30, జూన్ 2010, బుధవారం

స్వామి సమర్థ రామదాసు

భారతదేశం మహమ్మదీయుల దాడికి గురై, ఆ చక్రవర్తులు హిందూ మతాన్ని, హిందువులను హింసించి, చంపి మతవిద్వేషాలను రేపుతున్న సమయంలో ప్రస్తుతపు మహారాష్ట్రలో అవతరించారు స్వామి సమర్థ రామదాసు. ఛత్రపతి శివాజీకి మార్గోపదేశం చేసి ధర్మమార్గంలో నడిపించిన అపర ఆంజనేయావతారం ఆ సమర్థులు. స్వామి సమర్థ రామదాసు హిందూ మత పరిరక్షణ కొరకు ఎన్నో వేల దేవాలయాలు కట్టించారు. మహారాష్ట్ర, ఆంధ్ర, కన్నడ రాష్ట్రాలలో ఉన్న చాలామటుకు హనుమాన్ దేవాలయాలు ఆయన ప్రతిష్ఠించి/పునరుద్ధరించినవే. ఆ మహనీయుడు కొన్నేళ్ల పాటు దేశాటన చేసి హిందూ మతంయొక్క విశిష్టతను ప్రజలమధ్యకు మళ్లీ తీసుకెళ్లి రాజు, ప్రజ ఇరువురికీ మార్గదర్శకుడైనారు. ఆ సమర్థ సద్గురువు సమకాలీకులు మన భద్రాచల రామదాసు. వీరిరువురి కలయిక అనిర్వచనీయమట. దాసబోధ, మనాచీ శ్లోకములు, రామాయణము ఇలా ఎన్నో రచనలు చేసి ఒక కొత్త ఒరవడిని మొదలు పెట్టారు. మహారాష్ట్రలో ఆయన చిత్రపటం లేని ఇల్లు, వ్యాపారము ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఆ సద్గురువులకు నా నమస్సుమాంజలి. జయ జయ రఘువీర సమర్థ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి