వీర గణాది ముదితాయ వీరాది వర ప్రదాయ
శొర్యముచే అతిశయించు గణపతికి నా నమస్సులు. హరి, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలచే సేవింపబడే, శివుని కుమారుడైన గణపతికి నమస్సులు. వీరగణములు మొదలైనవారితో ఆనందించేవాడు, భక్తులకు వీరత్వము మొదలైన వరాలను ప్రసాదించేవాడు, జ్ఞానులచే ఉపాసింపబడేవాడు, దేవతలచేను తన సోదరుడైన సుబ్రహ్మణ్యుడి చేతను సేవింపబడేవాడు, పరమేశ్వరుని కుమారుడు, ఐదు హస్తములు కలవాడు, పాశమును, అంకుశమును ధరించినవాడు, సర్వగణాలకు ప్రసిద్ధుడైన అధిపతి, ఎవరికీ అధీనుడు కాని వినాయకుడు అయిన ఆ హేరంబ గణపతికి నేను నమస్కరిస్తున్నాను.
అఠానా రాగంలో స్వరపరచబడిన ఈ ముత్తుస్వామి దీక్షితుల వారి కృతిని సౌమ్యా పరశురామన్ ఆలపించారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి