17, సెప్టెంబర్ 2017, ఆదివారం

శరవణభవ గుహ షణ్ముఖ - తంజావూరు శంకర అయ్యర్ కృతి


శరవణభవ గుహ  షణ్ముఖ
తిరుమరుళ్ పురియ వా వా

మరువుం వళ్లీ దేవయాని మనాళ
కరుణై మళి పొళియ వా దయాళ

కుణ్డ్రు తోరుం ఆడుం కుమరనే  
కురైగళ్  తీర్థరుళ విరైవినిల్ నీ వా
ఎణ్డ్రుం ఇంబం తరుం  తమిళిసైక్క వా
ఇరంగి ఎంగళుక్కు జ్ఞానం తళైక్క వా

రెల్లు గడ్డి నుండి జన్మించి, ఆరు ముఖములు కలిగిన ఓ సుబ్రహ్మణ్యా! నీ కరుణతో మాకు శుభములు కురిపించుటకు రావయ్యా!  ఓ దయాళుడవైన వల్లీ దేవసేనా పతీ! నీ కరుణావృష్టిని కురిపించుటకు రావయ్యా! కొండలలో తిరుగుతూ ఆడుకునే ఓ కుమారా! మా కామ్యములు తీర్చుటకు రావయ్యా! నిత్యానందమునిచ్చే తమిళమును పాడుటకు రావయ్యా! మాపై కరుణ చూపించి జ్ఞానాన్ని ప్రసాదించుము.

(తమిళనాట భాషకు దైవ స్వరూపంగా కుమారస్వామిని కొలుస్తారు. అగస్త్య మహాముని కుమారస్వామిని ఉపాసించగా, ఆయన నోట ఈ భాష ఆ ప్రాంతంలో పలుక బడి ప్రసిద్ది పొందిందని వారి నమ్మకం)

- తంజావూరు శంకర అయ్యర్

షణ్ముఖుని నుతించే ఈ కృతిని కర్త శహానా రాగంలో స్వరపరచారు. ఈ రాగం ఆర్తికి, భక్తికి, శరణాగతికి ప్రతీక. కృతిలోని భావానికి సముచితమైన రాగంలో స్వరపరచటం వాగ్గేయకారుని పూర్ణప్రజ్ఞను సూచిస్తుంది. తంజావూరు శంకర అయ్యరు గారు 1924లో తిరుచిరాపల్లి జిల్లలోని తోగమరైలో జన్మించారు. టైగర్ వరదాచాయులు మొదలైన వారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. ఈయన శిష్యులలో టీవీ శంకరనారాయణన్, నేవేలి సంతానగోపాలన్, చిత్రవీణ రవికిరణ్ మొదలైన మహామహులెందరో ఉన్నారు. ముంబై షణ్ముఖానంద సభ ద్వారా ఎందరో శిష్యులకు శిక్షణనిచ్చారు. కలైమామణి బిరుదును పొందారు. ఈ కృతి సాహిత్యంలో ఆర్తిని రాగం ద్వారా అందించటంలో ఆయన కృతకృత్యులైనారు. రంజని-గాయత్రి సోదరీమణులు ఈ కీర్తనను గానం చేశారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి