 |
తిప్పతీగ |
 |
కలబంద(ఆలో వేరా) |
 |
తులసి |
 |
రాందేవ్ |
వర్షాకాలం, పరిశుభ్రత ఎక్కువ ఉండని కాలం. కాబట్టి అన్ని రకాల సూక్ష్మ క్రిములు వృద్ధి చెంది రోగాలు వ్యాప్తి చెందే సమయం. బాబా రాందేవ్ ప్రకారం, ఇటువంటి సమయంలో స్వైన్ ఫ్లూ, డెంగీ, మలేరియా వంటి ప్రాణాంతక జ్వరాలనుంచి కాపాడుకోటానికి కొన్ని చిట్కాలు:
- ప్రతిరోజూ ఉదయం పరకడుపున ప్రాణాయామం 15 నిమిషాలు. అనులోమ విలోమము, భస్త్రిక, కపాల భాతి - తప్పకుండా చేస్తే ఊపిరితిత్తులు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. ఆక్సిజన్ శరీరం లోని కణాలకు బాగా వెళ్లి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
- ప్రతి రోజు ఉదయం తులసి ఆకులను కొన్ని తింటే సర్వ రోగ నివారిణి. ఆకులు బాగా కడిగి (ఒక 10 ఆకులు) నమిలి తింటే దివ్యౌషధం.
- కలబంద (ఆలో వేరా) ఆయుర్వేదం ప్రకారం సంజీవని లాంటిది. పైన బెరడును తీసేసి, మధ్యలో మెత్తగా ఉండే పదార్థాన్ని అలాగే కానీ రసం చేసి కానీ తీసుకుంటే ఈ విష జ్వరాల బారిన పడకుండా ఉండవచ్చు.
- తిప్పతీగ (మనకు ఆంధ్ర ప్రదేశ్ లో బానే దొరుకుతుంది, చిత్రం పైన) రసం, తులసి రసం కలిపి తీసుకుంటే రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. తిప్పతీగ వివరాలు.
అన్నిటికన్నా ముఖ్యమైనది - ఇవి పని చేస్తాయి అన్న నమ్మకం, క్రమం తప్పకుండా తీసుకుని, ప్రాణాయామం చేస్తే రోగాలు మీకు దూరం.
Meeru post chesina vishayam chala upayogakaramainadi. Dhanyavadamulu.
రిప్లయితొలగించండికృతజ్ఞతలు
రిప్లయితొలగించండి