గణరాజేన రక్షితోహం
గుణిజన నుత పల్లవ పదేన
అణిమాద్యష్ట సిద్ధి ప్రదేన
మాణిక్య మకుటాది ధరేణ
మంత్రిణీ పూజిత సుముఖేన
మానిత గురుగుహ వందితేన
దినకర కోటి ప్రకాశేన
వినతాశ్రిత మందారేణ
మను పూజిత పాశాంకుశేన
కానన స్థిత బ్రహ్మచర్యేణ
భావం:
సజ్జనులు స్తుతించే మృదువైన పాదములు గల గణాధిపతి నన్ను రక్షించుచున్నాడు. అణిమ, గరిమ మొదలైన అష్టసిద్ధులను అనుగ్రహించేవాడు, మణులు పొదిగిన కిరీటమును ధరించినవాడు, మంత్రిణీ దేవి ఆయిన రాజశ్యామలచే పూజించిన సుముఖుడు, సుబ్రహ్మణ్యునిచే పూజించబడే గణపతి నన్ను రక్షించుచున్నాడు. కోటి సూర్యుల వలె తేజోవంతుడు, నమస్కరించి శరణు వచ్చినవారికి కల్పవృక్షము వంటి వాడు. మనువుచే పూజించబడిన పాశము మరియు అనుకుశము ధరించినబాడు, అరణ్యమునందు నివసించేవాడు, బ్రహ్మచారిరూపుడైన గణపతి నన్ను రక్షించుచున్నాడు.
ఆరభి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని ఆర్ వేదవల్లి గారు ఆలపించారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి