9, సెప్టెంబర్ 2010, గురువారం

పితృ పక్షాలు

పితృ తర్పణాలు నదీ క్షేత్రాల్లో చేస్తే చాలా మంచిది

భాద్రపద మాసం వచ్చేసింది. పౌర్ణమి తర్వాతి పాడ్యమి నుండి అమావాస్య వరకు మహాలయ పక్షాలు. శుభ కార్యాలు ఏమీ ఉండవు. దేశమంతటా పితృపక్షాలుగా పాటిస్తారు. (తల్లిదండ్రులు లేని వారికి మాత్రమే) - పితృ కార్యాల మీద నమ్మకము ఉన్నవారికి - ఎవరైన ప్రతి సంవత్సరం పితరులకు శ్రాద్ధ కర్మ సరిగ్గా చేయని వారుంటే వారిని గుర్తు చేసుకొని వారు మరణించిన తిథినాడు (ఈ పదిహేను రోజుల్లో) వారికి తర్పణాలు, క్రియలు చేయవచ్చు. తిథి నాడు కుదరకపోతే, చివరిరోజైన అమావాస్య నాడు చెయ్యండి. దీనిని మహాలయ అమావాస్య అంటారు. అత్యంత పవిత్రమైన దినం మన పితరులను తలచుకొని వారికి మన గౌరవాన్ని తెలపటానికి. ఇది చేసే వెసులుబాటు లేకపోతే, సద్బ్రాహ్మణునికి మీకు తోచింది దానం చెయ్యండి. చిన్నగా చేసినా, పెద్దగా చేసినా - క్రియా విధానం కన్నా మనసులో శ్రద్ధ, విశ్వాసం ముఖ్యం.

మనవి: తెలిసి తెలిసి అపాత్ర దానం (అయోగ్యుడైన వానికి దానం) మాత్రం  చెయ్యకండి. దీనివల్ల పుణ్యం కాకుండా పాపం వస్తుంది. ఏమీ కుదరకపోతే, శ్రద్ధతో ఒక నమస్కారం పెట్టి వదిలెయ్యండి చాలు. 

ఈ పితృ పక్షాలు అవ్వగానే, శరన్నవరాత్రులు. వాటి ప్రాధాన్యత గురించి ఈ నెలాఖరుకి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి