జంధ్యాల హాస్య గుళికలు - మూడవ సంచిక
జంధ్యాల గారి శ్రీవారికి ప్రేమలేఖ చిత్రానికి ఉన్న ప్రత్యేకత తెలుగు భాషను పునరుద్ధరించే ప్రయత్నం చేయటం, తెలుగుదనాన్ని ఉట్టిపడే వాతావరణాన్ని సినిమాలో అడుగడుగునా చూపించటం. ఈ ఘనత మొత్తం జంధ్యాల గారిదే. అగ్రశ్రేణి నటీనటులు లేకుండా, పదునైన సంభాషణలు, సహజత్వము రంగరించి ఆయన హాస్యం పండించారు. అందుకే చిత్రం ఘన విజయం సాధించింది. మధ్యతరగతి కుటుంబాలలో ఉండే ఆవేశకావేశాలు, సంతోషాలిచ్చే చిన్న చిన్న పనులు, మనుషుల మధ్య ఉండే ప్రత్యేకమైన బంధాలకు జంధ్యాల గారు ప్రాణం పోసి చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా కథల పిచ్చి కల శ్రీలక్ష్మి, ఆమె బాధితుల ఘోష, పరంధామయ్య ప్రాస వాగుడు, భాస్కరం పేకాట్ స్నేహితుల సంభాషణలతో ఎన్నో రసవత్తరమైన సన్నివేశాలున్నాయి. ఆ కుటుంబంలో జరిగే మరో కొన్ని అద్భుతమైన సన్నివేశాలను "జంధ్యాల హాస్య గుళికలు - మూడవ సంచిక"గా మీకు అందిస్తున్నాను
ఊరు వచ్చి తిరిగి పట్నానికి వెళుతున్న ఆనందరావును బస్సు ఎక్కించటానికి మొత్తం కుటుంబం వెళ్లిన నేపథ్యం, తదుపరి సీన్లలో ఈ సంభాషణలు.
*************************************************
భీముడు: "మహాప్రభో"
పరంధామయ్య: వెధవను రెడీగా ఉండమను. ఇంకో సంబంధముందని రాయగానే రెక్కలు కట్టుకొని రాలమను వెధవను.."
భీముడు: "చిత్తం..." "మహాప్రభో...ఈ మాట ఇప్పుడే చెప్పొస్తున్నాను కదా"
పరంధామయ్య: "నీ పని నేను చెప్పింది చేయటమే. ఈలోపు ధర్మసందేహాలొస్తే బెజవాడ రైల్వే స్టేషనుకు పంపించు. ఆయనెవడో చెబుతుంటాడే..మా కుక్కకు గజ్జి పట్టింది ఏమి చెయ్యమంటారు అంటే బొచ్చుపీకండి గజ్జి తగ్గిపోతుంది అని..ఆయనకు రాయి సమాధానం చెబుతాడు అనుమాన పక్షి. ఆ అడ్డగాడిదతో మాట్లాదకూడదని నిర్ణయించుకున్నాను కాబట్టి కానీ లేకపోతే నేనే చెవి మెలేసి చెప్పేవాడిని వెధవకి..."
భీముడు: "చిత్తం..."
పరంధామయ్య:"చిత్తమంటూ ఇంకా ఇక్కడే తగలడ్డవేం? వెళ్లు"
భీముడు: "వెళుతున్నాను కదా మహాప్రభో..."
భీముడు ఆనందరావుతో: "బాబూ తమరు మళ్లీ త్వరలో పెళ్లి చూపులకు రావటానికి రెక్కలు అవీ కట్టుకొని సిద్ధంగా ఉండమన్నారు మహాప్రభువుల వారు"
పూర్ణ: "బస్సింకా వచ్చేలా లేదు. ఈలోపు శ్రీమంతుడు సినిమా కథ చెప్పనా"
కామాక్షి: "సరే. వేటగాడు కథ చెప్తానేం..."
భాస్కరం: "అబ్బబ్బబ్బా మళ్లీ మొదలెట్టావా. అసలు నీకిన్ని కథలు పేర్లు గుర్తున్నందుకు నీ బుర్రను మ్యూజియంలోనూ నిన్ను జూలోనూ ఉంచాలే.....అదిగో వచ్చేసింది బస్సు"
పరంధామయ్య: "రండి రండి ఏమిటా పెళ్లి నడక.." ..."ఆ ఎక్కరా"
కండక్టరు: "ఎన్ని టికెట్లండీ"
భాస్కరం: "ఒకటే"
కండక్టరు: "ఒక్కటా! ఒక్క టిక్కట్టుకు ఇంతమందొచ్చారేంటండీ? బస్సు ఖాళీగా ఉంది. అందరు ఎక్కండి సార్"
పరంధామయ్య:" నీ బస్సు ఖాళీగా ఉంటే మేమంతా ఎక్కాలా అంట్ల వెధవ"
భీముడు:"కండక్టర్ తమ కొడుకు కాదు మహాప్రాభో తమరు ఎన్ని తిట్టినా పడుండటానికి ఊరుకోండీ"
భాస్కరం: "నువ్వు పద బాబూ పద"
కామాక్షి: "ఎక్కరా చంటీ, జాగర్త"
అమ్మ:"ఆవకాయ మాగాయ జాడీల్లో పెట్టాను. ఉసిరికాయ పచ్చడికి గాలి తగలకుండా చూడు. బూజుపడుతుంది. జాడీలు జాగ్రత్త. బస్సు కుదుపుల్లో కదిలిపోకుండా చూడు.."
పరంధామయ్య: "రోజూ క్రమం తప్పుకుండా మాదీఫలరసాయనం వాడమను శుంఠని"
అమ్మ: "సామాన్లు జాగ్రత్తమ్మా.."
కామాక్షి: "ఒరేయ్ లెక్కపెట్టుకోరా చంటీ"
ఆనందరావు: "ఇక మీరు బయలుదేరండి నాన్నా!"
భాస్కరం:"నీ ఆరోగ్యం జాగ్రత్తరా చంటీ"
అమ్మ: "ఎండలో ఎక్కువగా తిరక్కు నాన్నా"
పరంధామయ్య: "ప్రతిరోజూ మొదటి ముద్ద ఉసిరికాయ పచ్చడేసుకు తినమను కుంకని. పైత్య ప్రకోపం తగ్గుతుంది..."
ఆనందరావు:"ఇక మీరు బయలుదేరండి నాన్నా...బస్సెక్కాను కదా"
కామాక్షి: "ఓసారి ఎప్పుడైనా మావూరు రారా చంటి. కొత్త కొత్త పిండి వంటలు చెసిపెడతాను తిందువు కాని"
పరంధామయ్య భీముడుతో: "ఈసారి పెళ్లిచూపులకు రానని ఇష్టం లేదని రాశాడో నీకు గుండు గీకిస్తాను ఆ విషయం చెప్పు సన్నాసికి"
భీముడు: "బాబూ! నా జుట్టుమీద దయుంచి పెళ్లి చూపులకు తప్పకుండా రండి బాబూ!"...."చెప్పాను మహాప్రభో చెప్పాను"
పరంధామయ్య: "ఆ ఆ! ఇక బస్సు బయలుదే...."
అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని చూసి పరంధామయ్య బస్సుకేసి తలబాదుకుంటాడు
భాస్కరం: "ఏమిటి ఏమయ్యింది"
పరంధామయ్య భాస్కరంతో: "అటు చూడు మీ ఆవిడని"...
పూర్ణ డ్రైవరుతో: "రామకృష్ణా సినీ స్టూడియోస్ వారి డ్రైవర్ రాముడు సినిమా చూశావా?"
డ్రైవరు: "చూడలేదండీ"
పూర్ణ: "అందులో ఎన్టీ రామారావు లారీ డ్రైవరుగా ఎంత బాగ చేశాడనుకున్నావ్?"
భాస్కరం: "ఒసేయ్ ఒసేయ్ ఆపవే...అవతల మా నాన్న బస్సు బద్దలు కొడుతున్నాడు...రా"
*****************************************************
పూర్ణ: "అప్పుడేమో జయశంకర్ పిచ్చ స్పీడుతో మోటర్ సైకిల్ మీద వచ్చి ఆ రౌడీల్ని దోసకాయ పచ్చడి చేసేస్తాడు.."
భాస్కరం: "జయశంకర్కి దోసకాయ పచ్చడంటే బాగా ఇష్టమేమో? "
పూర్ణ: "తన కోసం ప్రాణాలు కూడ లెక్క చేయకుండా ఆ రౌడీలతో ఫైట్ చేసిన ఆ జయశంకర్కి సీత తన మనసిచ్చేస్తుంది"
భాస్కరం: "ఎలా ఇస్తుంది. కోసిస్తుందా లేదా దోసకాయ పచ్చడి షేపులో దంచిస్తుందా మనసు?"
పూర్ణ: "అబ్బా! అది కాదండీ! ఆ తరువాత వాళ్లిద్దరూ పార్కులో పాట పాడుకుంటారన్నమాట మనసూ ఇచ్చినా పూసా పూసా వెన్నపూస.."
భాస్కరం: "జయశంకర ఇదివరకు వెన్నపూస వ్యాపారం చేసేవాడు కాబోలు"
పూర్ణ: "కంటిలో వెలుగా పూసా పూసా"
భాస్కరం: "ఆపవే! రిక్షావాడు కథ వినలేక వాలిపోయి తొక్కుతున్నాడు చూడు"
పూర్ణ: "టాట్టడాయ్ టట్టటట్టడాయ్"
భాస్కరం: "బాబు ఆపాపు రిక్షా ఆపు"
పూర్ణ: "ఏంటండీ. ఇప్పుడే కథ బావుంటుంది"
భాస్కరం: "కథతో పాటు నా ఆరోగ్యం కూడా బావుండాలి కదా పూర్ణా!..ఆ..చూడూ...మొన్ననే కొత్త మంగళసూత్రాలు చేయించుకున్నావు. వాటి మీద ప్రేమతో అన్నా నాకప్పుడప్పుడూ కాస్త రెష్టిస్తూ ఉండు..ఇదే ఇంటర్వెల్ అనుకో"
**********************************************
భాస్కరం హార్మణీతో: "ఇక్కడున్నావేమిటిరా హార్మణీ! "
హార్మణీ: "చంపేస్తాను వెధవల్ని. వాళ్ల చర్మం ఊడబీకి అడుగున్నర మందం చెప్పు కుట్టించుకుని ఎత్తు పెరుగుతా. వాళ్ల నాలికల్ని కట్ చేసి మా అమ్మాయి జడలకి రిబ్బన్లుగా చుట్టేస్తాను..హాయ్"
భాస్కరం: "ఎవరి మీదరా ఈ కోపం"
హార్మణీ: "ఇంకెవరు? ఆ కళ్లజోడు, మరచెంబు గాళ్లు. నెల తక్కువ వెధవలనీ"
భాస్కరం: "ఏమయిందీ? నువ్వెళ్లిన దగ్గరనుంచీ మా దగ్గర డబ్బుల్లేక నిన్నల్లా పేకాళ్లేదురా. చేతులు దురదలెక్కి వాచిపోవటం మొదలెట్టాయి. ఆ వెధవలిద్దరూ నన్నిక్కడ కూర్చోబెట్టి, ఆయన దగ్గర ఓ పది రూపాయలు తీసుకొని ఓ గంటలో ఆడుకొని వస్తామని వెళ్లారు. ఇప్పటికి నాలుగ్గంటలైంది వెళ్లి. ఇంతవరకూ రాలేదు. ఆయనేమో నా పదిరూపాయలు నాకిస్తావా కిళ్లీలు కడతావా అంటాడు. నాకేమో కట్టడం రాదు రాకపోతే నేర్చుకోమంటాడాయన. నేనెప్పటికి కిళ్లీలు కట్టడం నేర్చుకొని ఆయన పదిరూపాయలిచ్చి నేనెప్పటికి రుణం తీర్చుకొని బయట పడేది? .."
భాస్కరం: "ఊ సరే సరే ఏడవకు ఉండు"..."ఇదిగో! ఈ పదిరూపాయలు తీసుకొని మా వాడిని విడిచిపెట్టవయ్యా!"
*******************************************
ఇక్కడ రిక్షావాడు మూర్ఛపోతాడు.
భాస్కరం:"ఏమిటే! ఏవయ్యింది? "
పూర్ణ: "మీరెళ్లగానే, కథ తరువాత ఏమయిందమ్మా అని అడిగాడు..."
భాస్కరం: "అడిగాడూ...అర్థాయుష్షు వెధవ...వాడి గొయ్యి వాడే తవ్వుకున్నాడన్నమాట
*******************************************
హహహహహహ
రిప్లయితొలగించండి