాద్యైరనిధనమ్ |
వరం లబ్ధ్వా దృప్తో జగదిహ భవన్నాయకమిదం
పరిక్షుందన్నింద్రాదహరత దివం త్వామగణయన్ || ౨౪-౨||

హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసెను. బ్రహ్మ ప్రత్యక్షమై అతడు కోరుకున్నట్లు దేవతలు, మానవులు, మృగములు మొదలగు వాని చేత చావు లేకుండునట్లువరమొసగెను . ఇట్లు దుర్లభమైన వరమును పొంది గర్వముతో హిరణ్యకశిపుడు నీవు నాయకుడిగా ఉన్న ఈ భువనములన్నిటినీ బాధలకు గురిచేయుచు నిన్ను కూడా లెక్క చేయక ఇంద్రుని నుండి స్వర్గాదిపత్యమును లాగు కొనెను. 


నిహంతుం త్వాం భూయస్తవ పదమవాప్తస్య చ రిపోః
బహిర్దృష్టేరంతర్దధిథ హృదయే సూక్ష్మవపుషా |
నదన్నుచ్చైస్తత్రాప్యఖిలభువనాంతే చ మృగయన్
భియా యాతం మత్వా స ఖలు జితకాశీ నివవృతే || ౨౪-౩||

ప్రభూ! పిమ్మట హిరణ్యకశిపుడు నిన్ను చంపదలచి చతుర్దశ భువనములను వెదకియు, నీ ఉనికిని కనుగొనలేక పోయెను. అప్పుడు నీయెడ శత్రుభావము వహించి యున్న హిరణ్యకశిపుని హృదయమందు నీవు సూక్ష్మ రూపమున ప్రవేశించి యుంటివి. నీవుఎచ్చటను కనబడనందున భయముచే పారిపోయితివని తలచి ఆ రాక్షసుడు తాను అజేయుడనను గర్వముతో వికటాట్టహాసము చేయుచు వెనుకకు మరలెను. 


తతోఽస్య ప్రహ్లాదః సమజని సుతో గర్భవసతౌ
మునేర్వీణాపాణేరధిగతభబద్భక్తిమహిమా |
స వై జాత్యా దైత్యః శిశురపి సమేత్య త్వయి రతిం
గతస్త్వద్భక్తానాం వరద పరమోదాహరణతామ్ || ౨౪-౪||

వరదా! గురువాయుపురాధీశా! ఆ హిరణ్యకశిపునకు ప్రహ్లాదుడను కుమారుడు కలిగెను. అతడు తల్లి గర్భమున ఉన్నప్పుడే నారదముని వలన నీ భక్తి మహిమను కనుగొనెను. దైత్య వంశములో పుట్టినప్పటికినీ ప్రహ్లాదుడు నీ భక్త శిఖామణియై బాల్యమునుండి ఖ్యాతి వహించెను.

సురారీణాం హాస్యం తవ చరణదాస్యం నిజసుతే
స దృష్ట్వా దుష్టాత్మా గురుభిరశిశిక్షచ్చిరమముమ్ |
గురుప్రోక్తం చాసావిదమిదమభద్రాయ దృఢమి-
త్యపాకుర్వన్ సర్వం తవ చరణభక్త్యైవ వవృధే || ౨౪-౫||

దుర్మార్గుడైన హిరణ్యకశిపుడు తన పుత్రుడు నీ భక్తుడు అయితే రాక్షసుల మధ్య అది అపహాస్యమగునని తలచి అతనిని విద్యాభ్యాసము కొరకు తన గురువుల వద్దకు పంపించెను. ప్రహ్లాదుడు తనకు గురువులు బోధించునది శ్రేయస్కరమైన విద్య కాదని భావించి నీ పాద పద్మముల సేవయే అన్నిటి కన్నా మిన్న అని తలంచెను.


అధీతేషు శ్రేష్ఠం కిమితి పరిపృష్టేఽథ తనయే
భవద్భక్తిం వర్యామభిగదతి పర్యాకులధృతిః |
గురుభ్యో రోషిత్వా సహజమతిరస్యోత్యభివిదన్
వధిపాయానస్మిన్ వ్యతత్నుత భవత్పాదశరణే || ౨౪-౬||

ప్రహ్లాదుడు కొంతకాలము విద్యాభ్యాసము చేసిన తరువాత అతడు నేర్చుకున్న విద్య తెలిసికొన దలచి హిరణ్యకశిపుడు అతనిని తన వద్దకు రప్పించు కొనెను. హిరణ్యకశిపుడు పుత్రునితో నీవు నేర్చుకున్న విద్యలలో ఉత్తమమైనదిగా ఏది తోచినది? అని అడిగెను. అప్పుడు పరమ భక్త శిఖామణి యైన ప్రహ్లాదుడు శ్రీహరి సేవయే అన్నిటి కన్నా మిన్న అనిచెప్పెను . అప్పుడు హిరణ్యకశిపుడు కోపముతో గురువులను ప్రశ్నించగా వారు 'అది అతనికి సహజముగా కలిగిన బుద్ధి' అని చెప్పిరి. అప్పుడు హిరణ్యకశిపుడు నీపై కోపముతో ఆ ప్రహ్లాదుని చంపుటకు ఎన్నోవిధముల ప్రయత్నించెను.
 

స శూలైరావిద్ధః సుబహు మథితో దిగ్గజగణైః
మహాసర్పైర్దష్టోఽప్యనశనగరాహారవిధుతః |
గిరీంద్రావక్షిప్తోఽప్యహహ పరమాత్మన్నయి విభో
త్వయి న్యస్తాత్మత్వాత్ కిమపి న నిపీడామభజత || ౨౪-౭||

దేవా! ఆ రాక్షసులు ప్రహ్లాదుని శూలములతో పొడిచిరి, మదించిన ఏనుగులతో తొక్కిన్చిరి, మహా సర్పములచే కరిపించిరి, తిండి లేక మాడ్చిరి, విషాహారమును పెట్టిరి.  ఎత్తైన ప్రదేశముల నుండి అగాధములలోకి నెట్టిరి. ఇన్ని బాధలు పెట్టినను, ప్రహ్లాదుని మనసు నీపై లగ్నమై ఉండుటచేత, నీ మహిమ వలన అతనికి ఏ బాధ కలుగ లేదు. ఇది యెంత ఆశ్చర్యకరము.


తతః శంకావిష్టః స పునరతిదుష్టోఽస్య జనకో
గురూక్త్యా తద్గేహ కిల వరుణపాశైస్తమరుణత్ |
గురోశ్చాసాన్నిధ్యే స పునరనుగాన్ దైత్యతనయాన్
భవద్భక్తేస్తత్త్వం పరమపి విజ్ఞానమశిషత్ || ౨౪-౮||

ఈ విధముగా దండములన్ని విఫలమగుటచే హిరణ్యకశిపునికి అనుమానము వచ్చెను. అందువలన గురువు ఆశ్రమములోనే ప్రహ్లాదుని వరుణ పాశములచే బంధించెను. అయినను, గురువు దగ్గర లేనప్పుడు ఇతర దైత్య కుమారులకు పరమ విజ్ఞానమైన నీ తత్త్వమును ఉపదేశించెను.


పితా శృణ్వన్ బాలప్రకరమఖిలం త్వత్స్తుతిపరం
రుషాంధః ప్రాహైనం కులహతక కస్తే బలమితి |
బలం మే వైకుంఠస్తవ చ జగతాం చాపి స బలం
స ఏవ త్రైలోక్యం సకలమితి ధీరోఽయమగదీత్ || ౨౪-౯||

తన కుమారుడు దైత్యపుత్రులకు నీ భక్తిజ్ఞానమును బోధించిన విషయము తెలిసిన హిరణ్యకశిపుడు 'ఓరీ దైత్యుల శత్రువా! నీకు ఇంత బలము ఎక్కడినుంచి వచ్చింది' అని గద్దించాడు. అప్పుడు ప్రహ్లాదుడు 'వైకుంఠ నాథుడు అయిన శ్రీ హరి నాకు, నీకే కాదు ఈ జగత్తు మొత్తానికి బలమైన వాడు. అతడే సమస్త లోక స్వరూపుడు' అని చెప్పెను.


అరే క్వాసౌ క్వాసౌ సకలజగదాత్మా హరిరితి
ప్రభింతే స్మ స్తంభం చలితకరవాళో దితిసుతః |
అతః పశ్చాద్విష్ణో న హి వదితుమీశోఽస్మి సహసా
కృపాత్మన్ విశ్వాత్మన్ పవనపురవాసిన్ మృడయ మామ్ || ౨౪-౧౦||

అప్పుడు హిరణ్యకశిపుడు 'ఆ హరి ఎక్కడ - ఇక్కడ అక్కడా దానిలోనా దీనిలోనా'  అని కోపావేశముతో తన కరవాలముతో ఒక స్థంభమును దూసెను. అప్పుడు ఏమి జరిగినదో వర్ణింప అలవి కాదు. ఓ ప్రభు! కృపాకరా! గురువాయురప్పా! నా బాధలను తొలగించి నాకు ఆనందము కలుగ చేయుము.
 
ఇరువది ఐదవ దశకము - శ్రీ నృశింహావతార వర్ణనము

స్తంభే ఘట్టయతో హిరణ్యకశిపోః కర్ణౌ సమాచూర్ణయన్
నాధూర్ణజ్జగదందకుండకుహరో ఘోరస్తవాభూద్రవః |
శ్రుత్వా యం కిల దైత్యరాజహృదయే పూర్వం కదాప్యశ్రుతం
కంపః కశ్చన సఫ్పపాత చలితోఽప్యంభోజభూర్విష్టరాత్ || ౨౫-౧||

ప్రభూ! హిరణ్యకశిపుడు స్థంభముపై కొట్టగానే భయంకర ధ్వనితో దానినుండి నీవు ఆవిర్భవించితివి. ఆ శబ్దమునకు చెవులు బద్దలు అయ్యెను. బ్రహ్మాండమంతా గిర్రున తిరిగినట్లాయెను. ఆ ధ్వనిని వినగానే హిరణ్యకశిపుని హృదయము కంపించెను. పద్మము నందు ఆసీనుడైన బ్రహ్మ కూడా ఆ భీకర ధ్వనికి చలించి పోయెను.

దైత్యే దిక్షు విసృష్టచక్షుషి మహాసంరంభిణీ స్తంభతః
సంభూతం న మృగాత్మకం న మనుజాకారం వపుస్తే విభో |
కిం కిం భీషణమేతదద్భుతమితి వ్యుద్భ్రాంతచిత్తేఽసురే
విస్ఫూర్జద్ధవలోగ్రరోమవికసద్వర్ష్మా సమాజృంభథాః || ౨౫-౨||

భయంకరమైన ఆ ఫెళఫెళ ధ్వనులకు హడలిపోయి హిరణ్యకశిపుడు అన్ని దిక్కులు చూచు చుండగా అంతులేని తేజస్సులను విరజిమ్ముతూ స్తంభము నుండి నీవు ఆవిర్భవించితివి. అప్పుడు నీవు పూర్తిగా సింహము గానీ మానవుడు గానీ గాక నరసింహ రూపుడవై యుంటివి. అంతట ఆ రాక్షస రాజు మిక్కిలి విభ్రాంతుడై 'భయంకరముగా, అద్భుతముగా ఉన్న ఈ రూపము ఏమిటి? ఏమిటి?' అని వణికి పోసాగెను. అంతట అతని ధైర్యము సడలి పోయెను. అప్పుడు నీవు తెల్లని నీ జూలును విదుల్చుచు విరాడ్రూపముతో విజృంభించితివి.


తప్తస్వర్ణసవర్ణఘూర్ణదతిరూక్షాక్షం సటాకేసర-
ప్రోత్కంపప్రనికుంబితాంబరమహో జీయాత్తవేదం వపుః |
వ్యాత్తవ్యాప్తమహాదరీసఖముఖం ఖద్గోగ్రవల్గన్మహా-
జిహ్వానిర్గమదృశ్యమానసుమహాదంష్ట్రాయుగోడ్డామరమ్ || ౨౫-౩||

ప్రభూ! నీ నరసింహ రూపమున కనుగ్రుడ్లు పుటం పెట్టిన బంగారము వలె పచ్చగా ఉండి మహా భయంకరముగా తిరుగుచున్నవి. జూలు నిక్క పొడుచుకుని ఆకాశమంతా వ్యాపించియున్నది. నీ నోరు చాల భయంకరమైన గుహవలె ఒప్పుచున్నది. నోటినుండి బయటకు వచ్చి అటు ఇటు కదులుచున్న నాలుక కత్తివలె భయంకరముగా నున్నది, భీకరమైన కోరలతో విలసిల్లు చున్నది.  అట్టి నీ నరసింహ రూపమునకు జయమగు గాక.


ఉత్సర్పద్వలిభంగభీషుణహనుం హ్రస్వస్థవీయస్తర-
గ్రీవం పీవరదోశ్శతోద్గతనఖకౄరాంశుదూరోల్బణమ్ |
వ్యోమోల్లంఘిఘనాఘనోపమఘనప్రధ్వాననిర్ధావిత-
స్పర్ధాలుప్రకరం నమామి భవతస్తన్నారసింహం వపుః || ౨౫-౪||

స్వామీ! నీవు అట్టహాసము చేసినప్పుడు నీ చెక్కిళ్ళు ముడుతలు పడుచున్నవి. నీ కంఠ భాగము పొట్టిగా దృఢమైనది. బాగుగా పుష్టి గలిగి యున్న నీ హస్తముల యొక్క గోళ్ళు మిక్కిలి వాడిగా మహా భయంకరముగా నున్నవి. నీ శరీరము ఆకాశమును అంటుకొనునట్లు చాల ఎత్తుగా నున్నది. నీ అట్టహాసము భయంకరమైన మేఘ గర్జన వలె ఉండి శత్రువులను తరిమి తరిమి కొట్టుచున్నది. ప్రభూ! అట్టి నీ నృసిమ రూపమునకు నేను భక్తితో నమస్కరింతును.


నూనం విష్ణురయం నిహన్మ్యముమితి భ్రామ్యద్గదాభీషణం
దైత్యేంద్రం సముపాద్రవంతమధృథా దోర్భ్యాం పృథుభ్యామముమ్ |
వీరో నిర్గళితోఽథ ఖడ్గఫలకౌ గృహ్ణన్విచిత్రశ్రమాన్
వ్యావృణ్వన్పునరాపపాత భువనగ్రాసోద్యతం త్వామహో || ౨౫-౫||

దేవా! అంతట హిరణ్యకశిపుడు 'నిజముగా ఇతడే విష్ణువు. ఇతనిని నేను సంహరించెదను' అని పలుకుచు, గదను భయంకరముగా తిప్పుచు నీ మీదికి విజృంభించెను. అప్పుడు నీవు బలమైన నీ బాహువులతో ఒడుపు చూపి ఆ రాక్షసుని పట్టుకొంటివి. కానీ ఆ దుర్మార్గుడు నీ బాహు బంధములనుండి తప్పించుకొని, ఖడ్గమును, దలును చేబూని, చిత్రవిచిత్రములుగా తిరుగుచుండెను. పిమ్మట సమస్త లోకములను మ్రింగ బోవుచున్నట్లు మహా భయంకరముగా నున్న నీపైకి అతడు విరచుకొని పడెను.


భ్రామ్యంతం దితిజాధమం పునరపి ప్రోద్గృహ్య దోర్భ్యాం జవాత్
ద్వారేఽథోరుయుగే నిపాత్య నఖరాన్వ్యుత్ఖాయ వక్షోభువి |
నిర్భిందన్నధిగర్భనిర్భరగళద్రక్తాంబు బద్ధోత్సవం
పాయం పాయముదైరయో బహుజగత్సంహారిసింహారవాన్ || ౨౫-౬||

రాక్షసాధముడైన హిరణ్యకశిపుడు కత్తిని విచిత్రముగా త్రిప్పుచున్నను  నీవు అతని గట్టిగా పట్టుకొని సభాద్వారము దగ్గర కడప మీద నీ తొడలపై చేర్చుకుని, నీ వాడియైన గోళ్ళతో గ్రుచ్చి అతని వక్షస్థలమును చీల్చితివి. అతని కడుపులో నుండి వచుచున్న వేడి రక్తముతో ఆనందముతో త్రాగి సమస్త లోకములను సంహరించు చున్నట్లు మిక్కిలి భయంకర సింహనాదము చేసితివి.

త్యక్త్వా తం హతమాశు రక్తలహరీసిక్తోన్నమద్వర్ష్మణి
ప్రత్యుత్పత్య సమస్తదైత్యపటలీం చాఖాద్యమానే త్వయి |
భ్రామ్యద్భూమి వికంపితాంబుధికులం వ్యాలోలశైలోత్కరం
ప్రోత్సర్పత్ఖచరం చరాచరమహో దుఃస్థామవస్థాం దధౌ || ౨౫-౭

స్వామీ! నీవు ఆ రాక్షసుని చంపి, అతనిని వదిలి పెట్టి రక్తపు మడుగులో తడిసి యున్న నీవు చెంగున ముందుకు దూకి, మిగిలిన రాక్షసులను చంపి తినుచున్నప్పుడు భూమిఅంతా గుండ్రముగా తిరిగి పోయినది. సముద్రములు అల్లకల్లోలము అయినవి. మహా పర్వతములు కడలి పోయినవి. ఆకాశమున నున్న నక్షత్రములు అటు ఇటు చెల్లా చెదురు అయిపోయినవి. ఈ విధముగా చరాచర ప్రపంచము దురవస్థకు గురైనది.

తావన్మాంసవపాకరాళవపుషం ఘోరాంత్రమాలాధరం
త్వాం మధ్యేసభమిద్ధరోషముషితం దుర్వారగుర్వారవమ్ |
అభ్యేతుం న శశక కోఽపి భువనే దూరే స్థితా భీరవః
సర్వే శర్వవిరించవాసవముఖాః ప్రత్యేకమస్తోషత || ౨౫-౮||

స్వామీ! నీవు హిరణ్యకశిపుని సంహరించి, అతని మాంసము, వాప మొదలైన వాటిచే మహా భయంకరముగా నుంటివి. ఆ దుష్ట రాక్షసుని ప్రేగులను మెడలో ధరించి మిక్కిలి కోపముతో గర్జిన్చుచు సభామధ్యమున కూర్చుంటివి. అట్టి నీ ఆకారమును చూచి ఎవ్వరును నీ దగ్గరకు వచ్చుటకు సాహసము చేయలేక పోయిరి. బ్రహ్మ, శంకరుడు, దేవేంద్రుడు, మొదలైన దేవతలు కూడా భయముతో చాల దూరముననే ఉండిపోయి నిన్ను వేరువేరుగా స్తుతించ సాగిరి.

భూయోఽప్యక్షతరోషధామ్ని భవతి బ్రహ్మాజ్ఞయా బాలకే
ప్రహ్లాదే పదయోర్నమత్యపభయే కారుణ్యభారాకులః |
శాంతస్త్వం కరమస్య మూర్ధ్ని సమధాః స్తోత్రైరథోద్నాయత-
స్తస్యాకామధియోఽపి తేనిథ వరం లోకాయ చానుగ్రహమ్ || ౨౫-౯||

దేవతలందరూ విడివిడిగా నిన్ను స్తుతించినను నీ కోపము చల్లారలేదు. అప్పుడు బ్రహ్మ దేవుని ప్రేరణతో బాలుడైన ప్రహ్లాదుడు నిర్భయముగా నీ పాదములకు నమస్కరించెను. అంతట పరమ దయాళువైన నీవు శాంతించి ప్రహ్లాదుని శిరస్సుపై మంగళకరమైన నీ హస్తమును ఉంచితివి. అప్పుడా ప్రహ్లాదుడు నిన్ను అనేక విధముల స్తుతించెను. అతనికిఎట్టి కోరికలు లేకున్నను లోకములను అనుగ్రహించుటకై అతనికి వరములను ఇచ్చితివి. 

ఏవం నాటితరౌద్రచేష్టిత విభో శ్రీతాపనీయాభిధ-
శ్రుత్యంతస్ఫుటగీతసర్వమహిమన్నత్యంతశుద్ధాకృతే |
తత్తాదృఙ్నిఖిలోత్తరం పునరహో కస్త్వాం పరో లంఘయేత్
ప్రహ్లాదప్రియ హే మరుత్పురపతే సర్వామయాత్పాహి మామ్ || ౨౫-౧౦||

ప్రభూ! నీవు సహజముగా పరమ శాంతుడ వైనను ఈ విధముగా క్రోధమును ప్రదర్శించితివి. నీ గొప్పతనమంతా శ్రీతాపనీయోపనిషత్తునందు చక్కగా నిరూపించబడెను.   నీవు మిక్కిలి పరిశుద్ధమైన ఆకారము కలవాడవు. అందరికంటేను ఉన్నతమైన వాడవు. నిన్ను అధిగమించు వారు లేరు. ప్రహ్లాద ప్రియా! గురువాయురప్పా! దయతో నా సమస్త రోగములనునివారింపుము.

14, జనవరి 2011, శుక్రవారం

శ్రీమన్నారాయణీయం - షష్ఠ స్కంధము, తాత్పర్యము

శ్రీమన్నారాయణీయం - షష్ఠ స్కంధము, తాత్పర్యము



ఇరువదిరెండవ దశకము - అజామిళోపాఖ్యానం

అజామిళో నామ మహీసురః పురా చరన్విభో ధర్మ పథాన్ గృహాశ్రమీ |
గురోర్గిరా కాననమేత్య దృష్టవాన్సుఘృష్టశీలాం కులటాం మదాకులామ్ || ౨౨-౧


ప్రభూ! పూర్వ కాలమందు అజామిళుడను బ్రాహ్మణుడు వివాహము చేసుకుని గృహస్థ ధర్మము చక్కగా నిర్వర్తించు చుండెను. ఒకరోజు అతని తండ్రి అతనిని అడవికి పంపగా అక్కడ ఒక దుర్మార్గురాలు, కులట, మదించి యున్న స్త్రీని చూసెను.

స్వతః ప్రశాంతోఽపి తదాహృతాశయః స్వధర్మముత్సృజ్య తయా సమారమన్ |
అధర్మకారీ దశమీ భవన్పునర్దధౌ భవన్నామయుతే సుతే రతిమ్ || ౨౨-౨


అజామిళుడు మంచివాడైనప్పటికీ ఆ స్త్రీని చూడగానే మరులు గొని, స్వధర్మము వీడి ఆమెతో రమింప సాగెను. తరువాత అధర్మపు పనులు చేస్తూ తొంబది ఏళ్ల ముసలి వాడయ్యెను. తనకు పుట్టిన కొడుకునకు నారాయణుడను పేరు పెట్టి అతనిని ఎంతో ప్రేమించు చుండెను.

స మృత్యుకాలే యమరాజకింకరాన్ భయంకరాంస్త్రీనభిలక్షయన్భియా |
పురా మనాక్త్వత్స్మృతివాసనాబలాజ్జుహావ నారాయణనామకం సుతమ్ || ౨౨-౩

తన అవసాన దశ సమీపించినపుడు భయంకరులైన ముగ్గురు యమదూతలు  అతని ప్రాణాలు తీసికొని పోవుటకు వచ్చిరి. ఆ యమదూతలను చూసి భయపడి, పూర్వము నిన్ను ధ్యానిన్చియున్న పుణ్య ప్రభావము వలన నారాయణుడను తన పుత్రుని పేరు పెట్టి పిలిచెను.

దురాశయస్యాపి తదాత్వనిర్గతత్వదీయనామాక్షరమాత్రవైభవాత్ |
పురోఽభిపేతుర్భవదీయపార్షదాశ్చతుర్భుజాః పీతపటా మనోరమాః || ౨౨-౪


దేవా! అజామిళుడు దుర్మార్గుడైనప్పటికీ అతని ముఖము నుండి నీ నామము వెలువడిన వెంటనే నీ సేవకులు అక్కడకు వచ్చిరి. వారందరూ నాలుగు భుజములతో పీతాంబరములు ధరించి చాలా మనోహరముగా ఉన్నారు.

అముం చ సంపాశ్య వికర్షతో భతాన్ విముంచతేత్యారురుధుర్బలాదమీ |
నివారితాస్తే చ భవజ్జనైస్తదా తదీయపాపం నిఖిలం న్యవేదయన్ || ౨౨-౫

యమభటులు పాశములతో అజామిళుని లాగుచుండగా విష్ణుభటులు వదలి పెట్టుమని వారిని వారిన్చిరి. అప్పుడు వారు అజామీళుడు చేసిన పాపములన్నిటినీ విష్ణు దూతలకు నివేదిన్చిరి. 

భవంతు పాపాని కథం తు నిష్కృతే కృతేఽపి భో దండనమస్తి పండితాః |
న నిష్కృతిః కిం విదితా భవాదృశామితి ప్రభో త్వత్పురుషా బభాషిరే || ౨౨-౬

ప్రభూ! అప్పుడు నీ భటులు ఆ యమదూతలతో యిట్లనిరి. 'దండనీతి పండితులారా! యితడు చాలా పాపములు చేసే ఉండవచ్చు. కానీ, వాటికి ప్రాయశ్చిత్తము చేసికొన్న పిదప దండనము విధించవలసిన అవసరము ఎట్లుండును? మీ వంటి వారికి ఈ ప్రాయశ్చిత్తము గురించి తెలియదా ఏమి?"

శ్రుతిస్మృతిభ్యాం విహితా వ్రతాదయః పునంతి పాపం న లునంతి వాసనామ్ |
అనంతసేవా తు నికృంతతి ద్వయీమితి ప్రభో త్వత్పురుషా బభాషిరే || ౨౨-౭

"యమభటులారా! వేదాలు, ధర్మ శాస్త్రాలలో చెప్పబడిన వ్రతములు మొదలైనవి పాపములను రూపుమాపును కానీ పాపముల వాసనలను మాత్రము తొలగించ జాలవు. అయితే శ్రీమన్నారాయణుని సేవ పాపములను, వాటి వాసనలు కూడా అంతరిమపజేయును " అని నీ భటులు వారితో పలికిరి.   

అనేన భో జన్మసహస్రకోటిభిః కృతేషు పాపేష్వపి నిష్కృతిః కృతా |
తదగ్రహీన్నామ భయాకులో హరేరితి ప్రభో త్వత్పురుషా బభాషిరే || ౨౨-౮

 "ఈ అజామీళుడు మృత్యు భయముతో నైనను శ్రీహరి నామమును ఉచ్చరించెను. దాని వలన వేల కోట్ల జన్మములలో చేసిన పాపములకన్నిటికీ ప్రాయశ్చిత్తము చేసికోన్నట్లు అయినది. " అని విష్ణు భటులు యమదూతలతో పలికిరి.

నృణామబుద్ధ్యాపి ముకుందకీర్తనం దహత్యఘౌఘాన్మహిమాస్య తాదృశః |
యథాగ్నిరేధాంసి యథౌషధం గదానితి ప్రభో త్వత్పురుషా బభాషిరే || ౨౨-౯

"మానవులు బుద్ధి పూర్వకముగా కాకున్నను హరియొక్క నామ కీర్తన చేసినచో అగ్ని కట్టెలను దహించినట్లు, ఔషధము  రోగములను రూపుమాపినట్లు, అది వారి పాపములను నాశనము చేయును. శ్రీ హరి నామ కీర్తన మహిమ అంత గొప్పది" అని విష్ణు భటులు యమదూతలతో పలికిరి.

ఇతీరితైర్యామ్యభటైరపాసృతే భవద్భటానాం చ గణే తిరోహితే |
భవత్స్మృతిం కంచన కాలమాచరన్భవత్పదం ప్రాపి భవద్భటైరసౌ || ౨౨-౧౦


ఈ విధముగా విష్ణు భటులు పలికినందు వలన యమభటులు అజామీళుని వదలి పెట్టి వెళ్లి పోయిరి. అప్పుడు విష్ణు భటులు కూడా తమ లోకమునకు వెళ్ళిపోయిరి. అందువలన అజామీళుడు కొంత కాలము శ్రీహరిని ధ్యానించుచు కాలము గడపి, చివరకు నీ భటులు వెంటరాగా నీలోకమైన వైకుంఠము చేరుకునెను.

స్వకింగరావేదనశంకితో యమస్త్వదంఘ్రిభక్తేషు న గమ్యతామితి |
స్వకీయభృత్యానశిశిక్షదుచ్చకైః స దేవ వాతాలయ పాహి మామ్ || ౨౨-౧౧

తన కింకరులు ఈ వృత్తాంతము అంతా యమధర్మ రాజుకు తెలియపరచిరి. అందువలన యమధర్మ రాజు భయపడి విష్ణుభక్తుల దగ్గరకు పోరాదని తన భటులను హెచ్చరించెను. అట్టి మహిమ గల గురువాయురప్పా! నన్ను నీవు రక్షింపుము.

ఇరువదిమూడవ స్కంధము - చిత్రకేతూపాఖ్యానం
ప్రాచేతస్తు భగవన్నపరోఽపి దక్షః
త్వత్సేవనం వ్యధిత సర్గవివృద్ధికామః |
ఆవిర్బభూవిథ తదా లసదష్టబాహుః
తస్మై వరం దదిథ తాం చ వధూమసిక్నీమ్ || ౨౩-౧||


ఓ నారాయణా! ప్రాచేతసులకు దక్షుడను పుత్రుడు ఉండెను. యితడు బ్రహ్మదేవుని పుత్రుడైన దక్షుడు కాదు. అతడు సంతానాభివ్రుద్ధికై నిన్ను సేవించెను. అప్పుడు నీవు ఎనిమిది చేతులతో ప్రత్యక్షమై ఆ దక్షునకు అసిక్ని అను భార్యను, అతడు కోరిన వరమును కూడా ఇచ్చితివి.

తస్యాత్మజాస్త్వయుతమీశ పునః సహస్రం
శ్రీనారదస్య వచసా తవ మార్గమాపుః |
నైకత్రవాసమృషయే స ముమోచ శాపం
భక్తోత్తమస్త్వృషిరనుగ్నహమేవ మేనే || ౨౩-౨||


దక్షునకు అసిక్ని యందు పదకొండు వేలమంది పుత్రులు కలిగిరి. వారిని దక్షుడు ప్రజావృద్ది చేయుమని కోరగా వారు సత్సంతానము కొరకు తపస్సు చేయ సాగిరి. అప్పుడు నారదుడు వచ్చి ఉపదేశము చేసినందు వలన వారందరూ నిన్ను ధ్యానించుచు తత్త్వమార్గమున ఉండిరి. ఈ విధముగా తన పుత్రులు సంతానాభివ్రుద్ద్ది చేయుటకు విముఖులైనందు వలన దక్షుడు కోపముతో నారదుని ఒకచోట ఉండవద్దని శపించెను. నారదుడు దానిని తనకు వరముగా భావించెను.

షష్ట్యా తతో దుహితృభిః సృజతః కులౌఘాన్
దౌహిత్రసూనురథ తస్య స విశ్వరూపః |
త్వత్స్తోత్రవర్మితమజాపయదింద్రమాజౌ
దేవ త్వదీయమహిమా ఖలు సర్వజైత్రః || ౨౩-౩||

అనంతరము దక్షుని కుమార్తెలైన అదితి మొదలగు అరువది మంది ద్వారా చరాచర సృష్టి జరిగెను. అదితి కుమారుడైన త్వష్ట ప్రజాపతికి అతని భార్యయైన రచన యందు విశ్వరూపుడు జన్మించెను. అతడు నీ స్తోత్రమైన నారాయణ కవచమును ఇంద్రునకు ఉపదేశించెను. దాని ప్రభావమున దేవాసుర యుద్ధములో ఇంద్రునకు విజయము కలిగెను. ప్రభూ! నీ అనుగ్రహము ఉన్నచో అందరికి జయము కలుగును కదా!

ప్రాక్శూరసేనవిషయే కిల చిత్రకేతుః
పుత్రాగ్రహీ నృపతిరంగిరసః ప్రభావాత్ |
లబ్ధ్వైకపుత్రమథ తత్ర హతే సపత్నీ-
సంఘైరముహ్యదవశస్తవ మాయయాసౌ || ౨౩-౪||



పూర్వ కాలమున శూరసేన రాజ్యమునకు చిత్రకేతుడను రాజు పరిపాలించు చుండెను. అతనికి చాలా కాలము సంతానము కలుగలేదు. అంగీరసుడను ముని అనుగ్రహము వలన అతనికి ఒక పుత్రుడు కలిగెను. కాని అసూయ కలిగిన అతని యొక్క ఇతర భార్యలు ఆ శిశువును చంపివేసిరి. అందువలన చిత్రకేతు మనోనిగ్రహము లేక నీ మాయ వలన బాధ పడుచుండెను.

తం నారదస్తు సమమంగిరసా దయాళుః
సంప్రాప్య తావదుపదర్శ్య సుతస్య జీవమ్ |
కస్యాస్మి పుత్ర ఇతి తస్య గిరా విమోహం
త్యక్త్వా త్వదర్చనవిధౌ నృపతిం న్యయుంక్త || ౨౩-౫||

ఆ సమయంలో నారద మహర్షి అంగీరస మహర్షితో కలిసి చిత్రకేతు మహారాజు వద్దకు వచ్చెను. రాజు దుస్థితి చూసి చనిపోయిన పుత్రుని యొక్క ఆత్మను అక్కడకు రాప్పించెను. ఆ ఆత్మ 'నేనెవ్వరి పుత్రుడను' అని ఎదురు ప్రశ్న వేయుటచే చిత్రకేతువు మోహమును వదులుకొని పర్మాత్మవాగు నిన్నే ఆరాధించ సాగెను. ఇది అంతయు నీ భక్తుడైన నారదమహర్షి అనుగ్రహము వలన జరిగినది. 

స్తోత్రం చ మంత్రమపి నారదతోఽథ లబ్ధ్వా
తోషాయ శేషవపుషో నను తే తపస్యన్ |
విద్యాధరాధిపతితాం స హి సప్తరాత్రే
లబ్ధ్వాప్యకుంఠమతిరన్వభజద్భవంతమ్ || ౨౩-౬||

నారదమహర్షి చిత్రకేతు మహారాజునకు స్తోత్రమును, మంత్రమును ఉపదేశించెను. వాటిచేత ఆ మహారాజు ఆదిశేషుని రూపమున నున్న నిన్ను ఆరాధిస్తూ ఏడు రాత్రులలో విద్యాధరులకు అధిపతి అయ్యెను. తరువాత కూడా ఆ చిత్రకేతువు ఏకాగ్ర చిత్తముతో నిన్నే సేవించుచుండెను.

తస్మై మృణాళధవళేన సహస్రశీర్ష్ణా
రూపేణ బద్ధనుతిసిద్ధగణావృతేన |
ప్రాదుర్భవన్నచిరతో నుతిభిః ప్రసన్నో
దత్త్వాత్మతత్వమనుగృహ్య తిరోదధాథ || ౨౩-౭||

స్వామీ! అంతంత నీవు వేయి పడగలు గల ఆదిశేషుని రూపముతో ఆ మహారాజునకు ప్రత్యక్షమైతివి. అప్పుడు తెల్లని పద్మనాలము వలె శోభిల్లుచుండివి. సిద్ధులు, మునులు మొదలగు వారు నీ చుట్టును చేరి అంజలి ఘటించి, నిన్ను నుతించు చుండిరి. అంతట నీవు చిత్రకేతువు యొక్క స్తుతులకు ప్రసన్నుడవై ఆయనకు ఆత్మ తత్త్వమును ప్రసాదించి అంతర్ధానమైతివి. 

త్వద్భక్తమౌలిరథ సోఽపి చ లక్షలక్షం
వర్షాణి హర్షులమనా భువనేషు కామమ్ |
సంగాపయన్ గుణగణం తవ సుందరీభిః
సంగాతిరేకరహితో లలితం చచార || ౨౩-౮||


ప్రభూ! నా భక్తశిఖామణియైన చిత్రకేతువు మిక్కిలి ఆనందముతో నీ దివ్య గుణగణములను, గాథలను కీర్తించుచు గాంధర్వ స్త్రీలతో కలిసియున్నప్పటికి సంగరహితుడై అనేక లక్షకోట్ల సంవత్సరములు భూమండలమున సంచరించెను.

అత్యంతసంగవిలయాయ భవత్ప్రణున్నో
నూనం స రూప్యగిరిమాప్య మహత్సమాజే |
నిశ్శంకమంకకృతవల్లభమంగజారిమ్
తం శంకరం పరిహసన్నుమయాభిశేపే || ౨౩-౯||

చిత్రకేతువు సర్వసంగ పరిత్యాగి కాదలచి నీ ప్రేరణచే కైలాసగిరికి పోయెను. అప్పుడు దేవతలు మహర్షులు మొదలైన వారు ఎందరో సేవించు చుండగా పార్వతీదేవి ఒడిలోనున్న శంకరుని చూచి చిత్రకేతువు పరిహసింపగా అందుకు పార్వతీదేవి కోపించి అతనిని శపించినది. 
 
నిస్సంభ్రమస్త్వయమయాచితశాపమోక్షో
వృత్రాసురత్వముపగమ్య సురేంద్రయోధీ |
భక్త్యాత్మతత్త్వకథనైస్సమరే విచిత్రం
శత్రోరపి భ్రమమపాస్య గతః పదం తే || ౨౩-౧౦||


నీపై పరిపూర్ణ భక్తి గల చిత్రకేతువు పార్వతీదేవి శాపమునకు భయపడలేదు, శాపవిమోచనము చేయుమని ప్రార్థించలేదు. అందువలన అతడు వ్రుత్రాసునిగా జన్మించి ఇంద్రునితో యుద్ధము చేయుచు అతనికి ఆత్మ తత్త్వమును తెలిపెను. ఈ విధముగా అతడు శత్రువు యొక్క మోహమును కూడా దూరము చేసి చివరకు వైకుంఠము చేరుకోనేను. ఇది ఎంత విచిత్రము!

త్వత్సేవనేన దితిరింద్రవధోద్యతాఽపి
తాన్ప్రత్యుతేంద్రసుహృదో మరుతోఽభిలేభే |
దుష్టాశయేఽపి శుభదైవ భవన్నిషేవా
తత్తాదృశస్త్వమవ మాం పవనాలయేశ || ౨౩-౧౧||

పరమాత్మా! గురువాయురప్పా! ఇంద్రుని చంపవలెనను కోరికతో దితి నిన్ను ఆరాధించెను. ఆమెకు కలిగిన మరుత్తులు ఇంద్రునకు మిత్రులైరి. చెడు భావనతో నైనా నిన్ను సేవించినను శుభములే కలుగును కదా! ఈ విధముగా శుభములను కలిగించు స్వామీ! నన్ను రక్షింపుము.

బాలముకుందాష్టకం - తాత్పర్యము

అందానికి, ఆనందానికి రూపము ఆ బాల కృష్ణుడే. ఆయనను ఎంత వర్ణించినా తనివితీరదు. యశోద ముద్దుల బిడ్డగా, గోకుల బాల బృంద నాయకుడిగా, గోపికలకు నాథునిగా, పూతనాది రాక్షస సంహారునిగా, దధి నవనీత చోరునిగా ఆ కొంటె కృష్ణుని లీలలు అనంతము, అనిర్వచనీయము. చిన్న కృష్ణుని వర్ణిస్తూ రచించ బడిన మనోజ్ఞమైన అష్టకం ఈ బాలముకుందాష్టకం. ఆయన కన్నులు, చేతులు, పాదములు, దేహము, ముఖము, చిరునవ్వు, కొంటె చేష్టలు, గోకులంలో లీలలు ఈ స్తోత్రములో వర్ణించ బడ్డాయి. దీన్ని రచించింది ఎవరో తెలియలేదు.  అష్టకము, తాత్పర్యము, శ్రవణం.


కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం |
వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి || ౧||

కలువల వంటి చేతులతో పద్మముల వంటి పాదములు పట్టుకొని తన కలువ వంటి ముఖము వద్దకు తీసుకువచ్చి మనలను అలరించే, వట పాత్ర శాయి అయిన ఆ బాల ముకుందుని (మొక్షానందాన్ని కలిగించే వాడు) మనసులో స్మరిస్తున్నాను.


సంహృత్య లోకాన్వటపత్రమధ్యే శయానమాద్యంతవిహీనరూపమ్ |
సర్వేశ్వరం సర్వహితావతారం బాలం ముకుందం మనసా స్మరామి || ౨||

ప్రళయాన్తరమున వటపత్రముపై శయనించే వాడు, ఆద్యన్తములు లేని రూపము కలవాడు, సర్వేశ్వరుడు, అందరి మంచి కొరకై అవతిరించిన వాడు అయిన బాల ముకుందుని మనసులో స్మరిస్తున్నాను.



ఇందీవరశ్యామలకోమలాంగం ఇంద్రాదిదేవార్చితపాదపద్మం |
సంతానకల్పద్రుమమాశ్రితానాం బాలం ముకుందం మనసా స్మరామి || ౩||

నీలి కలువవలె నల్లని మేని కలవాడు, దేవతలు, ఇంద్రునిచే కొలవబడిన పాద పద్మములు కలవాడు, ఆశ్రితుల కోరికలు తీర్చె కల్పవృక్షము వంటి వాడు అయిన  బాల ముకుందుని మనసులో స్మరిస్తున్నాను.


 
లంబాలకం లంబితహారయష్టిం శృంగారలీలాంకితదంతపంక్తిం |
బింబాధరం చారువిశాలనేత్రం బాలం ముకుందం మనసా స్మరామి || ౪||

ముఖముపై వాలుతున్న కేశములు కలవాడు, పొడవైన హారములు ధరించే వాడు, ప్రేమతో ప్రకాశించే అమృతమును కురిపించే పలువరుస కలవాడు, దొండపండు వంటి ఎర్రని పెదవులు కలవాడు, సమ్మోహన పరిచే నయనములు కలవాడు అయిన  బాల ముకుందుని మనసులో స్మరిస్తున్నాను.



శిక్యే నిధాయాద్యపయోదధీని బహిర్గతాయాం వ్రజనాయికాయాం |
భుక్త్వా యథేష్టం కపటేన సుప్తం బాలం ముకుందం మనసా స్మరామి || ౫||

యశోద వెన్న, పాలు, పెరుగు ముంతలలో దాచి బయటికి వెళ్లిన తరువాత, తన కోరికే తీరే మీర వెన్నను తిని నిదురిస్తున్నట్లు నటించే వాడు అయిన  బాల ముకుందుని మనసులో స్మరిస్తున్నాను.



కళిందజాంతస్థితకాళియస్య ఫణాగ్రరంగే నటనప్రియంతం |
తత్పుచ్ఛహస్తం శరదిందువక్త్రం బాలం ముకుందం మనసా స్మరామి || ౬||

శరత్కాలములో చంద్రునివంటి ముఖము కలవాడు, కాళింది మడుగున కాళీయుని తోకను ఒక చేత పట్టి, దాని పడగపై నాట్యము చేస్తూ ఉండే వాడు అయిన  బాల ముకుందుని మనసులో స్మరిస్తున్నాను.



ఉలూఖలే బద్ధముదారశౌర్యం ఉత్తుంగయుగ్మార్జున భంగలీలం |
ఉత్ఫుల్లపద్మాయత చారునేత్రం బాలం ముకుందం మనసా స్మరామి || ౭||

రోకలికి కట్టబడిన వాడు, ఉదారము, శౌర్యము కలవాడు, అర్జున వృక్షములను పడగొట్టి నలకూబరులనే యక్షుల శాపము తీర్చిన వాడు, విచ్చిన ఎర్రని కలువల వంటి విశాలమైన నేత్రములు కలవాడు అయిన  బాల ముకుందుని మనసులో స్మరిస్తున్నాను.



ఆలోక్య మాతుర్ముఖమాదరేణ స్తన్యం పిబంతం సరసీరుహాక్షం |
సచ్చిన్మయం దేవమనంతరూపం బాలం ముకుందం మనసా స్మరామి || ౨||

పాలు తాగేటప్పుడు తల్లివంక ప్రేమతో చూసేవాడు, కలువల వంటి కన్నులు కలవాడు, సత్యము, నిత్యము అయిన వాడు, అనంతమైన రూపము కల దేవుడు  అయిన  బాల ముకుందుని మనసులో స్మరిస్తున్నాను. 

7, జనవరి 2011, శుక్రవారం

శ్రీమన్నారాయణీయం - పంచమ స్కంధము, తాత్పర్యము

 శ్రీమన్నారాయణీయం - పంచమ స్కంధము


ఇరువదియవ దశకము - ఋషభుని చరితము

ప్రియవ్రతస్య ప్రియపుత్రభూతాదాగ్నీధ్రరాజాదుదితో హి నాభిః |
త్వాం దృష్టవానిష్టదమిష్టమధ్యే తవైవ తుష్ట్యై కృతయజ్ఞకర్మా || ౨౦-౧

మనువు యొక్క తనయులలో రెండవవాడు ప్రియవ్రతుడు. అతని పుత్రుడు అగ్నీధ్రుడు. అతని యొక్క కుమారుడు నాభి. అతడు నీ అనుగ్రహముకై అనేక యజ్ఞ యాగములు చేసెను. అప్పుడు నీవు సంతోషించి యజ్ఞము చేయు చున్నప్పుడే ప్రత్యక్షమైతివి.

అభిష్టుతస్తత్ర మునీశ్వరైస్త్వం రాజ్ఞః స్వతుల్యం సుతమర్థ్యమానః |
స్వయం జనిష్యేఽహమితి బ్రువాణస్తిరోదధా బర్హిషి విశ్వమూర్తే || ౨౦-౨

ఓ నారాయణా! అప్పుడు మునీశ్వరులందరూ నిన్ను స్తుతించిరి. అట్లే నాభి మహారాజుకు నీవంటి పుత్రుడు కలుగవలయునని ఋత్విక్కులు ప్రార్థించగా నీవు స్వయముగా "పుత్రుడనై జన్మింతును" అని వరమిచ్చి అదృశ్యమైతివి.

నాభిప్రియాయామథ మేరుదేవ్యాం త్వమంశతోఽభూరృషభాభిధానః |
అలోకసామాన్యగుణప్రభావప్రభావితాశేషజనప్రమోదః  || ౨౦-౩||

నాభి యొక్క పట్టపురాణి అయిన మేరుదేవికి  నీ అంశతో ఋషభుడను పేర నీవు జన్మించితివి. అలౌకికములు, అసామాన్యములు అయిన నీ గుణగణములను చూచినా జనులందరూ అంతులేని సంతోషమును పొందిరి.

త్వయి త్రిలోకీభృతి రాజ్యభారం నిధాయ నాభిః సహ మేరుదేవ్యా |
తపోవనం ప్రాప్య భవన్నిషేవీ గతః కిలానందపదం పదం తే || ౨౦-౪

ముల్లోకములను అవలీలగా ఋషభునిపై నాభి రాజ్యభారం మోపి తన భార్య ఐన మేరుదేవితో కలసి వానప్రస్థమునకు వెళ్ళెను. అక్కడ నిన్ను ధ్యానించుచు ముక్తిని పొందెను.

ఇంద్రస్త్వదుత్కర్షకృతాదమర్షాద్వవర్ష నాస్మిన్నజనాభవర్షే |
యదా తదా త్వం నిజయోగశక్త్యా స్వవర్షమేనద్వ్యదధాః సువర్షమ్ || ౨౦-౫

నీ గొప్పతనము విని సహించలేని ఇంద్రుడు అసూయపడి అజనాభ వర్షమను పేరు గల ఈ భారత దేశంలో వర్షములు కురిపించలేదు. అప్పుడు ఋషభుడను పేరు గల నీవు నీయొక్క యోగశక్తిచే మంచి వానలు కురిసేలా చేసితివి.

జితేంద్రదత్తాం కమనీం జయంతీమథోద్వహన్నాత్మరతాశయోఽపి |
అజీజనత్తత్ర శతం తనూజాన్యేషాం క్షితీశో భరతోఽగ్రజన్మా || ౨౦-౬

స్వామీ! ఋషభుడు యోగ సాధన వలన ఆత్మానందమున మునిగి యున్నప్పటికీ ఇంద్రుడు ఇచ్చిన జయంతి అను అందమైన కన్యను వివాహమాడి ఆమె ద్వారా వంద మంది పుత్రులకు జన్మ ఇచ్చెను. వారిలో భరతుడు అందరికన్నా పెద్దవాడు.

నవాభవన్యోగివరా నవాన్యే త్వపాలయన్భారతవర్షఖండాన్ |
సైకా త్వశీతిస్తవ శేషపుత్రాస్తపోబలాద్భూసురభూయమీయుః || ౨౦-౭

ఈ వందమంది పుత్రులలో తొమ్మిది మంది యోగీశ్వరులు. భరతుడు కాక ఇంకా తొమ్మిది మంది భారతవర్షములో ఆయా ఖండములను పరిపాలించారు. మిగిలిన ఎనభై ఒక్క మంది పుత్రులు తపస్సు చేసి బ్రాహ్మణులు అయ్యారు. భరతుడు భారత దేశమునకు చక్రవర్తి అయ్యెను.

ఉక్త్వా సుతేభ్యోఽథ మునీంద్రమధ్యే విరక్తిభక్త్యన్వితముక్తిమార్గమ్ |
స్వయం గతః పారమహంస్యవృత్తిమధా జడోన్మత్తపిశాచచర్యామ్ || ౨౦-౮

ఋషభుడు మునీన్ద్రులున్న సభలో తన పుత్రులందరికి విరక్తి, భక్తి కలిసిన ముక్తి మార్గమును బోధించెను. తరువాత జడుని వలె, ఉన్మత్తుని వలె, పిశాచమువలె ప్రవర్తిన్చుచు సన్యాసము స్వీకరించెను.

పరాత్మభూతోఽపి పరోపదేశం కుర్వన్భవన్సర్వనిరస్యమానః |
వికారహీనో విచచార కృత్స్నాం మహీమహీనాత్మరసాభిలీనః || ౨౦-౯||

స్వామీ! ఋషభుని అవతారమున నీవు సన్యాసము స్వీకరించి నప్పటికీ, ఇతరులకు బ్రహ్మజ్ఞానమును ఉపదేశించుచుంటివి. అట్లే, అందరిచే తిరస్కరిన్చబడుచును రాగా ద్వేషములు లేక ఆత్మానంద రసములో మునిగిపోయి భూమి యంతా తిరుగుచుంటివి.

శయువ్రతం గోమృగకాకచర్యాం చిరం చరన్నాప్య పరం స్వరూపమ్ |
దవాహృతాంగః కుటకాచలే త్వం తాపాన్మమాపాకురు వాతనాథ || ౨౦-౧౦

స్వామీ! నీవు ఋషభుడి అవతారములో అజగర వ్రతమును పూని, గోవు, లేడి, కాకి మొదలగు వాటివలె అన్నపానముల విషయమున విధినిషేధములు, శుద్ధి, ఆశుద్ధి అనే వాటిని పట్టించుకొనక ఎక్కడ కూడా ఆశ్రమమును ఏర్పరచుకొనక తిరుగుచు కుటకాచలమున దావాగ్నికి గురియై పరబ్రహ్మ భావమును పొందితివి. అట్టి గురువాయుపురాధీశ! నా బాధలనన్నిటినీ దూరము చేయుము.

ఇరువదియొకటవ దశకము - జంబూద్వీపాదులయందు భగవదుపాసనము


మధ్యోద్భవే భువ ఇళావృతనామ్ని వర్షే
గౌరీప్రధానవనితాజనమాత్రభాజి |
శర్వేణ మంత్రనుతిభిః సుముపాస్యమానం
సంకర్షణాత్మకమధీశ్వర సంశ్రయే త్వామ్ || ౨౧-౧||

ఓ జగన్నాథా! భూమికి మధ్య భాగమున గౌరి మొదలైన స్త్రీలు మాత్రమే ఉండు ఇళావృత వర్షమున్నది. అక్కడ శంకరుడు వేదమంత్రములచే సంకర్షణ రూపమున ఉన్న నిన్న సదా స్తుతించుచుండును. అట్టి నిన్ను ఆశ్రయింతును.

భద్రాశ్వనామక ఇళావృతపూర్వవర్షే
భద్రశ్రవోభిరృషిభిః పరిణూయమానమ్ |
కల్పాంతగూఢనిగమోద్ధరణప్రవీణం
ధ్యాయామి దేవ హయశీర్షతనుం భవంతమ్ || ౨౧-౨||


దేవా! ఇళావృత దేశమునకు తూర్పు దిక్కున భద్రాశ్వము అను ప్రదేశము కలదు. కల్పాంతమున అపహరించబడిన వేదములను హయగ్రీవ రూపమున ఉద్ధరించిన నీవు అచట విలసిల్లు చుందువు. అచట భద్రశ్రవులు అను మహర్షులు నిన్ను స్తుతించుచుందురు. అట్టి నిన్ను నేను సర్వదా ధ్యానిన్చుదును.


ధ్యాయామి దక్షిణగతే హరివర్షవర్షే
ప్రాహ్లాదముఖ్యపురుషైః పరిషేవ్యమాణమ్ |
ఉత్తుంగశాంతధవలాకృతిమేకశుద్ధ-
జ్ఞానప్రదం నరహరిం భగవన్ భవంతమ్ || ౨౧-౩||

భగవాన్! ఇళావృత వర్షమునకు దక్షిణ దిక్కున హరివర్శ దేశము అను ప్రదేశము కలదు. అక్కడ నృసింహ స్వామి రూపమున పరమ శాంత రూపుడవై తెల్లని ఆకారములో నీవు విరాజిల్లు చుందువు. పరిశుద్ధమైన జ్ఞానము నొసగు నిన్ను ప్రహ్లాదుడు మొదలైన భక్తులు సదా స్తుతించు చుందురు. అట్టి నిన్ను నేను నిరంతరమూ ధ్యానింతును.

వర్షే ప్రతీచి లలితాత్మని కేతుమాలే
లీలావిశేషలలితస్మితశోభనాంగమ్ |
లక్ష్మ్యా ప్రజాపతిసుతైశ్చ నిషేవ్యమాణం
తస్యాః ప్రియాయ ధృతకామతనుం భజే త్వామ్ || ౨౧-౪||

ఇళావృతమునకు పశ్చిమ భాగమున అందమైన కేతుమాలమను ప్రదేశమున్నది. అక్కడ లక్ష్మీదేవికి ప్రియము కలిగించుటకై నీవు అందమైన చిరునవ్వుతో మన్మథుని రూపమున ఉన్నావు. అట్టి నిన్ను అక్కడ లక్ష్మీదేవి మరియు ప్రజాపతి యొక్క పుత్రులు ఎల్లప్పుడూ సేవించు చుందురు. అట్టి నిన్ను సదా నేను ధ్యానింతును.

రమ్యేహ్యుదీచి ఖలు రమ్యకనామ్ని వర్షే
తద్వర్షనాథమనువర్యసపర్యమాణమ్ |
భక్తైకవత్సలమమత్సరహృత్సు భాంతం
మత్స్యాకృతిం భువననాథ భజే భవంతమ్ || ౨౧-౫||

జగన్నాథా! శ్రీ కృష్ణా! ఇళావృత వర్షమునకు ఉత్తరభాగమున అందమైన రమ్యకమను ప్రదేశామున్నది. దానికి అధిపతియైన వైవస్వత మనువు మత్స్యావతార రూపుడవైన నిన్ను సదా ధ్యానించు చుండును. నీవు భక్త జనమును విశేషముగా ఆదరింతువు. మాత్సర్యములేని వారి హృదయములందు నీవు సదా భాసిల్లు చుందువు. అట్టి దివ్య రూపుడవైన నిన్ను నేను ఎల్లప్పుడూ భజింతును.

వర్షం హిరణ్మయసమాహ్వయమౌత్తరాహ-
మాసీనమద్రిధృతికర్మఠకామఠాంగమ్ |
సంసేవతే పితృగణప్రవరోఽర్యమాయం
తం త్వాం భజామి భగవన్ పరచిన్మయాత్మన్ || ౨౧-౬||

పరమానంద స్వరూపా! శ్రీ కృష్ణా! రమ్యక వర్శమునకు ఉత్తర దిక్కున హిరణ్మయమను ప్రదేశము కలదు. అచ్చట పితృ గానమందు ఉత్తముడైన ఆర్యముడు మందరాచలమును ఎత్తిన కూర్మ రూపుడవైన నిన్ను సేవించు చుండును. అట్టి నిన్ను ఎల్లపుడు నేను ధ్యానింతును.

కిం చోత్తరేషు కురుషు ప్రియయా ధరణ్యా
సంసేవితో మహితమంత్రనుతిప్రభేదైః |
దంష్ట్రాగ్రఘృష్టఘనపృష్ఠగరిష్ఠవర్ష్మా
త్వం పాహి విజ్ఞనుతయజ్ఞవరాహమూర్తే || ౨౧-౭||

జ్ఞానులైన రుషులచేత స్తుతించబడిన యజ్ఞ వరాహమూర్తీ! ఉత్తర కురు దేశముల యందు నీకు ప్రియమైన భూదేవి అనేక విధములైన స్తోత్రములచే నిన్ను నుతించు చుండును. వరాహమూర్తివైన నీ యొక్క కోరల చివరలు మేఘములను తాకునంత ఎత్తుగా ఉన్నవి. అట్టి ఉన్నత రూపుడవైన నీవు అనను రక్షించుము.

యామ్యాం దిశం భజతి కింపురుషాఖ్యవర్షే
సంసేవితో హనుమతా దృఢభక్తిభాజా |
సీతాభిరామపరమాద్భుతరూపశాలీ
రామాత్మకః పరిలసన్పరిపాహి విష్ణో || ౨౧-౮||

ఇళావృత దేశమునకు దక్షిణముననున్న కింపురుషమను ప్రదేశమునందు హనుమంతుడు మిగుల అద్భుతమైన అందచందములతో విరాజిల్లేది సీతా రామచంద్రమూర్తిని సేవించు చుండును. అట్టి శ్రీరాముడవైన శ్రీ మహావిష్ణూ! నీవు నన్ను దయతో రక్షించుము.

శ్రీనారదేన సహ భారతఖండముఖ్యైస్
త్వం సాంఖ్యయోగనుతిభిః సముపాస్యమానః |
ఆకల్పకాలమిహ సాధుజనాభిరక్షీ
నారాయణో నరసఖః పరిపాహి భూమన్ || ౨౧-౯||

స్వామీ! భారత ఖండమున నీవు నరనారాయణుల రూపమున వెలసి ఎల్లప్పుడును సజ్జనులను రక్షించు చుందువు. ప్రముఖులైన నారదాది మహర్షులు సాంఖ్య యోగ స్తుతులచే నిన్ను స్తుతించు చుందురు. అట్టి పరమాత్ముడ వైన నీవు నన్ను రక్షించుము.

ప్లాక్షేఽర్కరూపమయి శాల్మల ఇందురూపం
ద్వీయే భజంతి కుశనామని వహ్నిరూపమ్ |
క్రౌంచేఽంబురూపమథ వాయుమయం చ శాకే
త్వాం బ్రహ్మరూపమయి పుష్కరనామ్ని లోకాః || ౨౧-౧౦||

ప్రభూ! నీవు ప్లక్ష ద్వీపమునందు సూర్య రూపమునను, శాల్మల ద్వీపమునందు చంద్ర రూపమునను, కుశ ద్వీపమున అగ్నిరూపమునను, క్రౌంచ ద్వీపమున జలాధిదేవత రూపమునను, శాక ద్వీపమున వాయుదేవతా రూపమునను, పుష్కర ద్వీపమున బ్రహ్మ రూపమునను విరాజిల్లు చున్నావు. ఈ విధముగా సర్వ దేవతా రూపుడవైన నిన్ను మానవులందరూ సేవించు చున్నారు.

సర్వైర్ధ్రువీదిభిరుడుప్రకరైర్గ్రహైశ్చ
పుచ్ఛాదికేష్వవయవేష్వభికల్ప్యమానైః |
త్వం శింశుమారవపుషా మహతాముపాస్యః
సంధ్యాసు రుంధి నరకం మమ సింధుశాయిన్ || ౨౧-౧౧||


క్షీర సాగరమున శయనించు చున్న నారాయణా! శింశుమార రూపమున నున్న నీ యొక్క పుచ్చము మొదలైన అవయవాములందు ద్రువాడి నక్షత్రములు, సూర్యుడు, చంద్రుడు మొదలైన గ్రహములున్నట్లు కల్పిన్చ బడుచున్నవి.  ఆ శింశుమార రూపమున నున్న నిన్ను మహాత్ములు మూడు సంధ్యా సమయములందు ఉపాసించు చున్నారు. అట్టి శింశుమార రూపా! పాపములను దూర మొనర్చి నాకు నరకము కలుగ కుండునట్లు అనుగ్రహించుము.


పాతాళమూలభువి శేషతనుం భవంతం
లోకైకకుండలవిరాజిసహస్రశీర్షమ్ |
నీలాంబరం ధృతహలం భుజగాంగనాభిః
జుష్టం భజే హర గదాన్గురుగేహనాథ || ౨౧-౧౨||

దేవా! పాతాళమున నీవు ఆదిశేషుని రూపమున ఉన్నావు. అక్కడ నీవు విలాసముగా కదలుతున్న కుండలములు గల వేయి శీర్శములతో రాజిల్లు చుందువు. ఎల్లప్పుడూ నీవు నీల వస్త్రమును ధరించి యుందువు. చేతిలో నాగలి ఉందును. నాగాన్గనలు ఎల్లపుడు నిన్ను కొలుచు చుందురు. అట్టి ఆదిశేషుని రూపముననున్న గురువాయురప్ప! నిన్ను నేను ఎల్లప్పుడును సేవింతును. కావున నా రోగములనన్నిటినీ సమూలముగా నాశనము చేయుము.

30, డిసెంబర్ 2010, గురువారం

లక్ష్మణాచార్య కృత నామ రామాయణం - తాత్పర్యము

రామ నామమే జీవనము, రాముని గుణ కీర్తనయే ముక్తి. రామాయణ పారాయణయే జీవిత సోపానము. అట్టి రామ నామ సంకీర్తన ఎన్నో రూపాలలో జరిగింది. అందులో శ్రీ రామ జయ రామ జయ జయ రామ, శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే, శ్రీ రామ రామ రఘునందన రామ రామ ఇలా ఎన్నో మంత్రాలు, స్తోత్రాలు ప్రసిద్ధి చెందాయి. కోట్లాది భక్తులకు తారకమై ముక్తిని ప్రసాదించాయి. భక్తి, భజన, దాస సాంప్రదాయాలలో, హరికథలలో ఆ కోదండ రాముని నుతి పలు విధాలుగా జరిగింది, జరుగుతోంది. అటువంటి ఒక నామ గుణ కీర్తనే ఈ నామ రామాయణం. మొత్తం రామాయణాన్ని ప్రతి వాక్యంలో 'రామ' తారకం తో అంతమయ్యేలా రాసారు రచయిత  లక్ష్మణాచార్యులు. ఈయన గురించి వేరే వివరాలు అందుబాటులో కనిపించలేదు. కానీ, ఆయన చేసిన రచన మన అందరి మనస్సులో నిలిచిపోయింది. తేలిక పదాలతో పిల్లలు సైతము పాడుకునేలా రాసారు కవీంద్రులు. 108 నామములుగా మొత్తం రామాయణాన్ని వర్ణించి ధన్యులు అయినారు కవి వర్యులు.

దశాబ్దాల క్రితం ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు దీన్ని దివ్యగానం చేశారు. ఆమె గళంలో ఇది ఒక అమృత ధారలా, రామ రస ప్రవాహంలా సుందరంగా, సుమధురంగా సాగుతుంది. రాగమాలికలో భక్తి ప్రపత్తులతో, నివేదనా భావనతో సాగుతుంది ఈ స్తుతి.

నామ రామాయణం, తాత్పర్యము, శ్రవణం ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి గళంలో.




బాల కాండ

శుద్ధబ్రహ్మపరాత్పర రామ
కాలాత్మకపరమేశ్వర రామ
శేషతల్పసుఖనిద్రిత రామ
బ్రహ్మాద్యమరప్రార్థిత రామ
చండకిరణకులమండన రామ
శ్రీమద్దశరథనందన రామ
కౌసల్యాసుఖవర్ధన రామ
విశ్వామిత్రప్రియధన రామ
ఘోరతాటకాఘాతక రామ
మారీచాదినిపాతక రామ
కౌశికమఖసంరక్షక రామ
శ్రీమదహల్యోద్ధారక రామ
గౌతమమునిసంపూజిత రామ
సురమునివరగణసంస్తుత రామ
నావికధావికమృదుపద రామ
మిథిలాపురజనమోహక రామ
విదేహమానసరంజక రామ
త్ర్యంబకకార్ముఖభంజక రామ
సీతార్పితవరమాలిక రామ
కృతవైవాహికకౌతుక రామ
భార్గవదర్పవినాశక రామ
శ్రీమదయోధ్యాపాలక రామ

రామరామ జయరాజా రామ
రామరామ జయసీతా రామ

అయోధ్యాకాండ

అగణితగుణగణభూషిత రామ
అవనీతనయాకామిత రామ
రాకాచంద్రసమానన రామ
పితృవాక్యాశ్రితకానన రామ
ప్రియగుహవినివేదితపద రామ
తత్క్షాళితనిజమృదుపద రామ
భరద్వాజముఖానందక రామ
చిత్రకూటాద్రినికేతన రామ
దశరథసంతతచింతిత రామ
కైకేయీతనయార్పిత రామ
విరచితనిజపితృకర్మక రామ
భరతార్పితనిజపాదుక రామ

రామరామ జయరాజా రామ
రామరామ జయసీతా రామ

అరణ్యకాండ

దండకావనజనపావన రామ
దుష్టవిరాధవినాశన రామ
శరభంగసుతీక్ష్ణార్చిత రామ
అగస్త్యానుగ్రహవర్ధిత రామ
గృధ్రాధిపసంసేవిత రామ
పంచవటీతటసుస్థిత రామ
శూర్పణఖార్తివిధాయక రామ
ఖరదూషణముఖసూదక రామ
సీతాప్రియహరిణానుగ రామ
మారీచార్తికృతాశుగ రామ
వినష్టసీతాన్వేషక రామ
గృధ్రాధిపగతిదాయక రామ
శబరీదత్తఫలాశన రామ
కబంధబాహుచ్ఛేదన రామ

రామరామ జయరాజా రామ
రామరామ జయసీతా రామ

కిష్కింధాకాండ

హనుమత్సేవితనిజపద రామ
నతసుగ్రీవాభీష్టద రామ
గర్వితవాలిసంహారక రామ
వానరదూతప్రేషక రామ
హితకరలక్ష్మణసంయుత రామ

రామరామ జయరాజా రామ
రామరామ జయసీతా రామ

సుందరకాండ

కపివరసంతతసంస్మృత రామ
తద్గతివిఘ్నధ్వంసక రామ
సీతాప్రాణాధారక రామ
దుష్టదశాననదూషిత రామ
శిష్టహనూమద్భూషిత రామ
సీతావేదితకాకావన రామ
కృతచూడామణిదర్శన రామ
కపివరవచనాశ్వాసిత రామ

రామరామ జయరాజా రామ
రామరామ జయసీతా రామ

యుద్ధకాండ

రావణనిధనప్రస్థిత రామ
వానరసైన్యసమావృత రామ
శోషితశరదీశార్తిత రామ
విభీష్ణాభయదాయక రామ
పర్వతసేతునిబంధక రామ
కుమ్భకర్ణశిరచ్ఛేదన రామ
రాక్షససంఘవిమర్ధక రామ
అహిమహిరావణచారణ రామ
సంహృతదశముఖరావణ రామ
విధిభవముఖసురసంస్తుత రామ
ఖఃస్థితదశరథవీక్షిత రామ
సీతాదర్శనమోదిత రామ
అభిషిక్తవిభీషణనుత రామ
పుష్పకయానారోహణ రామ
భరద్వాజాదినిషేవణ రామ
భరతప్రాణప్రియకర రామ
సాకేతపురీభూషణ రామ
సకలస్వీయసమానస రామ
రత్నలసత్పీఠాస్థిత రామ
పట్టాభిషేకాలంకృత రామ
పార్థివకులసమ్మానిత రామ
విభీషణార్పితరంగక రామ
కీశకులానుగ్రహకర రామ
సకలజీవసంరక్షక రామ
సమస్తలోకోద్ధారక రామ

రామరామ జయరాజా రామ
రామరామ జయసీతా రామ

ఉత్తరకాండ

ఆగత మునిగణ సంస్తుత రామ
విశ్రుతదశకంఠోద్భవ రామ
సీతాలింగననిర్వృత రామ
నీతిసురక్షితజనపద రామ
విపినత్యాజితజనకజ రామ
కారితలవణాసురవధ రామ
స్వర్గతచంబుక సంస్తుత రామ
స్వతనయకుశలవనందిత రామ
అశ్వమేధక్రతుదిక్షిత రామ
కాలావేదితసురపద రామ
ఆయోధ్యకజనముక్తిత రామ
విధిముఖవిభుదానందక రామ
తేజోమయనిజరూపక రామ
సంసృతిబంధవిమోచక రామ
ధర్మస్థాపనతత్పర రామ
భక్తిపరాయణముక్తిద రామ
సర్వచరాచరపాలక రామ
సర్వభవామయవారక రామ
వైకుంఠాలయసంస్థిత రామ
నిత్యానందపదస్థిత రామ

రామరామ జయరాజా రామ
రామరామ జయసీతా రామ


తాత్పర్యము:

బాల కాండ:

శ్రీరామా! - నీవు దైవ తత్త్వమైన పరబ్రహ్మవు  ,  కాలానికి ఆత్మ యైన పరమేశ్వరుడవు, శేషతల్పముపై నిద్రించే వాడవు, బ్రహ్మ మొదలగు దేవతలచే ప్రార్ధించ బడిన వాడవు, సూర్య వంశ యశస్సును ఇనుమడింప చేసిన వాడవు, దశరథుని ప్రియ పుత్రుడవు, కౌసల్య సుఖాన్ని పెంపొందించిన వాడవు, విశ్వామిత్రునికి ఇష్టుడవు, తాటకిని సంహరించిన వాడవు మారీచుని పారద్రోలిన వాడవు, విశ్వామిత్రుని యాగాన్ని కాపాడి ఆయన గౌరవాన్ని నిలబెట్టిన వాడవు, అహల్యను ఉద్ధరించి తిరిగి రూపాన్ని ఇచ్చిన వాడవు, గౌతమ మునిచే పూజించ బడిన వాడవు, దేవతలచే, మునులచే వరములు పొందిన వాడవు నావికుని చే మృదువైన పాదములు కడుగ బడిన వాడవు, మిథిలాపుర జనులను సమ్మోహ పరచి, జనకుని మనసుని రంజిల్ల చేసిన వాడవు, శివుని విల్లు విరచి, సీతచే వరమాలను పొంది వివాహమాడిన వాడవు, పరశురాముని గర్వము నాశనము చేసినవాడవు, అయోధ్యను పాలించిన వాడవు.

సీతారామునకు, రాజా రామునకు జయము జయము.

అయోధ్య కాండ:

ఓ శ్రీరామా! నీవు ఎన్నలేని సుగుణముల సమూహముతో శోభిల్లే వాడవు, భూమి పుత్రిక అయిన సీతచే ప్రేమించ బడిన వాడవు, చంద్రునివంటి ముఖము కలవాడవు, . పితృవాక్య పరిపాలనకి అడవులకు వెళ్లినా వాడవు, గుహునిచే ఆహ్వానించ బడి, పాదముల కడిగి పూజించబడిన వాడవు, భరద్వాజ మునికి ఆనందము కలిగించిన వాడవు, చిత్రకూటముపై నివసించిన వాడవు, దశరథునిచే ఎల్లప్పుడూ తలచబడిన వాడవు, భరతునిచే రాజ్యము సమర్పించబడిన వాడవు, దశరథునికి పితృ కర్మలు చేసిన వాడవు, భరతునికి పాదుకలు ఇచ్చిన వాడవు.

సీతారామునకు, రాజా రామునకు జయము జయము.

అరణ్యకాండ:

ఓ శ్రీరామా! నీవు దండకారణ్యంలోని జనులను పావనము చేసిన వాడవు, దుష్టుడైన విరాధుని చంపిన వాడవు, శరభంగుడు, సుతీక్ష్ణులచే పూజించ బడినవాడవు, అగస్త్యుని అనుగ్రహముతో వర్ధిల్లిన వాడవు, జటాయువుచే సేవించ బడినవాడవు, పంచవటీ తీరమున నివసించిన వాడవు, శూర్ఫణకకు దుఃఖము కలిగించిన వాడవు, ఖరఆ దూషణులను సంహరించిన వాడవు, సీత కోరిన మాయలేడిని అనుసరించిన వాడవు, మారీచుని సంహరించిన వాడవు, సీతను వెదకుతూ వెళ్ళిన వాడవు, జటాయువుకు మోక్షము కలిగించిన వాడవు, శబరి ఇచ్చిన ఫలములు తిన్న వాడవు, కబంధుని బాహువులు నరికిన వాడవు.

సీతారామునకు, రాజా రామునకు జయము జయము.

కిష్కింధకాండ:

ఓ శ్రీరామ! నీవు - హనుమంతునిచే పాదసేవ పొందిన వాడవు, సుగ్రీవుని కోరిక తీర్చిన వాడవు, గర్వి అయిన వాలిన సంహరించిన వాడవు, వానరులను దూతగా పంపిన వాడవు, హితుడైన లక్ష్మణునితో కూడి యున్నవాడవు.

సీతారామునకు, రాజా రామునకు జయము జయము.

సుందరకాండ:

ఓ శ్రీరామా! నీవు హనుమంతునిచే ఎల్లప్పుడూ తలచబడిన వాడవు, ఆతని మార్గమున అవరోధములను విధ్వంసము చేసిన వాడవు,  లంకలో ఉన్న సీత ప్రాణమునకు ఆధారమైన వాడవు, రావణునిచే దూషించ బడినవాడవు, సుజనుడైన హనుమంతునిచే భూషితుడవు,
సీతాదేవిచే హనుమంతునితో తనను కాకాసురుని బారినుండి కాపాడిన వానిగా పేర్కొనబడ్డావు, హనుమంతుని ద్వారా చూడామణిని చూపబడ్డావు, ఉత్తముడైన హనుమంతుని సందేశముతో, మాటలతో ఊరట చెందావు.

సీతారామునకు, రాజా రామునకు జయము జయము.

యుద్ధ కాండ: 

ఓ శ్రీరామా!  నీవు వానర సైన్యముతో కూడి రావణుని సంహరించ బయలుదేరితివి.  నీ క్రోధముతో ఎండిపోయిన సముద్రుని కాపాడినావు, విభీషణునికి అభయమిచ్చినావు, రాళ్ళతో వానరుల సహాయముతో సేతువును నిర్మించినావు. కుంభకర్ణుని సంహరించినావు. వేలాది రాక్షసులను అంతము చేసావు. అహిరావణ, మైరావణులచే పాతాళమునకు కొనిపోబడినావు, పదితలల రావణుని సంహరించినావు. బ్రహ్మ, శివులచే నుతించబడిన వాడవు,  ఆకాశమునుండి తండ్రియైన దశరథునిచే చూడబడిన వాడవు, సీత సంయోగముతో ఆనందించిన వాడవు, నీ చేత లంకాభిషిక్తుడైన విభీషణునిచే పొగడబడిన వాడవు, పుష్పకమును అధిరోహించిన వాడవు. భరద్వాజుడు మొదలగు వారిచే పూజించబడిన వాడవు, భరతునికి ప్రాణము వంటి వాడవు, అయోధ్యకు ఆభరణము వంటి వాడవు, అందరిచే గౌరవించబడిన వాడవు, రత్నములచే అలంకరించబడిన పీఠాన్ని అధిరోహించిన వాడవు, పట్టాభిషిక్తుడవై శోభిల్లినావు, సామంతరాజులచే గౌరవించ బడినవాడవు, విభీషణునిచే పూజించబడిన వాడవు (ఎరుపు వర్ణపు లేపనముతో), వానర సమూహాన్ని అనుగ్రహించిన వాడవు, అన్ని జీవులను కాపాడే వాడవు, అందరిని రక్షించే వాడవు.

సీతారామునకు, రాజా రామునకు జయము జయము.

ఉత్తరకాండము:

ఓ రామా!  నీవు చూడవచ్చిన మునులచే స్తుతించబడిన వాడవు, వారి నోట రావణుని కథ విన్న వాడవు. సీతాలింగనముతో ఆనందము పొందిన వాడవు, నీతితో జనులను రక్షినచిన వాడవు. ధర్మము పాటించుటకై సీతను అడవులకు పంపించిన వాడవు. లవణాసురుని వధను కూర్చిన వాడవు, స్వర్గగతుడైన శంబూకునిచే నుతించ బడిన వాడవు, సుతులైన లవ కుశులతో ఆనందము పొందిన వాడవు, అశ్వమేధ దీక్ష తీసుకున్న వాడవు. అవతార సమాప్తియైనదని దేవతలచే వర్తమానము పొందిన వాడవు, అయోధ్య ప్రజలకు ముక్తి ప్రసాదించిన వాడవు. బ్రహ్మాది దేవతలకు ఆనందము కలిగించిన వాడవు. తేజోమయ రూపము కలిగిన వాడవు. జనన మరణ బంధముల నుండి విముక్తి కలిగించే వాడవు. ధర్మ స్థాపనే ధ్యేయముగా కలవాడవు. భక్తి పరాయణులకు  మోక్షము కలిగించే వాడవు, సర్వ జీవులకు పాలకుడవు, సర్వ రోగములను పోగొట్టే వాడవు, వైకుంఠంలో నివసించే వాడవు, శాశ్వతమైన ఆనందము కలిగే పదములో ఉన్నవాడవు.

సీతారామునకు, రాజా రామునకు జయము జయము.

29, డిసెంబర్ 2010, బుధవారం

శ్రీమన్నారాయణీయం - చతుర్థ స్కంధము, తాత్పర్యము

శ్రీమన్నారాయణీయం - చతుర్థ స్కంధము




పదునారవ దశకము - నరనారాయణుల అవతారము

దక్షో విరించతనయోఽథ మనోస్తనూజాం
లబ్ధ్వా ప్రసూతిమిహ షోడశ చాప కన్యాః |
ధర్మే త్రయోదశ దదౌ పితృషు స్వధాం చ
స్వాహాం హవిర్భుజి సతీం గిరిశే త్వదంశే || ౧౬-౧||

దక్షుడు మనువుయొక్క పుత్రిక యగు ప్రసూతిని వివాహమాడెను. వారికి పదహారుగురు పుత్రికలు కలిగారు. వారిలో పదమూడు మందిని ధర్మునకు ఇచ్చి వివాహము చేసెను. పితృ దేవతలకు స్వధా అను కూతురును, అగ్నిదేవునకు స్వాహా అను కూతురును ఇచ్చెను. ఇట్లే,  విష్ణువు (నీ) అంశతో జన్మించిన శివునకు సతీదేవిని ఇచ్చి వివాహము చేసెను.

మూర్తిర్హి ధర్మగృహిణీ సుషువే భవంతం
నారాయణం నరసఖం మహితానుభావమ్ |
యజ్జన్మని ప్రముదితాః కృతతుర్యఘోషాః
పుష్పోత్కరాన్ప్రవవృషుర్నునువుః సురౌఘాః || ౧౬-౨||

దక్షప్రజాపతి పుత్రిక, దరమును భార్యయైన "మూర్తి"కి నీవు నారాయణుడు అనే పేరుతో గొప్ప మహిమలు కలవానిగా జన్మించినావు. అట్లే, నీ అంశతో నరుడు అనువాడు జన్మించగా నీరు అన్యోన్య స్నేహముతో పెరిగితిరి. ప్రభూ! నీవు జన్మించు ఆ శుభ సమయమున దేవతలు సంతోషమును పట్టలేక దుందుభి మొదలైన మంగళ వాద్యములను మ్రోగించుచు పుష్పవ్రుష్టిని కురిపించి, నిన్ను స్తుతించిరి.

దైత్యం సహస్రకవచం కవచైః పరీతం
సాహస్రవత్సరతపస్సమరాభిలవ్యైః |
పర్యాయనీర్మితతపస్సమరౌ భవంతౌ
శిష్టైకకంకటమముం న్యహతాం సలీలమ్ || ౧౬-౩||

ఆ కాలమున సహస్ర కవచుడను రాక్షసుడు ఉండెను. అతనికి వేయి కవచములుండెను. అవి ఒక్కొక్కటి వేయి సంవత్సరములు తపస్సు చేసి, వేయి సంవత్సరములు యుద్ధము చేసినందు వలననే ఛేదించుటకు వీలయ్యేవి. మంచి వారిని బాధించుచున్న ఆ రాక్షసుని నర నారాయణులు మీరు ఒకరి తరువాత ఒకరు వేయి సంవత్సరములు తపస్సు, వేయి సంవత్సరములు యుద్ధము చేయుచు అతని కవచములను ఛేదించిరి. అటు పిమ్మట అతని వధించితిరి.

అన్వాచరన్నుపదిశన్నపి మోక్షధర్మం
త్వం భ్రాతృమాన్ బదరికాశ్రమమధ్యవాత్సీః |
శక్రోఽథ తే శమతపోబలనిస్సహాత్మా
దివ్యాంగనాపరివృతం ప్రజిఘాయ మారమ్ || ౧౬-౪||

స్వామీ! నరనారాయణ అవతారముననున్న మీరు బదరికాశ్రమమున ఉండి మోక్ష ధర్మమైన నివృత్తి మార్గమును స్వయంగా పాటించుచు అక్కడ ఉన్న మహర్షులకు దానిని ఉపదేశించుచుంటిరి. అప్పుడు మీ శమము, తపోబలము చూచి ఇంద్రునకు భయము కలిగినది. అందువలన మీ తపస్సునకు విఘ్నము కలిగించ వలెనని అతడు దివ్యాంగనలతో మన్మథుని పంపెను.

కామో వసంతమలయానిలబంధుశాలీ
కాంతాకటాక్షవిశిఖైర్వికసద్విలాసైః |
విధ్యన్ముహుర్ముహురకంపముదీక్ష్య చ త్వాం
భీతస్త్వయాథ జగదే మృదుహాసభాజా || ౧౬-౫||

అప్పుడు వసంతుడు, మలయానిలము వంటి స్నేహితులతో కలసి మన్మథుడు మిక్కిలి విలాసము కల అప్సరస స్త్రీల యొక్క కతాక్షములచే మీ తపస్సును భంగ పరచుటకు ప్రయత్నించెను. అయినా, మీరు స్థిరముగా ఉండుట చూచి మన్మథునకు భయము వేసినది. అప్పుడు మీరు చిరునవ్వుతో ఇట్లు పలికితిరి.

భీత్యాలమంగజవసంతసురాంగనా వో
మన్మానసంత్విహ జుషుధ్వమితి బ్రువాణః |
త్వం విస్మయేన పరితః స్తువతామథైషాం
ప్రాదర్శయః స్వపరిచారకకాతరాక్షీః || ౧౬-౬||

"మన్మథా! వసంతుడా! అప్సరసలారా! మీరు భయ పడవద్దు. నేనిచ్చే అతిథి సత్కారములు స్వీకరించండి" అని అనగా వారు ఆశ్చర్యముతో స్తుతించుచుండిరి. అట్టి మన్మథుడు మొదలైన వారికి మిమ్ము సేవిన్చుచున్న పరిచారికలను మీరు చూపించితిరి.

సమ్మోహనాయ మిలితా మదనాదయస్తే
త్వద్దాసికాపరిమళైః కిల మోహమాపుః |
దత్తాం త్వయా చ జగృహుస్త్రపయైవ సర్వ-
స్వర్వాసిగర్వశమనీం పునరుర్వశీం తామ్ || ౧౬-౭||

మన్మథుడు మొదలైన వారు నీ దాసీ జనము యొక్క సౌందర్యమును చూసి మోహ పరవశులైరి. స్వర్గములో అందరి సుందరీమణుల గర్వమును పోగొట్టు సౌందర్యము కల ఊర్వశిని కానుకగా వారికి ఒసగగా మన్మథుడు మొదలైన వారు ఊర్వశిని చూసి సిగ్గుపడి ఆమెను స్వీకరించిరి.

దృష్ట్వోర్వశీం త్వం కథాం చ నిశమ్య శక్రః
పర్యాకులోఽజని భవన్మహిమావమర్శాత్ |
ఏవం ప్రశాంతరమణీయతరాఽవతారత్
త్వత్తోఽధికో వరద కృష్ణతనుస్త్వమేవ || ౧౬-౮||

మన్మథుడు మొదలైన వారు ఊర్వశిని దేవేంద్రునకు అర్పించి, మీ మహిమను తెలుపగా, తాను చేసిన తప్పుకు అతడు చాలా విచారించెను. వరములనిచ్చు స్వామీ! సౌమ్యము, సుందరమైన ఈ నర నారాయణ అవతారము కంటే మిగుల కృష్ణ స్వరూపము నీదే.

దక్షస్తు ధాతురతిలాలనయా రజోఽంధో
నాత్యాదృతస్త్వయి చ కష్టమశాంతిరాసీత్ |
యేన వ్యరుంధ స భవత్తనుమేవ శర్వం
యజ్ఞో చ వైరపిశునే స్వసుతాం వ్యమానీత్ || ౧౬-౯||

బ్రహ్మ తన పుత్రుడైన దక్షుని మిక్కిలి ప్రేమతో లాలించినందు వలన అతడు గర్వాంధుడయ్యెను. అందువలన అతడు బ్రహ్మ దేవుని మరియు మిమ్ములను గౌరవించకుండెను. దక్షుడు మీ అంశారూపియైన శంకరుని ద్వేషించ సాగెను. అతనితో గల వైరముతో తన యాగమున తన కూతురైన సతీదేవిని కూడా అవమాన పరచెను.

కృద్ధేశమర్దితమఖః స తు కృత్తశీర్షో
దేవప్రసాదితహరాదథ లబ్ధజీవః |
త్వత్పూరితక్రతువరః పునరాప శాంతిం
స త్వం ప్రశాంతికర పాహి మరుత్పురేశ || ౧౬-౧౦||

అందువలన శంకరుడు కోపించి దక్షుని యాగమును ధ్వంసించెను. అతని శిరస్సును కూడా ఖండించెను. అప్పుడు దేవతలు శంకరుని వేడుకొనగా దక్షుడు బ్రతికెను. ఆ యజ్ఞము సంపూర్ణము అయినందు వలన దక్షుడు శాంతించెను.  ఇట్లు శాంతిని కలిగించు గురువాయురప్పా! నీవే నన్ను రక్షించవలెను.

పదునేడవ దశకము - ధృవ చరితము

ఉత్తానపాదనృపతేర్మనునందనస్య
జాయా బభూవ సురుచిర్నితరామభీష్టా |
అన్యా సునీతిరితి భర్తురనాదృతా సా
త్వామేవ నిత్యమగతిః శరణం గతాఽభూత్ || ౧౭-౧||

మనువునకు ఉత్తానపాదుడనే పుత్రుడు ఉండెను. అతనికి సునీతి, సురుచియను భార్యలు. వారిలో చిన్న భార్య యైన సురుచిపై మహారాజుకు అమితమైన ప్రేమ. పెద్ద భార్యను అతడు నిరాదరించ సాగెను. అప్పుడు నిస్సహాయురాలైన ఆమె నిన్నే శరణు పొంది ప్రతిదినము ఆరాధించసాగినది.

అంకే పితుః సురుచిపుత్రకముత్తమం తం
దృష్ట్వా ధ్రువః కిల సునీతిసుతోఽధిరోక్ష్యన్ |
ఆచిక్షిపే కిల శిశుః సుతరాం సురుచ్యా
దుస్సంత్యజా ఖలు భవద్విముఖైరసూయా || ౧౭-౨||

ఒకనాడు సురుచి పుత్రుడైన ఉత్తముడు తండ్రియైన ఉత్తానపాదుని ఒడిలో కూర్చుని ఆడుకొనుచుండెను. అప్పుడు సునీతి కొడుకైన ధ్రువుడు కూడా తండ్రి ఒడిలో కూర్చొన బోయెను. దానిని చూచి సురుచి బాలుడైన ధ్రువుని అధిక్షేపించుచు అతనిని నివారించెను. స్వామీ! నీపై భక్తిలేని వారికి అసూయ ఉండుట సహజము కదా!.

త్వన్మోహితే పితరి పశ్యతి దారవశ్యే
దూరం దురుక్తినిహతః స గతో నిజాంబామ్ |
సాఽపి స్వకర్మగతిసంతరణాయ పుంసాం
త్వత్పాదమేవ శరణం శిశవే శశంస || ౧౭-౩||

ప్రభూ! తండ్రియైన ఉత్తానపాదుడు నీ మాయవల్ల మోహమున పడి చిన్న భార్యయైన సురుచికి ఆధీనుడుగా ఉండెను. అట్టి తన తండ్రి చూస్తుండగానే పినతల్లియైన సురుచి కఠినమైన మాటలు పలుకగా బాలుడైన  ధ్రువుని మనస్సు బాధపడినది. అందువలన అతడు బాధపడుచు తన తల్లి దగ్గరకు పోయెను. ఆమె అప్పుడు కర్మగతిని తప్పించుటకు కారణమైన నీ పాదములనే శరణు పొందుమని అతనికి  బోధించినది.

ఆకర్ణ్య సోఽపి భవదర్చనిశ్చితాత్మా
మానీ నిరేత్య నగరాత్కిల పంచవర్షః |
సందృష్టనారదనివేదితమంత్రమార్గః
త్వామారరాధ తపసా మధుకాననాంతే || ౧౭-౪||

ఆ బాలుడు తల్లిమాటలు విని నీ పాదారవిందములను సేవించవలెను అని నిశ్చయించుకొనెను. ఐదు సంవత్సరముల వయసు గల ఆ బాలుడు పట్టణము వదిలి పెట్టి పోవుచున్నంత నారద మహర్షి కనిపించి భగవంతుని సేవించుటకై ద్వాదశాక్షర మంత్రమును, ధ్యానించు పద్ధతిని బోధించెను. ధ్రువుడు అదే విధముగా మధువనమునకు పోయి కఠినమైన తపస్సుతో నిన్ను ఆరాధించ సాగెను.

తాతే విషణ్ణహృదయే నగరీం గతేన
శ్రీనారదేన పరిసాంత్వితచిత్తవృత్తౌ |
బాలస్త్వదర్పితమనాః క్రమవర్ధితేన
నిన్యే కఠోరతపసా కిల పంచ మాసాన్ || ౧౭-౫||

ధ్రువుడు దూరమగుట వలన ఉత్తానపాదుడు చాలా వ్యథ చెందెను. అప్పుడు నారదుడు వచ్చి ధ్రువునకు కలుగబోవు యోగమును చెప్పి అతని మనస్సును శాంతపరచెను. ఇక ధ్రువుడు పరమాత్మవైన నీ యందు మనస్సు నిలిపి తపస్సును క్రమక్రమముగా పెంచి ఐదు మాసములు గడిపెను.

తావత్తపోబలనిరుచ్ఛ్వసితే దిగంతే
దేవార్థితస్త్వముదయత్కరుణార్ద్రచేతాః |
త్వద్రూపచిద్రసనిలీనమతేః పురస్తా-
దావిర్బభూవిథ విభో గరుడాధిరూఢః || ౧౭-౬||

ధ్రువుని తపస్సుకు లోకములు తల్లడిల్లి పోయెను. అప్పుడు దేవతలందరూ నిను ప్రార్థించగా మిక్కిలి దయతో గరుత్మంతుని అధిరోహించి నీ స్వరూపమను చిదానంద రసమున నిమగ్నుడై యున్న ధ్రువునకు దర్శనమొసగితివి.

త్వద్దర్శనప్రమదభారతరంగితం తం
దృగ్భ్యాం నిమగ్నమివ రూపరసాయనే తే |
తుష్టూషమాణమవగమ్య కపోలదేశే
సంస్పృష్టవానసి దరేణ తథాఽఽదరేణ || ౧౭-౭||

ధ్రువునకు నీ దివ్యరూప దర్శనము కలుగగానే అతని మనస్సు ఆనందములో మునిగిపోయింది. కన్నులు సంతోష బాష్పములతో నిండి పోయినవి. ఆ విధముగా యున్న ధ్రువుడు నిన్ను స్తుతిన్చదలచినను అతనికి తగిన శక్తిలేనందు వలన నీవు ప్రేమతో నీ శంఖముతో అతని కపోలములపై స్ప్రుశించితివి.

తావద్విబోధవిమలం ప్రణువంతమేన-
మాభాషథాస్త్వమవగమ్య తదీయభావమ్ |
రాజ్యం చిరం సమనుభూయ భజస్వ భూయః
సర్వోత్తరం ధ్రువ పదం వినివృత్తిహీనమ్ || ౧౭-౮||

ప్రభూ! నీ శంఖము వేదమయము. అట్టి శంఖ స్పర్శ వలన ధ్రువునకు నిర్మలమైన జ్ఞానము కలిగినది. పరమాత్మవైన నిన్ను స్తుతించు శక్తి కూడా ప్రాప్తించినది. అందువలన ధ్రువుడు నిన్ను స్తుతి చేయుచున్నప్పుడు అతని భావమును ఎరిగి అతనితో 'ధృవా! నీవు చాలా కాలము రాజ్యమును ఏలిన తరువాత పునరావృత్తి రహితమై అత్యున్నతమైన ధ్రువ స్థానమున ఉందువు" అని పలికితివి.

ఇత్యూచిషి త్వయి గతే నృపనందనోఽసౌ-
ఆనందితాఖిలజనో నగరీముపేతః |
రేమే చిరం భవదనుగ్రహపూర్ణకామః
తాతే గతే చ వనమాదృతరాజ్యభారః || ౧౭-౯||

స్వామీ! ఈ విధముగా నీవు ధ్రువుని అనుగ్రహించి నీ లోకమును చేరుకొంటివి. ఈ విషయము తెలిసిన జనము సంతోషముతో ధ్రువుని అభినందించసాగిరి.ధ్రువుడు పట్టణము చేరిన తరువాత కొంత కాలమునకు అతని తండ్రియైన ఉత్తానపాదుడు అడవికి పోయెను. ధ్రువుడు నీ అనుగ్రహము వలన కోరికలు తీరి చాలా కాలము రాజ్యమేలెను.

యక్షేణ దేవ నిహతే పునరుత్తమేఽస్మిన్
యక్షైః స యుద్ధనిరతో విరతో మనూక్త్యా |
శాంత్యా ప్రసన్నహృదయాద్ధనదాదుపేతాత్
త్వద్భక్తిమేవ సుదృఢామవృణోన్మహాత్మా || ౧౭-౧౦||

పరమేశ్వరా! ఉత్తముని ఒక యక్షుడు చంపినందు వలన ధ్రువుడు యక్షులపై యుద్ధము ప్రకటించెను. కాని మనువు వచ్చి చెప్పినందు వలన అతడు యక్షులతో యుద్దమును మానివేసెను. అందువలన యక్షరాజైన కుబేరుడు సంతోషించి వరమీయబోగా నీ యందు దృఢమైన భక్తి మాత్రమే కావలెనని ధ్రువుడు వరమును కోరెను.

అంతే భవత్పురుషనీతవిమానయాతో
మాత్రా సమం ధ్రువపదే ముదితోఽయమాస్తే |
ఏవం స్వభృత్యజనపాలనలోలధీస్త్వం
వాతాలయాధిప నిరుంధి మమామయౌఘాన్ || ౧౭-౧౧||

ధ్రువుడు చాలా కాలము రాజ్యమును పాలించిన తరువాత నీయొక్క సేవకులు అతనిని ద్రువపదమునకు తీసికొని పోవుటకు విమానములో వచ్చిరి. అప్పుడా ధ్రువుడు తల్లితో కలిసి ద్రువపదమునకు పోయెను. ఈ విధముగా తన భక్తులను పరిపాలించు గురువాయుపుర పతీ! నాకున్న సమస్త రోగములను కృపతో దూరము చేయుము.

పదునెనిమిదవ దశకము - పృథు చరితము

జాతస్య ధ్రువకుల ఏవ తుంగకీర్తే-
రంగస్య వ్యజని సుతః స వేననామా |
తద్దోషవ్యథితమతిః స రాజవర్య-
స్త్వత్పాదే విహితమనా వనం గతోఽభూత్ || ౧౮-౧||

ధ్రువుని వంశమున అంగుడను మహారాజు జన్మించెను. అతడు చక్కగా రాజ్య పరిపాలనము చేసినందు వలన గొప్పకీర్తి పొందెను. ఆయనకు వేనుడను పుత్రుడు కలిగెను. దుర్మార్గుడైన తన పుత్రుడు చేయుచున్న అక్రమములను చూచి సహించలేక బాధపడుచు అంగ మహారాజు నిన్ను ధ్యానించుటకై  అడవికి పోయెను.

పాపోఽపి క్షితితలపాలనాయ వేనః
పౌరాద్యైరుపనిహితః కఠోరవీర్యః |
సర్వేభ్యో నిజబలమేవ సంప్రశంసన్
భూచక్రే తవ యజనాన్యయం న్యరౌత్సీత్ || ౧౮-౨||

వేనుడు మిక్కిలి దుర్మార్గుడు. అయినా, అతడు మిక్కిలి బలము కలవాడు అని పుర ప్రముఖులు అతనిని రాజ్యపాలనము చేయుటకు సమ్మతించి రాజ సింహాసనము కట్టబెట్టిరి. అందువలన వేనుడు ఎల్లప్పుడూ తన బలమును పొగడుకొనుచు భూమండలమున ఎవ్వరుకూడా యజ్ఞ యాగాదులు చేయరాదని శాసించెను.

సంప్రాప్తే హితకథనాయ తాపసౌఘే
మత్తోఽన్యో భువనపతిర్న కశ్చనేతి |
త్వన్నిందావచనపరో మునీశ్వరైస్తైః
శాపాగ్నౌ శలభదశామనాయి వేనః || ౧౮-౩||

అతనికి హితవు చెప్పుటకు మహర్షులు కలసి వచ్చిరి. కానీ, మూర్ఖుడైన రాజు 'నన్ను మించిన లోకాధిపతి ఎవరున్నారు' అని జగన్నాథుడవైన నిన్ను నిందింప సాగెను. నీ నిందను సహించ లేని మునీశ్వరులు కోపముతో శాపమీయగా ఆ శాపాగ్నికి వేనుడు శలభము వలె దగ్ధ మయ్యెను.

తన్నాశాత్ఖలజనభీరుకైర్మునీంద్రై-
స్తన్మాత్రా చిరపరిరక్షితే తదంగే |
త్యక్తాఘే పరిమథితాదథోరుదండాత్
దోర్దండే పరిమథితే త్వమావిరాసీః || ౧౮-౪||

వేనుడి మరణము వలన రాజు లేని ఆ దేశమున దుర్మార్గులు విచ్చలవిడిగా ప్రవర్తించుచుండగా మునులు భీతిల్లితిరి. వేనుని మృత శరీరమును ఆతని తల్లి ప్రేమాతిశయముతో రక్షంచ సాగెను. అప్పుడు మహర్షులు తిరిగి వచ్చి అతని ఊరువులను మథించగా అతని పాపము అంతా నశించెను. పిమ్మట అతని బాహువ్ను మథించగా దాని నుండి పరమాత్మవైన నీవు ఆవిర్భవించితివి.

విఖ్యాతః పృథురితి తాపసోపదిష్టైః
సూతాద్యైః పరిణుతభావిభూరివీర్యః |
వేనార్త్యా కబలితసంపదం ధరిత్రీం-
ఆక్రాంతాం నిజధనుషా సమామకార్షీః || ౧౮-౫||

పృథు మహారాజు అను పేరుతో ప్రసిద్ధి పొందిన నీవు మహర్షులు చెప్పినట్లుగా విని రాజ్యపాలన చేయసాగిటివి. అందువలన ప్రజలు, వండి మాగధులు నిన్ను ఘనముగా కీర్తిన్చిరి. వేనుని దుర్మార్గములకు భయపడి సంపదలను తనలో దాచుకొనిన భూమిని నీవు ధనుస్సు ధరించి శాసించి సుసంపన్నము చేసితివి.

భూయస్తాం నిజకులముఖ్యవత్సయుక్తైః
దేవాద్యైః సముచితచారుభాజనేషు |
అన్నాదీన్యభిలషితాని యాని తాని
స్వచ్ఛందం సురభితనూమదూదుహస్త్వమ్ || ౧౮-౬||

అప్పుడు భూమి ఆవుగా మారెను. దేవతలు మొదలైన వారు తమ తమ వర్గములకు చెందిన వారిని దూడలు చేయగా, సముచితమైన పాత్రల యందు అన్నము మొదలైన కోరిన వస్తువులను నీవు ఆ భూగోవునుండి పితికితివి.

ఆత్మానం యహతి మఖైస్త్వయి త్రిధామ-
న్నారబ్ధే శతతమవాజిమేధయాగే |
స్పర్ధాళుః శతమఖ ఏత్య నీచవేషో
హృత్వాఽశ్వం తవ తనయాత్ పరాజితోఽభూత్ || ౧౮-౭||

త్రివిక్రముడగు శ్రీ మహావిష్ణో! పృథువు రూపమున నీవు యజ్ఞములు చేయుచు నీ స్వరూపమునే ఆరాధించుచుంటివి. ఈ విధముగా ఆశ్వమేధములు నూరు చేయ తలపెట్టితివి.నీవు నూరవ అశ్వమేధము చేయుచున్నప్పుడు దేవేంద్రుడు అసూయతో నీచ వేషమున వచ్చి యాగాశ్వమును దొంగిలించెను. అప్పుడు నీ పుత్రుడు దేవేంద్రుని జయించి అశ్వమును తీసికొని వచ్చెను.

దేవేంద్రం ముహురితి వాజినం హరంతం
వహ్నౌ తం మునవరమండలే జుహూషౌ |
రుంధానే కమలభవే క్రతోః సమాప్తౌ
సాక్షాత్త్వం మధురిపుమైక్షథాః స్వయం స్వమ్ || ౧౮-౮||

పృథు మహారాజు యొక్క పుత్రుడు దేవేంద్రుని జయించి యజ్ఞాశ్వమును తీసికొని రాగా దేవేంద్రుడు మరల ఆ యజ్ఞాశ్వమును దొంగిలించుటకై ప్రయత్నించెను. అప్పుడు ఆ యజ్ఞమున రుత్విక్కులుగా ఉన్న భ్రుగు మహర్షి మొదలైన వారు దేవేంద్రుని ఆహుతి చేయుటకు ప్రయత్నించిరి. ఆ సమయములో బ్రహ్మ దేవుడు స్వయముగా వచ్చి రుత్విక్కులను వారించి యజ్ఞమును పూర్తి చేయించెను. మధుసూదనా! అంతట ఆ మహారాజునకు నీవు దర్శన మొసగితివి.

తద్దత్తం వరముపలభ్య భక్తిమేకాం
గంగాంతే విహితపదః కదాపి దేవ |
సత్రస్థం మునినివహం హితాని శంస-
న్నైక్షిష్ఠాః సనకముఖాన్ మునీన్ పురస్తాత్ || ౧౮-౯||

స్వామీ! పృథు మహారాజు నేఎ ద్వారా అనన్య భక్తియను వరమును మాత్రము తీసికొని గంగాతీరమున నివసించు చుండెను. ఒకానొకప్పుడు అక్కడ దీర్ఘకాలిక సమావేశమున పాల్గోనుచున్న మునులకు నీవు ప్రవ్రుత్తి నివృత్తి రూపములైన హిత వచనములను ఉపదేశించితివి. అచట సనకాది మునులను చూచితివి.

విజ్ఞానం సనకముఖోదితం దధానః
స్వాత్మానం స్వయమగమో వనాంతసేవీ |
తత్తాదృక్పృథువపురీశ సత్వరం మే
రోగౌఘం ప్రశమయ వాతగేహవాసిన్ || ౧౮-౧౦||

దేవా! పృథు మహారాజు రూపముననున్న నీవు సనకాది మునులు ఉపదేశించిన బ్రహ్మ జ్ఞానమును చక్కగా స్వీకరించితివి. పిమ్మట నీవు పుత్రులకు రాజ్యమును అప్పగించి వనములకు వెళ్లి తపస్సులో నిమగ్నుడవు అయితివి. తరువాత నీ స్వస్వరూపమును పొందితివి. అట్టి పవన పురాధీశా!  నా రోగములను దయతో రూపుమాపుము.

పందొమ్మిదవ శతకము - ప్రాచేతసుల కథ

పృథోస్తు నప్తా పృథుధర్మకర్మఠః ప్రాచీనబర్హిర్యువతౌ శతదృతౌ |
ప్రచేతసో నామ సుచేతసః సుతానజీజనత్త్వత్కరుణాంకురానివ || ౧౯-౧

ప్రభూ! పృథు మహారాజు యొక్క మునిమనుమడు ప్రాచీన బర్హి. అతడు గొప్పగా యజ్ఞ యాగాదులు నిర్వహించెను. అతని భార్య శతద్రుతి. ఆ దంపతులకు 'ప్రచేతసులు' అను కుమారులు కలిగిరి. వారందరూ జ్ఞాన సంపన్నులు. వారు నీ దయవలన అంకురించిన వారే.

పితుః సిసృక్షానిరతస్య శాసనాద్భవత్తపస్యాభిరతా దశాపి తే |
పయోనిధిం పశ్చిమమేత్య తత్తటే సరోవరం సందదృశుర్మనోహరమ్ || ౧౯-౨

స్వామీ! ఆ పదిమంది ప్రచేతసులును నిన్ను గూర్చి తపస్సు చేయుట యందే నిరతులు. ఐనను వంశాభివృద్ధికై ఆసక్తి చూపుతున్న తండ్రియోక్క ఆజ్ఞను అనుసరించి వారు తపస్సు ద్వారా నీ అనుగ్రహమును పొందుటకై పశ్చిమ సముద్ర తీరమునకు చేరిరి. అచట వారికి మనోహరమైన ఒక సరస్సు కనబడెను.


తదా భవత్తీర్థమిదం సమాగతో భవో భవత్సేవకదర్శనాదృతః |
ప్రకాశమాసాద్య పురః ప్రచేతసాముపాదిశద్భక్తతమస్తవస్తవమ్ || ౧౯-౩

ఒకనాడు నీ భక్తులందు మిక్కిలి ఉత్తముడైన శంకరుడు నీ భక్తులగు ప్రచేతసులను దర్శించుకొనవలెనను కోరికతో ఆ తీర్థమునకు వచ్చెను. ఆ శంకరుడు ప్రచేతసులకు కనిపించి మీ స్తోత్రమునొక దానిని వారికి ఉపదేశించెను.

స్తవం జపంతస్తమమీ జలాంతరే భవంతమాసేవిషతాయుతం సమాః |
భవత్సుఖాస్వాదరసాదమీష్వియాన్బభూవ కలో ధ్రువవన్న శీఘ్రతా || ౧౯-౪

ఆ ప్రాచేతసులందరూ శివుడు ఉపదేశించిన స్తవములను సరస్సులోనే అనేక వేల సంవత్సరములు జపించుచు నిన్ను ధ్యానింప సాగిరి. ఈ విధముగా ప్రచేతసులు బ్రహ్మానంద రసాస్వాదనము నందు మునిగి యుండిరి. ఉపాసనా ఫలితమును గురించి వారును ధ్రువుని వలె ఏ మాత్రమూ తొందర పడలేదు.

తపోభిరేషామతిమాత్రవర్ధిభిః స యజ్ఞహింసానిరతోఽపి పావితః |
పితాఽపి తేషాం గృహయాతనారదప్రదర్శితాత్మా భవదాత్మతాం యయౌ || ౧౯-౫

ప్రచేతసుల తండ్రియైన ప్రాచీనబర్హి అనేక యాగాములను చేసి ఆ యాగాములందు పశుహింస చేసినప్పతికిని తన పుత్రులు చేసిన గొప్ప తపస్సు వలన పవిత్రుడయ్యెను. ఆ ప్రాచీనబర్హి మహారాజు దగ్గరకు నారదుడు ఒకసారి వచ్చి ఆత్మ జ్ఞానమును బోధించెను. అందువలన ఆ మహారాజు సాయుజ్యమను ముక్తిని పొందెను.

కృపాబలేనైవ పురః ప్రచేతసాం ప్రకాశమాగాః పతగేంద్రవాహనః |
విరాజి చక్రాదివరాయుధాంశుభిః భుజాభిరష్టాభిరుదంచితద్యుతిః || ౧౯-౬

స్వామీ! నీవు నీ కృప వలననే ప్రచేతసులకు ప్రత్యక్షమైతివి. అప్పుడు నీ దివ్య స్వరూపమిట్లున్నది. నీవు పక్షీన్ద్రుడైన గరుడుని అధిరోహించి యున్నావు. శంఖము, చక్రము మొదలైన ఎనిమిది దివ్యాయుధములు ఎనిమిది భుజములందు ధరించితివి.

ప్రచేతసాం తావదయాచతామపిః త్వమేవ కారుణ్యభరాద్వారానదాః |
భవద్విచింతాఽపి శివాయదేహినాం భవత్వసౌ రుద్రనుతిశ్చ కామదా || ౧౯-౭

ఆ ప్రచేతసులు నిన్నెట్టి వరములు కొరకున్నను కరుణతో నీవే వారికి వరములనిచ్చితివి. స్వామీ! నీకు సేవ చేయక కేవలము ధ్యానించినను వారికి గొప్ప మేలు కలుగును. అట్లే శంకరుడు చెప్పిన రుద్రగీతికను స్తుతించిన వారికి కూడా కోరికలన్నీ తీరును.

అవాప్య కాంతాం తనయాం మహీరుహాం తయా రమధ్వం దశలక్షవత్సరీమ్ |
సుతోఽస్తు దక్షో నను తత్క్షణాచ్చ మాం ప్రయాస్యథేతి న్యగదో ముదైవ తాన్ || ౧౯-౮

"ప్రచేతసులారా! మీకు వృక్ష పుత్రికయైన 'మారిష' భార్య కాగలదు. ఆమెతో మీరు పది లక్షల సంవత్సరములు సుఖముగా ఉండ గలరు. మీకు దక్షుడను పుత్రుడు కలుగును. పుత్రజనమైన వెంటనే మీరు నా సాన్నిధ్యమును చేరుకుంటారు" -  అని సంతోషముతో వరములను ఇచ్చితివి.

తతశ్చ తే భూతలరోధినస్తరూన్కృధా దహంతో ద్రుహిణేన వారితాః |
ద్రుమైశ్చ దత్తాం తనయామవాప్య తాం త్వదుక్తకాలం సుఖినోఽభిరేమిరే || ౧౯-౯

ప్రచేతసులు నీ వలన దివ్యవరములను పొంది తపస్సు చాలించి సరస్సు నుండి బయటకు వచ్చిరి. అప్పుడు చెట్లు దట్టముగా పెరిగి మానవులు జంతువులూ తిరుగుటకు వీలులేకుండెను. అట్టి వృక్షములను చూచి ప్రచేతసులు కోపముతో తగుల బెట్ట సాగిరి. అప్పుడు బ్రహ్మ దేవుడు వారిని వారించెను. ఇట్లు తమకు మేలు చేసిన ప్రచేతసులకు వృక్షములు తాము పెంచిన మారిష అనే కన్యను ఇచ్చి వివాహము చేయగా వారు చాలా కాలము సుఖముగా నుండిరి.


అవాప్య దక్షం చ సుతం కృతాధ్వరాః ప్రచేతసో నారదలబ్ధయాధియా |
అవాపురానందపదం తథావిధస్త్వమీశ వాతాలయనాథ పాహిమామ్ || ౧౯-౧౦

వారికి దక్షుడను పుత్రుడు జన్మించెను. తరువాత వారు భగవంతుని గూర్చి అనేక యజ్ఞములు చేసిరి. అప్పుడు వారి దగ్గరకు నారద మహర్షి వచ్చి వారికి కూడా ఆధ్యాత్మిక జ్ఞానమును ఉపదేశించెను. ఆ జ్ఞానము వలన ప్రచేతసులందరూ పరమపదము పొందిరి. భక్తుల కోరికలను తీర్చు గురువాయురప్ప! శ్రీ కృష్ణా! నీ భక్తుడనైన నన్ను రక్షింపుము. 

వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి

వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి శిరమన కొండెయు జార  వురమున హారములు మెరయ కరమున శరచాపములును ఘ...