19, అక్టోబర్ 2020, సోమవారం

శ్రీరాజరాజేశ్వరీ త్రిపురసుందరీ - ముత్తుస్వామి దీక్షితుల వారు

శ్రీరాజరాజేశ్వరీ త్రిపురసుందరీ శివే పాహిమాం వరదే

నీరజాసనాది పూజితపరే నిఖిల సంశయ హరణ నిపుణతరే

శౌరి విరించాది వినుత సకలే శంకర ప్రాణ వల్లభే కమలే
నిరతిశయ సుఖ ప్రదే నిష్కళే పూర్ణచంద్రికా శీతలే విమలే
పరమాద్వైత బోధితే లలితే ప్రపంచాతీత గురుగుహ మహితే
సురుచిర నవరత్న పీఠస్థే సుఖతర ప్రవృత్తే సుమనస్థే

ఓ రాజరాజేశ్వరీ! త్రిపురసుందరీ! శివానీ! నన్ను రక్షింపుము. నాకు వరములిచ్చే దేవివి నీవే. బ్రహ్మాదులచే పూజించబడే పరదేవతా! సమస్త సంశయములను హరించే నిపుణురాలవు నీవు. నన్ను రక్షింపుము. బ్రహ్మ, విష్ణువులచే నుతించబడిన సర్వాంతర్యామివి, పరమశివునికి ప్రాణనాయకివి, కమలంవలె మనోజ్ఞమైన రూపము కలిగియున్నావు, నిరుపమానమైన ఆనందాన్ని కలిగించేవు, నిష్కళంకవు, పూర్ణచంద్రుని వలె చల్లదనము కల్గించేవు, నిర్మలవు, ఉత్కృష్టమైన అద్వైతాన్ని బోధించే లలితవు, ప్రపంచానికి అతీతమైన ఆదిపరాశక్తివి, సుబ్రహ్మణ్యునిచే నుతించబడేవు, మనోజ్ఞమైన నవరత్న పీఠమున స్థిరమై యున్నావు, సుఖకరమైన అంతఃప్రకృతి కలిగియున్నావు, సహృదయుల మనసులలో స్థిరమై యున్నావు, నన్ను రక్షింపుము. 

పూర్ణచంద్రిక రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మహారాజపురం సంతానం గారు ఆలపించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి