25, మే 2010, మంగళవారం

వందనములు

మొదట నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు సరస్వతి, రామారావు గారికి,  తర్వాత నా గురువులు బ్రహ్మశ్రీ నిడుగొంది రమణారావు గారికి, శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామి వారికి, సద్గురు సాయినాథ్ మహారాజులకు, నా జన్మభూమి భారతదేశానికి, తెలుగు సీమ ఆంధ్ర ప్రదేశ్ కి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.

నిర్విఘ్నంగా ఈ బ్లాగింగు కొనసాగించటానికి ఆ గణపతిని ప్రార్థిస్తూ:

ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోక రక్షకం
అనాయకైక నాయకం వినాశితే భదైత్యకం నతా శుభాశునాశకం నమామి తం వినాయకం

చదువుల తల్లి సరస్వతిని కొలుస్తూ:

యాకుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్వితా
యావీణా వరదండ మండిత కరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతిర్దేవైసదావందితా
సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపః

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి