17, ఫిబ్రవరి 2011, గురువారం

తులసీదాసు హనుమాన్ చాలీసా - ఎమ్మెస్ రామారావు గారి తెలుగు హనుమాన్ చాలీసా

ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం 
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం 

బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగాతా 
ఆజాడ్యం వాక్పటుత్వం చ హనుమాత్ స్మరణాద్భవేత్ 

హనుమాన్ అంజనా సూనుః వాయుపుత్రో మహాబలః
రామేష్టః ఫల్గుణస్సఖః పింగాక్షో అమిత విక్రమః
ఉదధిః క్రమణశ్చైవ సీతాశోకవినాశకః
లక్ష్మణః ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పః
ద్వాదశైతాని నామాని కపీన్ద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్మ మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ 



హనుమద్ తత్త్వము:

మానవ జన్మ అవరోధాలు, కష్టాలతో నిండి ఉంటే, మన ధర్మం నిర్వర్తించటం ఎలా? మానసిక దౌర్బల్యం, శారీరక అశక్తత ఉంటే, మన కర్తవ్య పాలన ఎలా?. అందుకనే, మనకు రామాయణంలో హనుమంతుని పాత్రను ఉంచారు వాల్మీకి మహర్షి. భగవంతునిపై పరిపూర్ణమైన నమ్మకం, శరణాగతి ద్వారా వానరుడైన హనుమంతుడు ఎటువంటి ఊహించలేని అవరోధాలను దాటి ధర్మ పాలనలో తన ప్రభువైన రామచంద్రునికి తన వంతు సాయం చేశాడు?.

మరి ఆ హనుమంతునికి ఎన్ని అవరోధాలు? - మొదట కోతి జన్మ వలన చంచలమైన మనస్సు, తన శక్తి తను తెలుసుకోలేని బుద్ధి. వీటిని స్థిరపరుచుకొనుటకు రాముని పట్ల అచంచలమైన భక్తి, పూర్తి సమర్పణ ఉపయోగ పడింది.  తరువాత రామభక్తుడనే ముద్ర బిళ్ళ కలిగి ఉండటం వలన సాగరం దాటే సమయంలో ఎంతోమంది సహాయం పొందుతాడు. అలాగే, రామ నామ జపంతో రాక్షసులను సంహరించి మాత చెంతకు చేరుతాడు. తన మనసు చలించినప్పుడల్లా, ఆ ప్రభు నామ స్మరణ, దాని వలన ఆయన పట్ల తన కర్తవ్యము గుర్తుకు వచ్చి ముందుకు సాగుతాడు. సుందరకాండలో దీనికి ఉదాహరణలు ఎన్నో? - మండోదరిని చూసి సీత అనుకుని భ్రమించటం, సీతాదేవి కాన రాక, దాని వలన ఎటువంటి ఫలితాలు ఉంటాయో ఊహించుకొని, దాని వలన నిరాశ, నిస్పృహ చెందటం, అప్పుడు మరల రామ నామ బలంతో, శుభ సూచనలు కలిగి ముందుకు వెళ్ళటం, సీతాదేవి ముంగిట రాముని గుణ కీర్తన వలన ఆమెను సంతోషపరచటం, ఆత్రుతలో లంకాదహనం కావించి చిన్తిస్తున్నప్పుడు రాముని స్మరణ వలన, సీతెదేవికి ఎటువంటి హాని కలుగదు అనే దృఢ విశ్వాసం కలిగే స్థైర్యం కలగటం...ఇలా సుందరకాండ వెదికితే మానసిక చాంచల్యం, దానికి పరిష్కారం అనే విషయానికి ఉదాహరణలు కోకొల్లలు. అలాగే యుద్ధ సమయంలో హనుమంతుని శౌర్యము, సంజీవని పర్వతం తెచ్చుట, రామ లక్ష్మణులను మైరావణుని బారి నుండి కాపాడుట - వీటన్నిటిలో హనుమంతుని పాత్ర అనిర్వచనీయమైనది. అంతటి మహా శక్తి సంపన్నుడు హనుమంతుడు. ఆ శక్తికి మూలం అచంచలమైన రామభక్తి, దాస్యము, శరణాగతి. మరి అంతటి మహనీయుని స్మరిస్తే మన బాధలు, పీడలు తొలగకుండా ఉంటాయా? దీనికి ఉదాహరణగా కొన్ని కోట్ల మంది, కొన్ని వందల వేల సంవత్సరాలుగా హనుమనుతుని ఉపాసనతో శక్తి మంతులై, దీమంతులై తరించిన వారు ఉన్నారు.   ఒక్క హనుమాన్ చాలీసాను పూర్తి విశ్వాసంతో నిరంతర పారాయణ చేసి అధిగమించలేని బాధలను, రోగాలను, పీడలను, మానసిక శారీరిక దృఢత్వము కలిగి ముందుకు వెళ్ళిన వారు ఎంతో మంది.  అంత మహత్తు గలవి హనుమంతుని స్తోత్రాలు, మంత్రాలు.


ఎమ్మెస్ రామారావు గారి చాలీసా


మహానుభావులకు దైవానుగ్రహం ఎలా ఎప్పుడు కలుగుతుందో చెప్పలేము. తెలుగులో తొలి సినీ నేపథ్యగాయకులైన మోపర్తి ఎమ్మెస్ రామారావుగారికి హనుమంతుని కృప అలాగే కలిగింది. తెనాలిలో మోపర్తి రంగయ్య-మంగమ్మ దంపతులకు 1921 జూలై 3న జన్మించిన ఎమ్మెస్ రామారావు గారు నిడుబ్రోలులో పాఠశాల విద్యనభ్యసించి గుంటూరు హిందూ కళాశాలలో డిగ్రీ చదివారు. కాలేజీలో పాటల పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకున్న ఆయనను నండూరి సుబ్భారావు గారు చలనచిత్రాలలో పాడాలని ప్రోత్సహించారు. దానితో చెన్నై వెళ్లి నేపథ్య గాయకునిగా పేరొందారు. 1944-64 మధ్య ఇరవై ఏళ్ల పాటు చలన చిత్రాలలో పాటలు పాడారు. సినిమారంగంలో అవకాశాలు తగ్గిపోవటంతో రాజమండ్రిలో సత్యసాయి గురుకులంలో వార్డెన్  ఉద్యోగంలో చేరారు. తరువాత హనుమంతుని అనుగ్రహంతో తొలుత చాలీసా, తరువాత సుందరకాండ తెలుగులో రచించారు. అప్పటినుంచి ఆయన పేరు చెప్పగానే ఆ హనుమద్భక్తుని రూపమే ఆంధ్రదేశమంతా ప్రకటితమయ్యింది.

సాధారణంగా ఒక మహా రచనను ఇంకొక భాషలోకి అనువదిస్తే అందులో ఉన్న నిజ భావన, మాధుర్యము, సందర్భము, ఆ కవి అనుభూతి సంపూర్ణంగా అనువాదనలో కనిపించదు. ఎందుకంటే, ఆ సమయములో ఆ కవి అనుభవించిన భావన ఒక ప్రత్యేకమైన దైవిక శక్తి సంకల్పంతో  కూడి, జరిగితేనే అది మహా రచన అయ్యింది కాబట్టి, అదే అనుభూతి ఈ అనువాదం చేసే కవికి కలిగే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి. కానీ, హనుమాన్ చాలీసా విషయంలో తులసీదాసు పొందిన భావన, చూపించిన భక్తి, శరణాగతి మన తెలుగులోకి అనువదించిన శ్రీ ఎమ్మెస్ రామారావు గారు దాదాపు చూపించారు. అందుకే ఆయన రచించి ఆలపించిన సుందరకాండ, హనుమాన్ చాలీసా హనుమద్భక్తుల నోట మారు మ్రోగుతూనే ఉంది. ఆయన రచనలు బాగా ప్రాచుర్యం చెందటానికి కారణం భక్తి, భాష, భావన మూడు బాగా సమ్మిళితం చేయటం వలన మరియు అటువంటి రచనలు ఫలాపేక్ష లేకుండా, హనుమంతుని స్మరిస్తూ, అనుభవైకవేద్యమై అమృత గానం చేయటం వలన. కలియుగంలో భక్తి, స్తుతిని మించిన మోక్ష సాధనం లేదని ఎన్నో శృతి స్మృతి పురాణాలు ఘోషించాయి. ఆ మార్గాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకుని ఎమ్మెస్ రామారావు గారు తులసీదాస్ రచించిన చాలీసాను తెలుగులోకి అద్భుతంగా అనువదించారు, పాడారు. స్వతహాగా మంచి లలితా సంగీత, నేపథ్య గాయకులైన రామారావు గారు ఈ మార్గంలోకి వెళ్లి సంపూర్ణమైన అనుభూతిని మనకు పంచి ఇచ్చారు. ఆ మహానుభావునికి హృదయ పూర్వక నివాళులు.

తులసీదాసు హనుమాన్ చాలీసా సాహిత్యం:


శ్రీగురు చరణ సరోజ రజ నిజ మను ముకుర సుధారి
వరణౌ రఘువర విమల యశ జో దాయక ఫల చారి
బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవనకుమార్
బల బుద్ధి విద్యా దేహి మోహి హరహు కలేశ వికార్

జయ హనుమాన జ్ఞాన గుణ సాగర  జయ కపీశ తిహు లోక వుజాగర

రామ దూత అతులిత బల ధామా అంజనిపుత్ర పవనసుత నామా

మహావీర విక్రమ బజరంగీ కుమతి నివార సుమతి కే సంగీ

కంచన వరణ విరాజ సువేశా కానన కుండల కుంచిత కేశా

హాథ వజ్ర ఔర్ ధ్వజా విరాజై కాంధే మూంజ జనేవూ సాజై

శంకర సువన కేసరీనందన తేజ ప్రతాప మహా జగ వందన

విద్యావాన గుణీ అతి చాతుర రామ కాజ కరి వే కో ఆతుర

ప్రభు చరిత్ర సుని వే కో రసియా రామ లఖన సీతా మన బసియా

సూక్ష్మ రూప ధరి సియహి దిఖావా వికట రూప ధరి లంక జరావా

భీమ రూప ధరి అసుర సంహారే రామచంద్ర కే కాజ సవారే

లాయ సజీవన లఖన జియాయే శ్రీరఘువీర హరఖి వురలాయే

రఘుపతి కీన్హీ బహుత బడాయీ తుమ మమ ప్రియ భరతహి సమ భాయీ

సహస వదన తుమ్హరో యశ గావై అస కహి శ్రీపతి కంఠ లగావై

సనకాదిక బ్రహ్మాది మునీశా నారద శారద సహిత అహీశా

యమ కుబేర దిగపాల జహా తే కవి కోవిద కహి సకై కహా తే

తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా రామ మిలాయ రాజ పద దీన్హా

తుమ్హరో మంత్ర విభీషణ మానా లంకేశ్వర భయే సబ జగ జానా

యుగ సహస్ర యోజన పర భానూ లీల్యో తాహి మధుర ఫల జానూ

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ జలధి లాంఘి గయే అచర జనాహీ

దుర్గమ కాజ జగత కే జేతే సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే

రామ దుఆరే తుమ రఖవారే హోత న ఆజ్ఞా బిను పైఠారే

సబ సుఖ లహై తుమ్హారీ శరనా తుమ రక్షక కాహూ కో డరనా

ఆపన తేజ సమ్హారో ఆపై తీనోం లోక హాంకతే కాంపై

భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జబ నామ సునావై

నాసై రోగ హరై సబ పీరా జపత నిరంతర హనుమత వీరా

సంకట తే హనుమాన ఛుడావై మన క్రమ వచన ధ్యాన జో లావై

సబ పర రామ తపస్వీ రాజా తిన కే కాజ సకల తుమ సాజా

ఔర మనోరథ జో కోయీ లావై సోయీ అమిత జీవన ఫల పావై

చారో యుగ పరతాప తుమ్హారా హై పరసిద్ధ జగత ఉజియారా

సాధు సంత కే తుమ రఖవారే అసుర నికందన రామ దులారే

అష్ట సిద్ధి నౌ నిధి కే దాతా అస వర దీన జానకీ మాతా

రామ రసాయన తుమ్హరే పాసా సదా రహో రఘుపతి కే దాసా

తుమ్హరే భజన రామ కో పావై జనమ జనమ కే దుఖ బిసరావై

అంత కాల రఘుబర పుర జాయీ జహాం జన్మ హరిభక్త కహాయీ

ఔర దేవతా చిత్త న ధరయీ హనుమత సేఈ సర్బ సుఖ కరయీ

సంకట కటై మిటై సబ పీరా జో సుమిరై హనుమత బలవీరా

జై జై జై హనుమాన గోసాయీ కృపా కరహు గురు దేవ కీ నాయీ

జో సత బార పాఠ కర కోయీ ఛూటహి బంది మహా సుఖ హోయీ

జో యహ పఢై హనుమాన చలీసా హోయ సిద్ధి సాఖీ గౌరీసా

తులసీదాస సదా హరి చేరా కీజై నాథ హృదయ మహ డేరా

పవనతనయ సంకట హరణ మంగల మూరతి రూప
రామ లఖన సీతా సహిత హృదయ బసహు సుర భూప


ఎమ్మెస్ రామారావు గారి తెలుగు హనుమాన్ చాలీసా సాహిత్యం



శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు
బుద్ధిహీనతను గలిగిన తనువులు బుద్బుదములని తెలుపు సత్యములు 

జయహనుమంత జ్ఞాన గుణ వందిత జయ పండిత త్రిలోక పూజిత
రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుత నామ

ఉదయభానుని   మధుర ఫలమని భావన లీల అమృతమును గ్రోలిన
కాంచన వర్ణ విరాజిత వేష కుండల మండిత కుంచిత కేశ 

రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజ పదవిని సుగ్రీవున నిలిపి
జానకీపతి ముద్రిక దోడ్కొని జలధి లంఘించి లంక జేరుకొని 

సూక్ష్మ రూపమున సీతను జూచి వికట రూపమున లంకను గాల్చి 
భీమరూపమున అసురుల జంపిన రామ కార్యమును సఫలము జేసిన

సీత జాడ గని వచ్చిన నిను గని శ్రీ రఘువీరుడు కౌగిట నినుగొని 
సహస్ర రీతుల నిను గొనియాడగ కాగల కార్యము నీపై నిడగ 

వానరసేనతో వారధి దాటి లంకేశునితో తలపడి పోరి
 హోరుహోరున పోరు సాగిన అసుర సేనల వరుసను గూల్చిన

లక్ష్మణ మూర్ఛతో రాముడడలగ సంజీవి దెచ్చిన ప్రాణ ప్రదాత
రామలక్ష్మణుల అస్త్రధాటికి అసురవీరులు అస్తమించిరి 

తిరుగులేని శ్రీరామబాణము జరిపించెను రావణ సంహారము 
ఎదురులేని ఆ లంకాపురమున ఏలికగా విభీషణు  జేసిన 

సీతారాములు నగవుల గనిరి ముల్లోకాల హారతులందిరి
అంతులేని ఆనందాశ్రువులే అయోధ్యాపురి పొంగిపొరలే 

సీతారాముల సుందర మందిరం శ్రీకాంతుపదం నీ హృదయం 
రామ చరిత కర్ణామృత గాన రామ నామ రసామృత పాన 

దుర్గమమగు ఏ కార్యమైనా సుగామమే యగు నీ కృపజాలిన
కలుగు సుఖములు నిను శరణన్న తొలగు భయములు నీ రక్షణయున్న 

రామ ద్వారపు కాపరి వైన నీ కట్టడి మీర బ్రహ్మాదుల తరమా     
భూత పిశాచ శాకిని ఢాకిని భయపడి పారు నీ నామజపము విని

ధ్వజా విరాజా వజ్ర శరీరా భుజబల తేజా గదాధరా 
ఈశ్వరాంశ సంభూత పవిత్ర  కేసరీ పుత్ర పావన గాత్ర 

సనకాదులు బ్రహ్మాది దేవతలు శారద నారద ఆదిశేషులు
యమకుబేర దిక్పాలురు కవులు పులకితులైరి నీ కీర్తి గానముల 

సోదర భరత సమానా యని శ్రీరాముడు ఎన్నిక గొన్న హనుమా 
సాధుల పాలిట ఇంద్రుడవన్నా అసురుల పాలిట కాలుడవన్నా

అష్టసిద్ధి నవనిధులకు దాతగ జానకీ మాత దీవించెనుగ  
రామ రసామృత పానము జేసిన మృత్యుంజయుడవై వెలసిన 

నీ నామ భజన శ్రీ రామ రంజన జన్మ జన్మాంతర దుఃఖ భంజన 
ఎచ్చటుండినా రఘువరదాసు చివరకు రాముని చేరుట తెలుసు
  
ఇతర చింతనలు మనసున మోతలు స్థిరముగా మారుతి సేవలు సుఖములు
ఎందెందున శ్రీరామ కీర్తన అందందున  హనుమాను నర్తన

శ్రద్ధగ దీనిని ఆలకింపుమా శుభమగు ఫలములు కలుగు సుమా
భక్తి మీరగా గానము చేయగ ముక్తి గలుగు గౌరీశులు సాక్షిగా 

తులసీదాస హనుమాన్ చాలీసా  తెలుగున సుళువుగ నలుగురు పాడగ
పలికిన సీతారాముని పలుకున దోషములున్న మన్నింపుమన్న 

మంగళ హారతి గొను హనుమంత సీతా రామ లక్ష్మణ సమేత
నా అంతరాత్మ నిలుమో అనంత నీవే అంతా శ్రీ హనుమంత

పరిశీలన:

మొట్ట మొదట: రామారావు గారి చాలీసాలోని శ్లోకాలు తులసీదాసు చాలీసాలోని శ్లోకాల వరుసలో లేవు. కొంత రామాయణ గాథను అనుసరించి తన అనువాదాన్ని చేసినట్టు అర్థమవుతున్నది.

ఎమ్మెస్ రామారావు గారి ప్రయత్నం పూర్తి అనువాదం కాదు.  తులసీదాసుని హృదయాంతరంగము నుండి వెలువడిన మహామంత్ర సమానమైన చాలీసా పూర్తిగా రామాయణంలో హనుమంతుని భక్తిని, వీరత్వమును, రాక్షస సంహారమును, రామ చరణారవింద దాస్యమును, రామభక్తి మహాత్మ్యమును విషాద పరచి, ఆ హనుమంతుని స్మరణ సామాన్య మానవుల కష్టాలను, దౌర్బల్యాలను దూరం చేయటానికి దోహద పడుతుంది అని ఉద్బోధిస్తుంది. ఇదే భావనను, కొంత కుదించి, కొంత ఆధ్యాత్మికంగా మెరుగు దిద్ది, సీతారామచంద్రుల కీర్తిని, వారియందు హనుమంతునికి గల భక్తిని, ఆయన గుణ గణములను అచ్చ తెలుగులో మన ముందుంచారు రామారావు గారు. 

ముందు ధ్యాన శ్లోకము చూడండి:

తులసీదాసు 'నా మనసు అనే మలిన పడ్డ అద్దాన్ని శ్రీ గురు చరణ కమలములతో శుద్ధి చేసి, నేను రఘువరుని విమలమైన యశస్సును కీర్తిస్తున్నాను. దాని వలన ఆ ప్రభువు నాకు నాలుగు (బహు విధములు అని అర్థము) విధములైన ఫలము ఇస్తున్నాడు. బుద్దిహీనుడ నైన నేను ఆ వాయుపుత్రుని నా మనసు యందు ధ్యానించి, నాకు బలము, బుద్ధి, విద్య ఇచ్చి, నాకున్న క్లేశములన్నీ తొలగించుము అని ఆ హనుమంతుని ప్రార్థిస్తున్నాను. ' అని నుతిస్తే రామారావు గారు - 'ఆ హనుమంతుని చరణములు ఇహము, పరము సాధనకు శరణములు అని, బుద్ధి హీనత కలిగిన శరీరము నీటి బుడగ వంటి సత్యమును తెలిపేవి' అని ఇంకొంచెం వైరాగ్యము, పై మెట్టు అధ్యాతిమిక భావన కలిగించారు.

వీలైనంత తులసీదాసు ఉపయోగించిన ప్రాకృత భాషా పదాలను అలాగే ఉంచి ఆ మహానుభావుని పట్ల తన గౌరవాన్ని, తులసీదాసు అక్షరమాలలో ఉన్న దైవ బలాన్ని పునరుద్ఘాటించారు. మిగిలిన చాలీసాలో చాలా మటుకు సరళ అక్షరాలను వాడి, కష్టమైన ఒత్తులు, గుణింతాలు లేకుండా రచించారు.

రామారావుగారి చాలీసా సరళమైన తెలుగులోనే ఉంది కాబట్టి తులసీ చాలీసా భావార్థము తెలుగు చాలీసా సాహిత్యంలో తేలిగ్గానే అర్థమవుతుందని భావిస్తున్నాను. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి