ఓ కృష్ణా! నీకు స్వాగతం, నేను నీ శరణు కోరుతున్నాను. మథురాపురిలో నివసించేవాడా, మృదువైన ముఖము కలవాడా! మధు అనే రాక్షసుణ్ని సంహరించినవాడా! నీకు స్వాగతం, నేను నీ శరణు కోరుతున్నాను.
భక్తులకు సుఖసంపదలను సులభంగా ప్రసాదించే వాడా, పుష్పసుగంధంతో అలంకరించిన గజరాజువలె సుందరుడా! కస్తూరి తిలకం ధరించిన మహిమాన్వితుడా, నందగోపుని ప్రియ కుమారుడా! నీకు స్వాగతం, నేను నీ శరణు కోరుతున్నాను.
ముష్టికుడు, చాణూరుడు వంటి మల్లయోధులను జయించినవాడా! కువలయపీడ గజాన్ని మర్దించినవాడా! కాళీయుని పడగలపై నర్తించినవాడా! గోకులాన్ని రక్షించినవాడా! సమస్త శుభలక్షణాలు కలిగిన దేవుడా! సజ్జనులను పాలించి రక్షించేవాడా! కల్పవృక్షంవలె భక్తుల సంకల్పాలను అనేక విధాల నెరవేర్చేవాడా! సాటిలేని పరాక్రమశాలి అయిన వాడా! ధీరుడా! మునులకు ఆనందస్వరూపుడా! మన్మథుని మించిన సుకుమార సౌందర్యవంతుడా! దైత్యులను సంహరించే దేవుడా! మధురమైన ప్రేమరసానికి సారమైనవాడా! వ్రజ యువతుల హృదయాలలో పూజింపబడే ప్రియతముడా! నీకు స్వాగతం, నేను నీ శరణు కోరుతున్నాను.
ఊతుక్కాడు వేంకట సుబ్బయ్యర్ రచించిన ఈ కృతి మోహన రాగంలో స్వరపరచబడింది. చిన్మయి సోదరీమణులు ఈ కృతిని ఆలపించారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి