1, మే 2015, శుక్రవారం

శివపాదములుంచ నేను శిలనైనను కారాదా




శివపాదములుంచ నేను శిలనైనను కారాదా
కైలాసపు స్వామి మరల కలనైనను రారాదా

పూవునైన కాబోనా పూజకైన నేలేనా
కలత కనులు కరిగి ప్రభువుకభిషేకము కారాదా

కంటి పాప గంట విలును వింటి దారి నందిదేమో
ఎద నీ చిరు గజ్జె మ్రోత చెవులేమో ఢమరుకలౌ

వెలుగు దారిని వినువీధిని కనులేగును నీ కొరకై
మబ్బు వెంట మలుపు వెంట మనసులోని పిలుపు వెంట
నీవె నీవె మృత్యుంజయా నిలిచిపోగ రారాదా

పరమాత్మ కోసం తపిస్తున్న భక్తుని వేదన ఈ లలిత భక్తి గీతంలో అద్భుతంగా వ్యక్త పరచారు దేవులపల్లి వారు. అంతే అద్భుతంగా పాడారు వేదవతీ ప్రభాకర్ గారు. ఇంతటి సున్నితమైన భావం కలిగిన లలిత గీతాలను మరచిపోయాము, లలిత సంగీతాన్ని అణగదొక్కి రాళ్లవానలా ఉండే సినీసంగీతానికి పట్టం కట్టాము. మనలను మనం రాతిబండలను చేసుకున్నాము. సున్నితమైన భావమంటే ఒక బలహీనత అన్న అధః పాతాళపు ఆలోచనా సరళికి చేరుకున్నాము.

ఇలాంటి గీతాలు విన్నప్పుడల్లా ఈ రాతి హృదయాలు కొంత స్పందించి కరగుతాయేమో అన్న ఆశ. మనిషి మనిషిగా అవుతాడేమో అన్న ఆశ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి