21, మార్చి 2015, శనివారం

మన్మథ నామ సంవత్సర శుభాకాంక్షలు


సోదర సోదరీమణులకు, పిల్లలకు, పెద్దలకు, అందరికీ మన్మథ నామ సంవత్సర శుభాకాంక్షలు. షడ్రుచుల పచ్చడి జీవితంలో అన్నీ సమపాళ్లలో ఉంటాయి అని చాటటానికి సూచిక. వసంత ఋతువు ఆగమనం అంటు రోగాలకు కూడా దారి తీస్తుంది కాబట్టి రోగ నిరోధక శక్తి కలిగిన ఆరు ప్రకృతి సిద్ధమైన ధాతువులను మనకు పచ్చడి రూపంలో ఇచ్చారు పెద్దలు. శరీర ఆయురారోగ్యాల కోసం ఈ పండుగ...సృష్టి ఆరంభానికి ప్రతీక ఉగాది. అన్ని ఋతువుల గమనం ఒక వృత్తం పూర్తి కావటానికి ప్రతీక ఉగాది.
ఉగాది, గుడి పడ్వ, చెట్టీ చాంద్...ఏ పేరైతేనేమి? భారత దేశంలో ఎందరికో కొత్త సంవత్సరం ఇది. కాలధర్మం, ఋతువుల మార్పుతో కూడినది కాబట్టి ఇదే నిజమైన కొత్త సంవత్సరం. దీనిలో అర్థం తెలుసుకుంటే సంబరానికి సార్థకత.
తెలుగుజాతిలో జన్మించినందుకు కొంతైనా తెలుగుదనానికి గౌరవం చూపించి తెలుగువారి సహజ సిద్ధమైన సాంప్రదాయాలతో, గడపలకు మావిడాకులు, పూలమాలలు కట్టి, తలంటుకొని, పరమేశ్వరుని ప్రార్థించి, పచ్చడిని నైవేద్యంగా అర్పించి,సేవించి, నూతన వస్త్రాలు ధరించి, పంచాంగ శ్రవణం చేసి, నలుగురిని ఆత్మీయంగా పలకరించి తెలుగుదనంతో జరుపుకుందాం.
కాలే వర్షతు పరజన్యః పృథివీ సస్యశాలినీ
దేశోయం క్షోభ రహితః బ్రాహ్మాణాస్సంతు నిర్భయాః
సమయానికి వర్షాలు కురియు గాక. భూమి సస్యశ్యామలమగుగాక. దేశము కరవు కాటకాలు, క్షోభ రహితమగు గాక. బ్రహ్మజ్ఞానులు నిర్భయులగు గాక!
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు
నాలుగు సాగరాల మేర గోవులకు, బ్రహ్మ జ్ఞానులకు శుభం కలుగు గాక!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి