గిరిరాజ సుతా తనయా! సదయా!
హిమవంతుని పుత్రికయైన పార్వతి కుమారుడు, దయానిధివైన ఓ గణపతీ! దేవతలకు అధిపతియైన ఇంద్రునిచే అర్చించబడిన పాదములు కలిగిన ఓ గజముఖా! మమ్ములను రక్షింపుము. పరబ్రహ్మ స్వరూపుడవైన ఓ గణనాథా! సమస్త శుభములను కలిగిస్తూ, సమస్త విద్యలనే సముద్రమునకు చంద్రుని వంటి వాడా! సర్పములు కంకణములుగా కలిగి విఘ్నములను నివారించే ఓ శంభుతనయా! త్యాగరాజునిచే నుతించబడిన గణపతీ! మమ్ములను రక్షించుము.
ఈ కృతిని బట్టి కొందరు పల్లవిలో గిరిరాజసుత తనయా అన్నది ఆయన మాతామహులైన గిరిరాజకవి గురించి ప్రస్తావించారని భాష్యం చెప్పారు. కానీ, సంగీతజ్ఞులు, సంగీత నిపుణుల పరిశోధనలో తేలిన విషయం ఆయన మాతామహులు వీణ కాళహస్తయ్య గారు అని, ఆయన పితామహులు కాకర్ల గిరిరాజబ్రహ్మం గారు అని. కాబట్టి ఈ కృతిలోని పల్లవిలో గిరిరాజసుతా తనయా ప్రస్తావన పూర్తిగా గణపతి గురించే అని చాలామంది అంగీకరించారు.
బంగాళా రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని రఘురాం మణికంఠన్ ఆలపించారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి