శ్రీరామ పాదమా! నీ కృప జాలునే! చిత్తానికి రావే!
వారిజ భవ సనకసనందన వాసవ నారదాదులెల్ల పూజించే
శ్రీరాముని పాదమా! నీ కృప ఒక్కటే నాకు చాలును. నా చిత్తములోకి వచ్చి స్థిరముగా నిలువవే! పద్మములో జన్మించిన బ్రహ్మదేవుడు, సనకుడు, సనందనుడు మొదలైన మహర్షులు, దేవేంద్రుడు, నారదుడు మొదలైన వారందరూ నిన్ను భక్తితో పూజిస్తున్నారు. శ్రీరాముడు నడిచే దారిలో శిలగా పడి, శాపం వల్ల కలిగిన తాపాన్ని భరించలేక, ఎన్నో సంవత్సరాలుగా కన్నీరు కారుస్తూ దుఃఖిస్తున్న అహల్యను చూసి, ఓ వీరుడైన శ్రీరాముని పాదమా! ఆమెను కరుణతో కాపాడి, శాపవిముక్తురాలిని చేసి ధన్యురాలిని చేసిన విధంగానే, త్యాగరాజునిచే నుతించబడుతున్న శ్రీరామపాదమా! నన్ను కూడా కరుణించి, కాపాడి, ధన్యుడిని చేయవే!
అమృతవాహిని రాగంలో స్వరపరచబడిన ఈ త్యాజరాజస్వామి కృతిని మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆలపించారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి