27, జనవరి 2016, బుధవారం

వందేమాతరం విశేషాలు

వందేమాతరం విశేషాలు

వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్ర జ్యోత్స్నా పులకిత యామినీం ఫుల్ల కుసుమిత ద్రుమ దళ శోభినీం సుహాసినీం సుమధుర భాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం
తెల్లగా ప్రకాశించే వెన్నెలతో పులకించే రాత్రివై, వికసించిన పూలతో కూడిన దళములతో శోభిల్లే, చక్కని చిరునవ్వుతో, మధురమైన పలుకులతో సుఖాన్ని, వరములను ఇచ్చే తల్లీ! నీకు వందనం! నిర్మలమైన జలములతో, చక్కని పండ్లతోటలతో, చల్లని గాలులతో, సస్యశ్యామలమైన మాతా! నీకు వందనం!
విన్న వెంటనే గగుర్పాటు కలిగించే మన జాతీయ ఆలాపనలో ఎంత చక్కని పదాలను ఉపయోగించారో బంకిం చంద్ర చటర్జీ గారు. అసలు వందే మాతరంలో ఐదు చరణాలు ఉన్నాయి (మొత్తం సాహిత్యం చివరన). దీనిని మొట్టమొదటి సారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1896లో ఆలపించారు. 1950లో భారత్ గణతంత్రమైన తరువాత భారత ప్రభుత్వం మొదటి రెండు చరణాలతో ఈ పాటను జాతీయ ఆలాపనగా గుర్తించింది. ఈ గీతం బంకించంద్ర గారి ఆనందమఠ్ అనే నవలలోది. 1876వ సంవత్సరంలో ఆయన ఆనందమఠాన్ని రచించగా 1882వ సంవత్సరంలో అది ప్రచురితమైంది. సంస్కృతం, బెంగాలీ శబ్దాలు కలిగిన ఈ జాతీయ గీతాన్ని స్వరపరచిన వారు జాదూనాథ్ బెనర్జీ గారు.
తొలుత దీనిని జాతీయ గీతంగా గుర్తించాలని ప్రతిపాదన వచ్చినా ముస్లింల వ్యతిరేకతతో జనగణమన జాతీయ గీతం అయ్యింది. వందేమాతరం జాతీయ గీతంగా కావటాన్ని వ్యతిరేకించిన వారిలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒకరు. వందేమాతరంలో భరతమాతను దుర్గాదేవిగా ఆవిష్కరించటం ఆనాటి బెంగాలు మరియు ఇతర ప్రాంతాల ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకించారు. తదుపరి బాబూ రాజేంద్రప్రసాద్ గారు రాజ్యాంగ అసెంబ్లీలో తీర్మానంతో జాతీయ ఆలాపన అయిన వందేమాతరాన్ని జాతీయ గీతమైన జనగణమనతో సమానమైనదిగా గుర్తింపజేశారు. జనగణమన కన్నా దాదాపు ముప్ఫైఏళ్ల ముందు రాయబడిన వందేమాతరం భారత స్వాతంత్య్రోద్యమంలో ప్రత్యేకమైన పాత్ర పోషించింది. 

వందేమాతరం పూర్తి సాహిత్యం:
వందేమాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్య శ్యామలాం మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం పుల్లకుసుమిత ద్రుమదల శోభినీం సుహాసినీం సుమధుర భాషిణీం సుఖదాం వరదాం మాతరం కోటికోటి కంఠ కలకల నినాదకరాలే కోటి కోటి భుజైర్ ధృత కర కరవాలే అబలా కేయనో మా ఏతో బలే బహుబల ధారిణీం నమామి తారిణీం రిపుదలవారిణీం మాతరం తుమి విద్యా తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ త్వం హి ప్రాణాః శరీరే బాహుతే తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తి తో మారయి ప్రతిమా గడి మందిరే మందిరే త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణీ కమలా కమలదళ విహారిణీ వాణీ విద్యాదాయినీ నమామి త్వాం నమామి కమలాం అమలాం అతులాం సుజలాం సుఫలాం మాతరం శ్యామలాం సరలాం సుస్మితాం భూషితాం ధరణీం భరణీం మాతరం
మొత్తం వందేమాతరం ఆడియో: https://www.youtube.com/watch?v=_2-GTLcy65M

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి