గౌరీదేవి కుమారుడు, ఆదిశేషుని శయ్యగా కలిగిన వాసుదేవుడైన శ్రీమన్నారాయణుని ఎల్లప్పుడూ భక్తితో సేవించేవాడు అయిన శ్రీగణపతికి నేను ప్రణమిల్లుతున్నాను. గణములందరికీ నాయకుడు, దేవతాసమూహముచే సేవింపబడేవాడు, సర్పములను హారముగా ఆభరణంగా ధరించినవాడు, శ్రేష్ఠ మునులచే పూజించబడేవాడు, సుందరమైన మోదకాన్ని చేతబూని ఉన్న గజముఖుడు, చంద్రుని అపరిమిత గర్వాన్ని అణచినవాడు, నమస్కరించి శరణు వచ్చిన లోకజనులకు సంతోషాన్ని ప్రసాదించేవాడు, ఆశ్రయించిన భక్తులను కాపాడేవాడు, సకల సిద్ధులను అనుగ్రహించు సిద్ధివినాయకుడు అయిన గణపతిని నేను భక్తిపూర్వకంగా ప్రణమిల్లుతున్నాను.
గౌళ రాగంలో స్వరపరచబడిన ఈ మైసూరు వాసుదేవాచార్యుల కృతిని ఎం ఎల్ వసంతకుమారి గారు ఆలపించారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి