20, జులై 2020, సోమవారం

సరస్వతీ నమోస్తుతే - జీఎన్ బాలసుబ్రమణ్యం


సరస్వతీ నమోస్తుతే శారదే విద్యాప్రదే

కరధృత వీణా పుస్తక
వర మణిమాలాలంకృత

నరహరి సుత విధి లాలిత నవమణి యుత కంబుగళే
సుర సేవిత పద యుగళే సుధాకర సమధవళే

వీణ, పుస్తకములు చేతులలో ధరించి, శ్రేష్ఠమైన మణుల హారములచే అలంకరించబడిన ఓ సరస్వతీదేవి! నీకు వందనములు. శ్రీహరి సుతుడైన బ్రహ్మదేవునిచే లాలించబడి, నవరత్నములచే శోభిల్లే అందమైన కంఠము కలిగి, దేవతలచే సేవించబడే పదములు కలిగి, చంద్రునితో సమానమైన ధవళకాంతితో యున్న నీకు వందనములు!

- జీఎన్ బాలసుబ్రమణ్యం (ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసులు, వాగ్గేయకారులు)

తమిళనాట పుట్టినా అప్పుడు అంతా తెలుగుభాష మాట్లాడే వారు, ద్రావిడ ఉద్యమం రాక మునుపు రోజులవి. ప్రతి ఒక్క సంగీత కళాకారుడు కూడా త్యాగరాజు మొదలు ఇతర తెలుగు, కన్నడ వాగ్గేయకారుల కీర్తనలే పాడేవారు. జీఎన్‌బీ కూడా ఆ కోవకే చెందిన వారు. మద్రాసు రాష్ట్రంలో పుట్టినా, తాను రచించిన 250 కీర్తనలలో 90%కు పైగా తెలుగులో రాసినవే. వాటితో పాటు కొన్ని సంస్కృతంలో కూడా రచించారు. వాటిలో ఒకటి ఈ సరస్వతీ నమోస్తుతే. జీ్ఎన్‌బీ ఆనాడు ఓ ఒరవడి సృష్టించిన గాయకులు, నటులు మరియు వాగ్గేయకారులు. ఎమ్మెల్ వసంతకుమారి, రాధ-జయలక్ష్మి వంటి కళాకారులు ఆయన వద్ద శిక్షణ పొందారు. చిన్నవయసులోనే అనారోగ్యం చేయటంతో ఆయన 55 ఏళ్ల వయసులోనే మరణించారు. సరస్వతి రాగంలో ఆయన ఈ సరస్వతీ నమోస్తుతే అనే కృతిని కూర్చారు.

https://www.youtube.com/watch?v=vgnFuoEzGQ8

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి