27, ఆగస్టు 2010, శుక్రవారం

మైత్రీం భజత - పరమాచార్యుల రచన

కంచి పరమాచార్యులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి రచన. చూడండి.

నడిచే దైవం పరమాచార్యులు

మైత్రీం భజత అఖిల హ్రుజ్జేత్రీం
ఆత్మవదేవ పరానపి పశ్యత
యుద్ధం త్యజత స్పర్ధా త్యజత
త్యజత పరేష్వ క్రమమాక్రమణం
జననీ ప్రుథివీ కామదుఘాస్తే
జనకో దేవః సకలదయాళుః
దామ్యత దత్త దయధ్వం జనతాః
శ్రేయో భూయాత్ సకలజనానాం

తాత్పర్యం:
అందరి హృదయాలను జయించే మైత్రిని పెంపొందించు. ఇతరులను నీవలెనే చూచుకొనుము. యుద్ధం, పోరు (స్పర్ధ) త్యజించు. ఇతరుల మీద నీ తామస పరాక్రమాన్ని చూపించకు. ఈ జన్మభూమి మన కోర్కెలను తీర్చటానికి సిద్ధంగా ఉంది. అత్యంత దయాళువైన ప్రభువు మనకు తండ్రిగా ఉన్నాడు. ప్రజలారా! దయతో, కరుణతో మీకు చేతనైన సాయం ఇతరులకు చేయండి. మీరందరు సుఖ సంతోషాలతో వర్ధిల్లండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి