కైలాసగిరి నుండి కాశికై
కాశికాపురి నుండి దాసికై
దాసికై ఈ దక్షవాటికై దయచేసినావయా
హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర
విరిసె జాబిలి మల్లెరేఖగా కురిసె తేనియల మువ్వాకగా
దరిసి నీ దయ నిండు గోదావరీ నది ఝరులాయెరా
హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర
ముక్కోటి దేవతల నేతరా ముల్లోకముల కిష్టదాతరా
వెలిబూది పూతరా నలవిసపు మేతరా
హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర
దేవులపల్లివారి సాహిత్యంలో లాలిత్యంతో పాటు తెలుగుదనం నిండి విలక్షణంగా ఉంటుంది. తెలియని వారు ఆయన రాసిన గీతలాను వినగానే ఇది దేవులపల్లివారిదా అని అడుగుతారు. దానికి కారణం ఆయన గీతంలో కనబరచే భక్తితో పాటు ప్రత్యేకమైన పదప్రయోగం. దేవులపల్లి వారి శివ రచనలలో తప్పకుండా శివుని శిరసున ఉన్న చంద్రుని, ఒంటిన విభూతి, కంఠంలో గరళము మొదలైన భౌతిక లక్షణాలలో ఒక్కటైనా తప్పకుండా ప్రస్తావన చేస్తారు. శివుడు దయాసముద్రుడు. ప్రార్థన చేసినంతనే కరగిపోయే భక్తవశంకరుడు.
గౌతమముని ప్రార్థనతో శిరసునున్న గంగమ్మను గోదావరిగా శివుడు భువిపైకి పంపాడని శివపురాణం చెబుతుంది. ఆ పరమశివుని దయారూపమైన గోదావరి నది పరవళ్లను పాపికొండల వద్ద చూడవచ్చు. అందుకే గోదావరి నది ఒడ్డున, సమీపాన అనేక శైవ క్షేత్రాలు వెలిసాయి. కృష్ణశాస్త్రి గారి ఇతర భక్తి గీతాలలో లాగనే ఇందులో కూడా తెలుగుదనం ఉట్టిపడే పదప్రయోగం చేశారు.వెలిబూది, నలవిసం వంటి అరుదైన తెలుగు పదాలతో ఈ పాటకు ప్రాణం పోశారు దేవులపల్లి వారు. 1970వ దశకంతో ఆకాశవాణి హైదరాబాద్ మరియు విజయవాడ కేంద్రాల ద్వారా భక్తిరంజని కార్యక్రమంలో దేవులపల్లి వారి గీతాలు ప్రసారమయ్యేవి. అందులో ఈ కైలాసగిరి నుండి ఒకటి. పాలగుమ్మి విశ్వనాథం గారి సంగీతంలో వెలువడిన ఈ గీతం ఎంతో ప్రాచుర్యం పొందింది.
(పైన ఇచ్చిన లింకులో మూడవ నిమిషం వద్ద ఈ పాట మొదలవుతుంది)
దాసికై... అంటే వివరించ ప్రార్థన
రిప్లయితొలగించండిఎంత భక్తిప్రపత్తికంగా సాగిందో వారి రచన---
రిప్లయితొలగించండి